Sanjivani Scam: సంజీవని స్కామ్పై బహిరంగ చర్చకు సిద్ధం: కేంద్ర మంత్రి షెకావత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanjivani Scam: సంజీవని స్కామ్పై బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్పష్టం చేశారు. సంజీవని క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ కుంభకోణం వ్యవహారంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తనపై చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు రావాలని కేంద్ర మంత్రి సవాల్ విసిరారు. జోధ్పూర్ ఎంపీగా ఉన్న షెకావత్ అనేక మంది పెట్టుబడిదారులను కోట్లాది రూపాయలు మోసం చేసిన స్కాంలో ప్రమేయం ఉందని గెహ్లాట్ పదేపదే ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.
Read also: Maruti Suzuki: మీకొచ్చే రూ.30వేల జీతంలో మీకిష్టమైన కారును ఇంటికి తెచ్చుకోండి
Also Read
- Ola, Uber, Rapido: ఓలా, ఉబర్, ర్యాపిడో యూజర్లకు గుడ్ న్యూస్.. 'అడ్వాన్స్ టిప్' విధానానికి కేంద్రం చెక్
- Parliament Monsoon Session: 18 రోజులు.. చర్చ కంటే వాయిదాలే ఎక్కువ! ముగిసిన పార్లమెంట్ సమావేశాలు..
- Explainer: అమెరికా కుట్ర? ఏకమౌతున్న ముస్లిం దేశాలు..!
- Peer Ali Khan: పుస్తకాల మధ్య పుట్టిన తిరుగుబాటు.. ఉరికంబం ముందు తలవంచని పీర్ అలీ ఖాన్!
కేంద్ర మంత్రి షెకావత్ తనకు క్రెడిట్ సొసైటీతో సంబంధం ఉందనే ఆరోపణలను తోసిపుచ్చారు. అశోక్ గెహ్లాట్పై ఢిల్లీ కోర్టులో పరువు నష్టం కేసు కూడా వేశారు. గెహ్లాట్ చేసిన ఆరోపణల గురించి జైసల్మేర్లో విలేకరులు ప్రశ్నించగా..భారతదేశంలో ఏదైనా వేదికపై నిలబడి నా ముందు వాదించమని నేను తనని మరియు అతని న్యాయవాదులను సవాలు చేస్తున్నానని అన్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో ఆయన కుమారుడు వైభవ్ గెహ్లాట్ ఓటమి పాలైనందుకే ముఖ్యమంత్రి తనపై ఆరోపణలు చేశారని షెకావత్ అన్నారు. జోధ్పూర్ లోక్సభ స్థానంలో కేంద్ర మంత్రి వైభవ్ గెహ్లాట్పై గజేంద్ర సింగ్ షెకావత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. జోధ్పూర్.. ముఖ్యమంత్రి గెహ్లాట్ యొక్క స్వస్థలం.
Read also: Anasuya Bhradwaj: బికినీ ఫోటోలు షేర్ చేసిన అనసూయ.. మిస్ అవ్వకూడదంట!
గెహ్లాట్ మరియు అతని కొడుకుపై బిజెపి రాజ్యసభ సభ్యులు కిరోడి లాల్ మీనా చేసిన అవినీతి ఆరోపణలను తాను రుజువు చేస్తానని తెలిపారు. కోట్లాది రూపాయల నల్లధనాన్ని తెల్లగా మార్చే పనిని వారు చేస్తున్నారని కేంద్ర మంత్రి ఆరోపించారు. సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమం అనే ఇతివృత్తంతో కేంద్రం విశేషమైన పని చేసిందని షెకావత్ అన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం పని చేయడం వల్లే నేడు ప్రజలకు వ్యవస్థపై విశ్వాసం ఉందని ఆయన నొక్కి చెప్పారు. ప్రభుత్వం తమ కోసమే పనిచేస్తుందని పేదలు గుర్తిస్తున్నారని, ప్రజాస్వామ్యంలో సరైన పార్టీని ఎన్నుకుంటేనే సరైన పని జరుగుతుందని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!
-
Ola, Uber, Rapido: ఓలా, ఉబర్, ర్యాపిడో యూజర్లకు గుడ్ న్యూస్.. ‘అడ్వాన్స్ టిప్’ విధానానికి కేంద్రం చెక్
-
CM Chandrababu: ఇది ప్రారంభం మాత్రమే.. దేశంలోనే నంబర్ వన్ రాజధానిగా అమరావతి..!
-
Raveena Tandon : కూతురిని మించి జెట్ స్పీడ్లో సినిమాలు చేస్తున్న ఒకప్పటి గ్లామరస్ బ్యూటీ
-
Dharman: ‘ధర్మన్’ రెండో షెడ్యూల్ షూటింగ్ మొదలు పెట్టిన రజనీకాంత్.. 2027 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్!
ట్రెండింగ్
-
Rohit Sharma: ఇక నేను ఆడను.. అదే చివరిది.. రోహిత్ శర్మ భావోద్వేగం!
-
HONOR Robot Phone లాంచ్.. 200MP డ్యూయల్ కెమెరాలు, 200x జూమ్, 7,060mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్..
-
Gautam Gambhir-BCCI: గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ పోస్ట్ సేఫ్.. ఆ రెండు కారణాల వల్లే!
-
40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!
-
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!