Droupadi Murmu: పూరీ బీచ్లో వాకింగ్ చేసిన రాష్ట్రపతి ముర్ము.. కీలక సందేశం..!
- పూరీ బీచ్ లో భారత రాష్ట్రపతి మార్నింగ్ వాక్..
- మనం ప్రకృతిలో భాగమని గుర్తు చేసిన రాష్ట్రపతి ముర్ము..
- స్వల్పకాలిక ప్రయోజనాల కోసం ప్రకృతిని మానవజాతి దోపిడీ చేస్తోంది: ద్రౌపది ముర్ము
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Droupadi Murmu: ఒడిశా రాష్ట్రంలోని పూరీలో జగన్నాథ రథయాత్ర రెండో రోజు కొనసాగుతుంది. ఈ రథయాత్ర సందర్భంగా పూరీకి వెళ్లిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. పూరీ బీచ్లో మార్నింగ్ వాకింగ్ చేశారు. ఈ సందర్భంగా.. జీవిత సారాంశంతో మనల్ని సన్నిహితంగా ఉంచే.. మనం ప్రకృతిలో భాగమని గుర్తు చేసే ప్రదేశాలు ఉన్నాయని ఆమె బీచ్ గురించి ఎక్స్ వేదికగా ట్విట్ట్ చేసింది. పర్వతాలు, అడవులు, నదులు, సముద్ర తీరాలు మనస్సును ఆకర్షిస్తాయన్నారు. ఈ రోజు సముద్ర తీరం వెంట నడుస్తుంటే, పరిసరాలతో ఒక కలయికను అనుభవించాను అని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఆ అలల గర్జన, అపారమైన నీటి విస్తీర్ణం, ఇది ఒక ధ్యాన అనుభవం అని ద్రౌపది ముర్ము తెలిపారు.
Read Also: Bus Accident : హర్యానాలో స్కూల్ బస్సు బోల్తా.. 40 మంది పిల్లలకు గాయాలు
Also Read
కాగా, శ్రీ జగన్నాథ్ని దర్శనం చేసుకున్నప్పుడు, నేను ప్రగాఢ అంతర్గత శాంతిని అనుభవించాను అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. అలాంటి అనుభవాన్ని కలిగి ఉండటంలో నేను ఒంటరిగా లేను అని చెప్పారు. మన బిజీ వర్క్ తో ప్రకృతితో ఉన్న ఈ అనుబంధాన్ని కోల్పోతున్నామన్నారు. మానవజాతి ప్రకృతిపై పట్టు సాధించింది.. స్వల్పకాలిక ప్రయోజనాల కోసం ప్రకృతిని దోపిడీ చేస్తోంది.. దాని ఫలితం అందరూ చూడాల్సిందే అని రాష్ట్రపతి ముర్ము వెల్లడించారు.
Read Also: Kalki 2898 AD Collections : కల్కి ఇప్పట్లో ఆగేలా లేడు…ఓవర్ సీస్ లో ఆపేవాడు రాడు..
అయితే, ఈ వేసవిలో భారతదేశంలోని చాలా ప్రాంతాలు భయంకరమైన వేడి గాలులను ఎదుర్కొన్నాయి.. ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన వాతావరణంలో మార్పుల వల్ల విపరీతమైన అనర్థాలు చోటు చేసుకున్నాయని చెప్పారు. రాబోయే దశాబ్దాంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది అని రాష్ట్రపతి హెచ్చరించారు. గ్లోబల్ వార్మింగ్ ప్రపంచ సముద్ర మట్టాల పెరుగుదలకు దారి తీస్తోంది అని పేర్కొన్నారు. తీర ప్రాంతాలను ముంచెత్తే అవకాశం ఉంది.. అలాగే, మహాసముద్రాలు, అక్కడ కనిపించే వివిధ రకాల వృక్షజాలం, జంతుజాలం వివిధ రకాల కాలుష్యం కారణంగా తీవ్రంగా నష్టపోయాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?