Droupadi Murmu: భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతుంది.. రాజ్యాంగ దినోత్సవ ప్రసంగంలో రాష్ట్రపతి వ్యాఖ్య
- భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతుంది
- పార్లమెంట్ను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి
- 9 భారతీయ భాషల్లో రాజ్యాంగ వెర్షన్లు విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశం మూడోవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పార్లమెంట్ హాల్లో రాజ్యాంగ నిర్మాతలకు నివాళులర్పించారు. అనంతరం తొమ్మిది భారతీయ భాషల్లో అనువాద వెర్షన్లను విడుదల చేశారు. అనంతరం పార్లమెంట్ సంవిధాన్ సదన్లో ఉభయ సభల ఎంపీలను ఉద్దేశించి ద్రౌపది ముర్ము ప్రసంగించారు.
ఇది కూడా చదవండి: Delhi Car Blast: ఢిల్లీ బ్లాస్ట్ కేసులో మరొకరు అరెస్ట్.. ఉమర్తో ఎలాంటి సంబంధం ఉందంటే..!
Also Read
- Railway Bedsheet Kurta: ఎంతకు తెగించార్రా.. రైల్వే బెడ్షీట్తో కుర్తా ఏంటయ్యా.? వైరల్ వీడియో..
- CJP Protest: "4 గంటల సమయం దండగ".. జేపీ నడ్డాతో భేటీపై సీజేపీ నేతల తీవ్ర ఆగ్రహం!
- Supreme Court: గొడవలు జరిగితే భర్త ఉద్యాగాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? సుప్రీంకోర్టు ఆందోళన!
- PM Modi: "నీట్ పేపర్ లీక్ 'ఘోర పాపం'.. కఠిన శిక్ష తప్పదు".. ప్రధాని మోడీ సీరియస్ వార్నింగ్
రాజ్యాంగ దినోత్సవ చారిత్రాత్మక సందర్భంగా మీ అందరి మధ్య ఉండటం తనకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు. నవంబర్ 26, 1949న రాజ్యాంగ సభ సభ్యులు భారత రాజ్యాంగాన్ని రూపొందించే పనిని పూర్తి చేశారని గుర్తుచేశారు. ఆ సంవత్సరం ఇదే రోజున రాజ్యాంగాన్ని ఆమోదించారని తెలిపారు. ముసాయిదా కమిటీ ఛైర్మన్ బాబా సాహెబ్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్.. రాజ్యాంగ ప్రధాన శిల్పిలో ఒకరు అని పేర్కొన్నారు. రాజ్యాంగం అందరికీ సమాన హక్కులను ఇస్తుందని తెలిపారు.
ఇది కూడా చదవండి: Gold Rates: గోల్డ్ లవర్స్కు మళ్లీ షాక్.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!
ఇక రాజ్యాంగాన్ని తొమ్మిది భారతీయ భాషల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు. మలయాళం, మరాఠీ, నేపాలీ, పంజాబీ, బోడో, కాశ్మీరీ, తెలుగు, ఒడియా, అస్సామీలతో సహా తొమ్మిది భాషల్లో అనువాద వెర్షన్లను రాష్ట్రపతి విడుదల చేశారు. దేశవ్యాప్తంగా పౌరులకు రాజ్యాంగం అందుబాటులోకి తీసుకురావడం, రాజ్యాంగ హక్కులు, విధులపై అవగాహన పెంచడం ఈ చర్య అద్భుతం అంటూ ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సీపీ.రాధాకృష్ణన్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు, ప్రతిపక్ష నేతలు రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Railway Bedsheet Kurta: ఎంతకు తెగించార్రా.. రైల్వే బెడ్షీట్తో కుర్తా ఏంటయ్యా.? వైరల్ వీడియో..
-
CJP Protest: “4 గంటల సమయం దండగ”.. జేపీ నడ్డాతో భేటీపై సీజేపీ నేతల తీవ్ర ఆగ్రహం!
-
Home Minister Anitha: ‘ఫ్యూచర్ రెడీ ఏపీ పోలీస్’ వర్క్షాప్.. పోలీసు వ్యవస్థపై హోంమంత్రి కీలక వ్యాఖ్యలు
-
Supreme Court: గొడవలు జరిగితే భర్త ఉద్యాగాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? సుప్రీంకోర్టు ఆందోళన!
-
Arthritis Pain in Monsoon: వర్షాకాలంలో కీళ్ల నొప్పితో ఇబ్బందా..? నిపుణులు సూచించిన 5 చిట్కాలు మీ కోసం..
ట్రెండింగ్
-
Realme Power Days సేల్.. P4 Power 5G, P4 Pro 5Gపై భారీ తగ్గింపు.. ఆఫర్లు ఇవే.!
-
Rohit Sharma Retirement: రోహిత్ మనసులో రెండు గాయాలు.. అందుకే రిటైర్ కాలేదు.. మరి ఎప్పుడు?
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!