Sanjivani Scam: సంజీవని స్కామ్పై బహిరంగ చర్చకు సిద్ధం: కేంద్ర మంత్రి షెకావత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanjivani Scam: సంజీవని స్కామ్పై బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్పష్టం చేశారు. సంజీవని క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ కుంభకోణం వ్యవహారంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తనపై చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు రావాలని కేంద్ర మంత్రి సవాల్ విసిరారు. జోధ్పూర్ ఎంపీగా ఉన్న షెకావత్ అనేక మంది పెట్టుబడిదారులను కోట్లాది రూపాయలు మోసం చేసిన స్కాంలో ప్రమేయం ఉందని గెహ్లాట్ పదేపదే ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.
Read also: Maruti Suzuki: మీకొచ్చే రూ.30వేల జీతంలో మీకిష్టమైన కారును ఇంటికి తెచ్చుకోండి
Also Read
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
- BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
కేంద్ర మంత్రి షెకావత్ తనకు క్రెడిట్ సొసైటీతో సంబంధం ఉందనే ఆరోపణలను తోసిపుచ్చారు. అశోక్ గెహ్లాట్పై ఢిల్లీ కోర్టులో పరువు నష్టం కేసు కూడా వేశారు. గెహ్లాట్ చేసిన ఆరోపణల గురించి జైసల్మేర్లో విలేకరులు ప్రశ్నించగా..భారతదేశంలో ఏదైనా వేదికపై నిలబడి నా ముందు వాదించమని నేను తనని మరియు అతని న్యాయవాదులను సవాలు చేస్తున్నానని అన్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో ఆయన కుమారుడు వైభవ్ గెహ్లాట్ ఓటమి పాలైనందుకే ముఖ్యమంత్రి తనపై ఆరోపణలు చేశారని షెకావత్ అన్నారు. జోధ్పూర్ లోక్సభ స్థానంలో కేంద్ర మంత్రి వైభవ్ గెహ్లాట్పై గజేంద్ర సింగ్ షెకావత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. జోధ్పూర్.. ముఖ్యమంత్రి గెహ్లాట్ యొక్క స్వస్థలం.
Read also: Anasuya Bhradwaj: బికినీ ఫోటోలు షేర్ చేసిన అనసూయ.. మిస్ అవ్వకూడదంట!
గెహ్లాట్ మరియు అతని కొడుకుపై బిజెపి రాజ్యసభ సభ్యులు కిరోడి లాల్ మీనా చేసిన అవినీతి ఆరోపణలను తాను రుజువు చేస్తానని తెలిపారు. కోట్లాది రూపాయల నల్లధనాన్ని తెల్లగా మార్చే పనిని వారు చేస్తున్నారని కేంద్ర మంత్రి ఆరోపించారు. సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమం అనే ఇతివృత్తంతో కేంద్రం విశేషమైన పని చేసిందని షెకావత్ అన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం పని చేయడం వల్లే నేడు ప్రజలకు వ్యవస్థపై విశ్వాసం ఉందని ఆయన నొక్కి చెప్పారు. ప్రభుత్వం తమ కోసమే పనిచేస్తుందని పేదలు గుర్తిస్తున్నారని, ప్రజాస్వామ్యంలో సరైన పార్టీని ఎన్నుకుంటేనే సరైన పని జరుగుతుందని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!