Khalistani terrorist: కుంభమేళాపై దాడి చేస్తాం.. టెర్రరిస్ట్ పన్నూ బెదిరింపులు..
- మహా కుంభమేళాపై అటాక్ చేస్తాం..
- హిందుత్వాన్ని నాశనం చేస్తాం..
- ఖలిస్తానీ ఉగ్రవాది పన్నూన్ హెచ్చరిక..
- అంత సీన్ లేదన్న అఖాడా పరిషత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khalistani terrorist: ఖలిస్తానీ ఉగ్రవాది, నిషేధిత సిఖ్స్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్జే) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోసారి భారత్ని బెదిరించాడు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరగబోయే ‘‘మహా కుంభమేళా’’పై దాడులు నిర్వహించి, భగ్నం చేస్తామని బెదిరింపులు జారీ చేశాడు. ఒక వీడియోలో పన్నూ మాట్లాడుతూ.. హిందుత్వ భావజాలాన్ని వ్యతిరేకించడానికి, హిందుత్వాన్ని చంపడానికి ‘‘ప్రయాగ్రాజ్ ఛలో’’కి పిలుపునిచ్చాడు. లక్నో, ప్రయాగ్ రాజ్ ఎయిర్పోర్టుల్లో ఖలిస్తానీ, కాశ్మీర్ జెండాలను ఎగురవేయాలని ఆయన తన మద్దతుదారులను కోరారు. ‘‘మహాకుంభ్ ప్రయాగ్రాజ్ 2025 యుద్ధభూమిగా మారుతుంది’’ అని ప్రకటించారు.
Read Also: Bengaluru Shocker: పిల్లలకు విషమిచ్చి, భార్యతో సహా సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య..
Also Read
- JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
10 రోజుల వ్యవధిలో కుంభమేళాని టార్గెట్ చేస్తూ పన్నూ బెదిరించడం ఇది రెండోసారి. గతంలో వీడియోలో మకర సంక్రాంతి (జనవరి 14), మౌని అమావాస్య (జనవరి 29), మరియు బసంత్ పంచమి (ఫిబ్రవరి 3)తో సహా మతపరమైన ముఖ్యమైన స్నానాలు ఆచరించే రోజులను దెబ్బతీస్తామని హెచ్చరించాడు.
పన్నూన్ వీడియోని అఖిల భారతీయ అఖాడా పరిషత్ తీవ్రంగా ఖండించింది. పరిషత్ అధ్యక్షుడు మహంత్ రవీంద్రపూరి మాట్లాడుతూ.. పన్నూ బెదిరింపులను తోసిపుచ్చాడు, అతడివి పిచ్చివాడి వ్యాఖ్యలుగా కొట్టిపారేశారు. ‘‘పన్నూన్ అనే వ్యక్తి మన మహాకుంభమేళాలోకి ప్రవేశించడానికి ధైర్యం చేస్తే, అతడిని కొట్టి బయటకు పంపుతారు. ఇలాంటి పిచ్చివాళ్లను వందలాది మందిని చూశాం’’ అని అన్నారు. ‘‘మహంత్ హిందువులు, సిక్కుల మధ్య ఐక్యతను నొక్కిచెప్పారు. ఇది సిక్కులు, హిందువులు ఐక్యంగా ఉండే మాగ్ మేళా. విభజనను ప్రేరేపించడానికి పన్నూన్ చేసిన ప్రయత్నాలు ఫలించవు. మన సనాతన సంప్రదాయాన్ని సజీవంగా ఉంచింది సిక్కు సమాజం, వారు సనాతన ధర్మాన్ని కాపాడారు’’ అని అన్నారు.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!