Droupadi Murmu: భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతుంది.. రాజ్యాంగ దినోత్సవ ప్రసంగంలో రాష్ట్రపతి వ్యాఖ్య
- భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతుంది
- పార్లమెంట్ను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి
- 9 భారతీయ భాషల్లో రాజ్యాంగ వెర్షన్లు విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశం మూడోవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పార్లమెంట్ హాల్లో రాజ్యాంగ నిర్మాతలకు నివాళులర్పించారు. అనంతరం తొమ్మిది భారతీయ భాషల్లో అనువాద వెర్షన్లను విడుదల చేశారు. అనంతరం పార్లమెంట్ సంవిధాన్ సదన్లో ఉభయ సభల ఎంపీలను ఉద్దేశించి ద్రౌపది ముర్ము ప్రసంగించారు.
ఇది కూడా చదవండి: Delhi Car Blast: ఢిల్లీ బ్లాస్ట్ కేసులో మరొకరు అరెస్ట్.. ఉమర్తో ఎలాంటి సంబంధం ఉందంటే..!
Also Read
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
- Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
- PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
రాజ్యాంగ దినోత్సవ చారిత్రాత్మక సందర్భంగా మీ అందరి మధ్య ఉండటం తనకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు. నవంబర్ 26, 1949న రాజ్యాంగ సభ సభ్యులు భారత రాజ్యాంగాన్ని రూపొందించే పనిని పూర్తి చేశారని గుర్తుచేశారు. ఆ సంవత్సరం ఇదే రోజున రాజ్యాంగాన్ని ఆమోదించారని తెలిపారు. ముసాయిదా కమిటీ ఛైర్మన్ బాబా సాహెబ్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్.. రాజ్యాంగ ప్రధాన శిల్పిలో ఒకరు అని పేర్కొన్నారు. రాజ్యాంగం అందరికీ సమాన హక్కులను ఇస్తుందని తెలిపారు.
ఇది కూడా చదవండి: Gold Rates: గోల్డ్ లవర్స్కు మళ్లీ షాక్.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!
ఇక రాజ్యాంగాన్ని తొమ్మిది భారతీయ భాషల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు. మలయాళం, మరాఠీ, నేపాలీ, పంజాబీ, బోడో, కాశ్మీరీ, తెలుగు, ఒడియా, అస్సామీలతో సహా తొమ్మిది భాషల్లో అనువాద వెర్షన్లను రాష్ట్రపతి విడుదల చేశారు. దేశవ్యాప్తంగా పౌరులకు రాజ్యాంగం అందుబాటులోకి తీసుకురావడం, రాజ్యాంగ హక్కులు, విధులపై అవగాహన పెంచడం ఈ చర్య అద్భుతం అంటూ ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సీపీ.రాధాకృష్ణన్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు, ప్రతిపక్ష నేతలు రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!