Droupadi Murmu: పూరీ బీచ్లో వాకింగ్ చేసిన రాష్ట్రపతి ముర్ము.. కీలక సందేశం..!
- పూరీ బీచ్ లో భారత రాష్ట్రపతి మార్నింగ్ వాక్..
- మనం ప్రకృతిలో భాగమని గుర్తు చేసిన రాష్ట్రపతి ముర్ము..
- స్వల్పకాలిక ప్రయోజనాల కోసం ప్రకృతిని మానవజాతి దోపిడీ చేస్తోంది: ద్రౌపది ముర్ము
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Droupadi Murmu: ఒడిశా రాష్ట్రంలోని పూరీలో జగన్నాథ రథయాత్ర రెండో రోజు కొనసాగుతుంది. ఈ రథయాత్ర సందర్భంగా పూరీకి వెళ్లిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. పూరీ బీచ్లో మార్నింగ్ వాకింగ్ చేశారు. ఈ సందర్భంగా.. జీవిత సారాంశంతో మనల్ని సన్నిహితంగా ఉంచే.. మనం ప్రకృతిలో భాగమని గుర్తు చేసే ప్రదేశాలు ఉన్నాయని ఆమె బీచ్ గురించి ఎక్స్ వేదికగా ట్విట్ట్ చేసింది. పర్వతాలు, అడవులు, నదులు, సముద్ర తీరాలు మనస్సును ఆకర్షిస్తాయన్నారు. ఈ రోజు సముద్ర తీరం వెంట నడుస్తుంటే, పరిసరాలతో ఒక కలయికను అనుభవించాను అని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఆ అలల గర్జన, అపారమైన నీటి విస్తీర్ణం, ఇది ఒక ధ్యాన అనుభవం అని ద్రౌపది ముర్ము తెలిపారు.
Read Also: Bus Accident : హర్యానాలో స్కూల్ బస్సు బోల్తా.. 40 మంది పిల్లలకు గాయాలు
Also Read
కాగా, శ్రీ జగన్నాథ్ని దర్శనం చేసుకున్నప్పుడు, నేను ప్రగాఢ అంతర్గత శాంతిని అనుభవించాను అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. అలాంటి అనుభవాన్ని కలిగి ఉండటంలో నేను ఒంటరిగా లేను అని చెప్పారు. మన బిజీ వర్క్ తో ప్రకృతితో ఉన్న ఈ అనుబంధాన్ని కోల్పోతున్నామన్నారు. మానవజాతి ప్రకృతిపై పట్టు సాధించింది.. స్వల్పకాలిక ప్రయోజనాల కోసం ప్రకృతిని దోపిడీ చేస్తోంది.. దాని ఫలితం అందరూ చూడాల్సిందే అని రాష్ట్రపతి ముర్ము వెల్లడించారు.
Read Also: Kalki 2898 AD Collections : కల్కి ఇప్పట్లో ఆగేలా లేడు…ఓవర్ సీస్ లో ఆపేవాడు రాడు..
అయితే, ఈ వేసవిలో భారతదేశంలోని చాలా ప్రాంతాలు భయంకరమైన వేడి గాలులను ఎదుర్కొన్నాయి.. ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన వాతావరణంలో మార్పుల వల్ల విపరీతమైన అనర్థాలు చోటు చేసుకున్నాయని చెప్పారు. రాబోయే దశాబ్దాంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది అని రాష్ట్రపతి హెచ్చరించారు. గ్లోబల్ వార్మింగ్ ప్రపంచ సముద్ర మట్టాల పెరుగుదలకు దారి తీస్తోంది అని పేర్కొన్నారు. తీర ప్రాంతాలను ముంచెత్తే అవకాశం ఉంది.. అలాగే, మహాసముద్రాలు, అక్కడ కనిపించే వివిధ రకాల వృక్షజాలం, జంతుజాలం వివిధ రకాల కాలుష్యం కారణంగా తీవ్రంగా నష్టపోయాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!