Sanjivani Scam: సంజీవని స్కామ్పై బహిరంగ చర్చకు సిద్ధం: కేంద్ర మంత్రి షెకావత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanjivani Scam: సంజీవని స్కామ్పై బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్పష్టం చేశారు. సంజీవని క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ కుంభకోణం వ్యవహారంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తనపై చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు రావాలని కేంద్ర మంత్రి సవాల్ విసిరారు. జోధ్పూర్ ఎంపీగా ఉన్న షెకావత్ అనేక మంది పెట్టుబడిదారులను కోట్లాది రూపాయలు మోసం చేసిన స్కాంలో ప్రమేయం ఉందని గెహ్లాట్ పదేపదే ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.
Read also: Maruti Suzuki: మీకొచ్చే రూ.30వేల జీతంలో మీకిష్టమైన కారును ఇంటికి తెచ్చుకోండి
Also Read
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్పై భారత్ ఆగ్రహం..
- Swara Bhasker: ఇతర మహిళల్ని గౌరవించడం నేర్చుకో.. స్వరా భాస్కర్ వ్యాఖ్యలపై బీజేపీ..
- CM Vijay: సీఎం విజయ్ను కలిసిన టీఎంసీ రెబెల్ ఎంపీ సయానీ ఘోష్
- Yasin Malik: ‘‘నన్ను ఉరితీయక ముందే నిన్ను విముక్తి చేస్తా’’.. భార్యకు యాసిన్ మాలిక్ విడాకులు
కేంద్ర మంత్రి షెకావత్ తనకు క్రెడిట్ సొసైటీతో సంబంధం ఉందనే ఆరోపణలను తోసిపుచ్చారు. అశోక్ గెహ్లాట్పై ఢిల్లీ కోర్టులో పరువు నష్టం కేసు కూడా వేశారు. గెహ్లాట్ చేసిన ఆరోపణల గురించి జైసల్మేర్లో విలేకరులు ప్రశ్నించగా..భారతదేశంలో ఏదైనా వేదికపై నిలబడి నా ముందు వాదించమని నేను తనని మరియు అతని న్యాయవాదులను సవాలు చేస్తున్నానని అన్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో ఆయన కుమారుడు వైభవ్ గెహ్లాట్ ఓటమి పాలైనందుకే ముఖ్యమంత్రి తనపై ఆరోపణలు చేశారని షెకావత్ అన్నారు. జోధ్పూర్ లోక్సభ స్థానంలో కేంద్ర మంత్రి వైభవ్ గెహ్లాట్పై గజేంద్ర సింగ్ షెకావత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. జోధ్పూర్.. ముఖ్యమంత్రి గెహ్లాట్ యొక్క స్వస్థలం.
Read also: Anasuya Bhradwaj: బికినీ ఫోటోలు షేర్ చేసిన అనసూయ.. మిస్ అవ్వకూడదంట!
గెహ్లాట్ మరియు అతని కొడుకుపై బిజెపి రాజ్యసభ సభ్యులు కిరోడి లాల్ మీనా చేసిన అవినీతి ఆరోపణలను తాను రుజువు చేస్తానని తెలిపారు. కోట్లాది రూపాయల నల్లధనాన్ని తెల్లగా మార్చే పనిని వారు చేస్తున్నారని కేంద్ర మంత్రి ఆరోపించారు. సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమం అనే ఇతివృత్తంతో కేంద్రం విశేషమైన పని చేసిందని షెకావత్ అన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం పని చేయడం వల్లే నేడు ప్రజలకు వ్యవస్థపై విశ్వాసం ఉందని ఆయన నొక్కి చెప్పారు. ప్రభుత్వం తమ కోసమే పనిచేస్తుందని పేదలు గుర్తిస్తున్నారని, ప్రజాస్వామ్యంలో సరైన పార్టీని ఎన్నుకుంటేనే సరైన పని జరుగుతుందని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!