Odisha: గర్భిణీ ఉద్యోగికి సెలవు నిరాకరణ.. బిడ్డ కోల్పోయిన మహిళ..
- 7 నెలల గర్భిణీ ఉద్యోగికి సెలవు నిరాకరణ..
- బిడ్డను కోల్పోయిన ప్రభుత్వ ఉద్యోగి..
- ఒడిశా కేంద్రపరాలో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Odisha: ఒడిశాలో గర్భంతో ఉన్న ఒక ప్రభుత్వ మహిళా ఉద్యోగికి సెలవు నిరాకరించడంతో కడుపులోని బిడ్డను కోల్పోవాల్సి వచ్చింది. కేంద్రపరా జిల్లాలో తన కార్యాలయంలో తీవ్ర ప్రసవవేదన అనుభవించిన మహిళ పురిటిలోనే బిడ్డను కోల్పోయింది. ఈ ఘటన అక్టోబర్ 25న జరిగింది. చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్(సీడీపీఓ) సెలవు నిరాకరించడంతో తాను బిడ్డను కోల్పోయినట్లు బర్షా ప్రియదర్శిని అనే 26 ఏళ్ల మహిళ మీడియాకు చెప్పడంతో మంగళవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
Read Also: India-China border: లడఖ్లో భారత్, చైనా బలగాల ఉపసంహరణ పూర్తి!
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
తాను 7 నెలల గర్భంతో ఉన్నానని, పనిలో ఉండగా విపరీతమైన నొప్పి వచ్చిందని ఆమె చెప్పారు. తనను ఆస్పత్రికి తరలించాలని సీడీపీఓ స్నేహలతా సాహూని, ఇతర అధికారుల్ని కోరినప్పటికీ పట్టించుకోలేదని ఆమె ఆరోపించారు. స్నేహలత తన పట్ల అసభ్యంగా ప్రవర్తించిందని బార్షా పేర్కొంది. బర్షా బందువులు ఆమెను కేంద్రపరాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆల్ట్రా సౌండ్ స్కాన్ చేయగా, అప్పటికే బిడ్డ చనిపోయినట్లు డాక్టర్లు వెల్లడించారు.
కేంద్రంపరా డిస్ట్రిక్ట్ అడిషనల్ కలెక్టర్ నిలు మోహపాత్ర మాట్లాడుతూ.. దీనిపై ఫిర్యాదు అందిందని, దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని జిల్లా సాంఘిక సంక్షేమ అధికారిని ఆదేశించినట్లు చెప్పారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ఘటనపై ఉపముఖ్యమంత్రి ప్రవతి పరిదా స్పందించారు. దీనిపై కేంద్రపరా కలెక్టర్తో చర్చించినట్లు వెల్లడించారు. బాధితురాలికి న్యాయం చేస్తామని అన్నారు. అయితే, ఈ ఆరోపణలపై సీడీపీఓ స్పందిస్తూ బార్షా విషయం తనకు తెలియదని చెప్పారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!