Prashant Kishor: బీహార్ ఎన్నికల వేళ అసదుద్దీన్కు ప్రశాంత్ కిషోర్ కీలక సలహా
- బీహార్ ఎన్నికల వేళ అసదుద్దీన్కు ప్రశాంత్ కిషోర్ కీలక సలహా
- సొంతింటిని చక్కదిద్దుకోవాలని హితవు
బీహార్ ఎన్నికల సమరం రసవత్తరంగా సాగుతోంది. అన్ని పార్టీలు నువ్వానేనా? అన్నట్టుగా దూకుడుగా వెళ్తున్నాయి. ఇక బీహార్ ఎన్నికల వేళ జాన్ సూరాజ్ వ్యవస్థాపకుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీకి కీలక సలహా ఇచ్చారు. అసదుద్దీన్ స్నేహితుడే కానీ.. హైదరాబాద్లో ఆయన కోటను కాపాడుకుంటే మంచిది అని సూచించారు. అనవసరంగా సీమాంచల్కు వచ్చి అనవసరమైన గందరగోళం సృష్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. హైదరాబాద్లోనే ఉండి… అక్కడి ముస్లింల సంక్షేమం చూసుకుంటే మంచిది అని హితవు పలికారు.
ఇది కూడా చదవండి: Delhi Acid Attack Case: ఢిల్లీ యాసిడ్ దాడి కేసులో బిగ్ ట్విస్ట్.. షాకైన పోలీసులు
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
‘‘సీమాంచల్ పుత్రులే సీమాంచల్ నాయకులుగా ఉండాలి.’’ అని ప్రశాంత్ కిషోర్ అన్నారు. బీహార్ ముస్లింలు 2020 నాటి తప్పు మళ్లీ చేయరని భావిస్తున్నట్లు తెలిపారు. ఒవైసీ సాహెబ్ అంటే మంచి గౌరవం ఉందని.. బాగా చదువుకున్నాడని కితాబు ఇచ్చారు. హైదరాబాద్లో ఉండి.. పార్టీని పటిష్టం చేసుకోవాలి కానీ.. బీహార్లో ఏం పని అని వ్యాఖ్యానించారు. ఇక్కడ నాయకులు.. ఇక్కడ ముస్లింల గురించి పట్టించుకుంటారని చెప్పారు.
‘‘సీమాంచల్’’ అనే పదం ముఖ్యంగా బీహార్ రాష్ట్రంలోని ఒక ప్రాంతాన్ని సూచిస్తుంది. ఇది పూర్ణియా డివిజన్ను సూచిస్తుంది. అలాగే ‘‘సీమాంచల్ ఎక్స్ప్రెస్’’ అనే సూపర్ ఫాస్ట్ రైలు కూడా ఉంది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం ఐదు సీట్లు గెలుచుకుంది. సీమాచల్లోని నాలుగు జిల్లాల్లోని 24 అసెంబ్లీ స్థానాల్లో గత ఐదు ఎన్నికల్లో పార్టీల మధ్య ఊగిసలాట చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Cyclone Montha: 10 జిల్లాలపై మొంథా తుఫాన్ తీవ్ర ప్రభావం.. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరికలు..
సీమాంచల్లో మొత్తం 24 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. పూర్నియా జిల్లాలో ఏడు, అరారియాలో ఆరు, కిషన్గంజ్లో నాలుగు, కతిహార్లో ఏడు ఉన్నాయి. గత ఐదు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మూడుసార్లు ఆధిక్యంలో ఉంది. 2020లో ఎనిమిది స్థానాల్లో.. 2010లో 13 స్థానాలతో, అక్టోబర్ 2005లో తొమ్మిది స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం.. కిషన్గంజ్లో 68 శాతం ముస్లింలు ఉండగా.. అరారియాలో 43 శాతం, కతిహార్లో 45 శాతం, పూర్నియాలో 39 శాతం ఉన్నారు. ఇక్కడ ఎంఐఎం పోటీ చేస్తుండడంతో ప్రశాంత్ కిషోర్ లాంటి పార్టీలకు ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ ఈ విజ్ఞప్తి చేశారు. మళ్లీ అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూసుకోవాలని అసదుద్దీన్కు హితవు పలికారు.
#WATCH | Kishanganj, Bihar: Jan Suraaj Founder Prashant Kishor says, "Owaisi Sahab is my friend. But my unsolicited advice to him is that he should handle Hyderabad. Protect your stronghold in Hyderabad; don't cause unnecessary confusion by coming to Seemanchal. Had you handled… pic.twitter.com/ylV877U8hf
— ANI (@ANI) October 27, 2025
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!