Droupadi Murmu: పూరీ బీచ్లో వాకింగ్ చేసిన రాష్ట్రపతి ముర్ము.. కీలక సందేశం..!
- పూరీ బీచ్ లో భారత రాష్ట్రపతి మార్నింగ్ వాక్..
- మనం ప్రకృతిలో భాగమని గుర్తు చేసిన రాష్ట్రపతి ముర్ము..
- స్వల్పకాలిక ప్రయోజనాల కోసం ప్రకృతిని మానవజాతి దోపిడీ చేస్తోంది: ద్రౌపది ముర్ము
Droupadi Murmu: ఒడిశా రాష్ట్రంలోని పూరీలో జగన్నాథ రథయాత్ర రెండో రోజు కొనసాగుతుంది. ఈ రథయాత్ర సందర్భంగా పూరీకి వెళ్లిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. పూరీ బీచ్లో మార్నింగ్ వాకింగ్ చేశారు. ఈ సందర్భంగా.. జీవిత సారాంశంతో మనల్ని సన్నిహితంగా ఉంచే.. మనం ప్రకృతిలో భాగమని గుర్తు చేసే ప్రదేశాలు ఉన్నాయని ఆమె బీచ్ గురించి ఎక్స్ వేదికగా ట్విట్ట్ చేసింది. పర్వతాలు, అడవులు, నదులు, సముద్ర తీరాలు మనస్సును ఆకర్షిస్తాయన్నారు. ఈ రోజు సముద్ర తీరం వెంట నడుస్తుంటే, పరిసరాలతో ఒక కలయికను అనుభవించాను అని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఆ అలల గర్జన, అపారమైన నీటి విస్తీర్ణం, ఇది ఒక ధ్యాన అనుభవం అని ద్రౌపది ముర్ము తెలిపారు.
Read Also: Bus Accident : హర్యానాలో స్కూల్ బస్సు బోల్తా.. 40 మంది పిల్లలకు గాయాలు
Also Read
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం కీలక ప్రకటన..
- Honeymoon murder: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ రఘువంశీకి బెయిల్..
- Gujarat Local Body Elections: గోధ్రాలో సంచలనం.. ముస్లిం మెజారిటీ ఏరియాలో గెలిచిన హిందూ మహిళ..
- Aadhaar Card: మీకు ఇది తెలుసా? మీ ఆధార్ కార్డు మీ పుట్టిన తేదీకి గ్యారెంటీ కాదట! ఎందుకో తెలుసా..
కాగా, శ్రీ జగన్నాథ్ని దర్శనం చేసుకున్నప్పుడు, నేను ప్రగాఢ అంతర్గత శాంతిని అనుభవించాను అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. అలాంటి అనుభవాన్ని కలిగి ఉండటంలో నేను ఒంటరిగా లేను అని చెప్పారు. మన బిజీ వర్క్ తో ప్రకృతితో ఉన్న ఈ అనుబంధాన్ని కోల్పోతున్నామన్నారు. మానవజాతి ప్రకృతిపై పట్టు సాధించింది.. స్వల్పకాలిక ప్రయోజనాల కోసం ప్రకృతిని దోపిడీ చేస్తోంది.. దాని ఫలితం అందరూ చూడాల్సిందే అని రాష్ట్రపతి ముర్ము వెల్లడించారు.
Read Also: Kalki 2898 AD Collections : కల్కి ఇప్పట్లో ఆగేలా లేడు…ఓవర్ సీస్ లో ఆపేవాడు రాడు..
అయితే, ఈ వేసవిలో భారతదేశంలోని చాలా ప్రాంతాలు భయంకరమైన వేడి గాలులను ఎదుర్కొన్నాయి.. ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన వాతావరణంలో మార్పుల వల్ల విపరీతమైన అనర్థాలు చోటు చేసుకున్నాయని చెప్పారు. రాబోయే దశాబ్దాంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది అని రాష్ట్రపతి హెచ్చరించారు. గ్లోబల్ వార్మింగ్ ప్రపంచ సముద్ర మట్టాల పెరుగుదలకు దారి తీస్తోంది అని పేర్కొన్నారు. తీర ప్రాంతాలను ముంచెత్తే అవకాశం ఉంది.. అలాగే, మహాసముద్రాలు, అక్కడ కనిపించే వివిధ రకాల వృక్షజాలం, జంతుజాలం వివిధ రకాల కాలుష్యం కారణంగా తీవ్రంగా నష్టపోయాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.
తాజావార్తలు
-
Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
-
JD Chakravarthy: “అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకూ కాస్టింగ్ కౌచ్ ఉంటుంది!” జేడీ చక్రవర్తి షాకింగ్ కామెంట్స్..
-
PBKS vs RR: పంజాబ్ కింగ్స్కి అగ్నిపరీక్ష.. టాస్ గెలిచిన రాజస్థాన్! జట్టును రక్షించే బాధ్యత శ్రేయస్ అయ్యర్దే!
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
-
UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో