Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Ktr Sensational Comments On Congress And Bjp Leaders

KTR: షాక్ కొట్టి పోతే దరిద్రం పోతుంది.. కాంగ్రెస్, బీజేపీ నాయకులపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Published Date :October 6, 2023 , 2:51 pm
By NTV WebDesk
KTR: షాక్ కొట్టి పోతే దరిద్రం పోతుంది.. కాంగ్రెస్, బీజేపీ నాయకులపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

KTR: బస్సులు పెడుతాం.. భోజన సౌకర్యం కల్పిస్తాం.. ఎక్కడికైనా కాంగ్రెస్, బీజేపీ నాయకులు వెళ్ళి కరెంట్ వైర్లు పట్టుకోండి.. షాక్ కొట్టి పోతే దరిద్రం పోతుందని మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరెంట్ కనిపించదు..కేసిఆర్ లెక్క సన్నగా ఉంటుంది… షాక్ తో జాడిచ్చి తంతే అడ్రస్ లేకుండా పోతారని కీలక వ్యాఖ్యలు చేశారు. వరంగల్ జిల్లా బీఆర్ఎస్ బహిరంగ సభలో మంత్రి కేటిఆర్ మాట్లాడారు. సంక్రాంతికి గంగిరెద్దుల మాదిరిగా ప్రతిపక్షాలు వస్తున్నాయని మండిపడ్డారు. కేసిఆర్ ఇచ్చేదానికి ఒకటి రెండు ఎక్కువ ఇస్తామని నాలుగు ఓట్లు డబ్బుల వేసుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఉన్న తెలంగాణను ఊడగోట్టింది కాంగ్రెస్.. వారికీ సహకరించింది బీజేపీ అన్నారు. తెలంగాణ పై చిత్తశుద్ధితో ఆ రెండు పార్టీలు లేవన్నారు. ప్రధానమంత్రి మోడీ తెలంగాణ పై విషం కక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మాయమాటలతో మోసం చేస్తుందని, కాంగ్రెస్ హాయంలో కరెంట్ కష్టం ఎంత ఉందో అర్థం చేసుకోవాలన్నారు. కరెంట్ పై సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ బిజెపి నాయకులకు బంపర్ ఆఫర్ ఇస్తున్నామని, బస్సులు పెడుతాం భోజన సౌకర్యం కల్పిస్తాం ఎక్కడికైనా కాంగ్రెస్ బిజెపి నాయకులు వెళ్ళి కరెంట్ వైర్లు పట్టుకోండని అన్నారు. షాక్ కొట్టి పోతే దరిద్రం పోతుందని కీలక వ్యాఖ్యలు చేశారు.

కరెంట్ కనిపించదు..కేసిఆర్ లెక్క సన్నగా ఉంటుంది… షాక్ తో జాడిచ్చి తంతే అడ్రస్ లేకుండా పోతారని అన్నారు. ఒకటా రెండా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అద్బుతంగా కేసిఆర్ అమలు చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ సన్నాసులకు అవి కన్పించడం లేదని మంత్రి ఫైర్ అయ్యారు. ఎలక్షన్ లు రాగానే ఆగం కావద్దన్నారు. పెన్షన్లు పెంచే ఆలోచన కేసిఆర్ చేస్తున్నారని అన్నారు. తెలంగాణ కు గుండు సున్నా ఇచ్చిన మోడీ కి ఓటు వేయాలా? అని ప్రశ్నించారు. బండి సంజయ్ అంటుండు.. మోడీ దేవుడిని.. ఎవ్వరికీ దేవుడు.. గ్యాస్ ధర, పెట్రోల్ డిజిల్ ధరలు పెంచినందుకా? అని మండిపడ్డారు. రంగస్థలం సినిమా పాటలా ఆ గట్టున ఉంటావా? ఈ గట్టున ఉంటావా తేల్చుకోవాలన్నారు. ఈ గట్టున స్కీమ్ లు ఉన్నాయి.. ఆ గట్టున స్కామ్ లు ఉన్నాయని అన్నారు. ఈ గట్టున ప్రజాసంక్షేమం ఉంది.. ఆ గట్టున 60 ఏళ్ళు జనాన్ని పీక్కు తిన్నవారు ఉన్నారని మండిపడ్డారు.

వినయ్ భాస్కర్ మాస్ లీడర్.. జనం ఈలలతో పెద్ద పెట్టున నినాదాలు చేయడంతో ఇంత మాస్ లీడర్ వినయన్నా అనుకోలేదన్నారు. తెలంగాణ ఉద్యమానికి మూల కేంద్రమయ్యిందన్నారు. ఓరుగల్లు గడ్డ కేసిఆర్ కు వెన్నుదన్నుగా నిలిచిందని తెలిపారు. అదే స్పూర్తితో వినయ్ భాస్కర్ ను రికార్డు బద్దలయ్యే మెజారిటీతో గెలిపించాలన్నారు. టాలెంట్ ఎవరు సొత్తు కాదని, ఎన్ఆర్ఐ లు ఎక్కడ ఉన్నా జన్మభూమి లో కంపెనీలు పెట్టి స్థానికులకు ఉపాధి కల్పించండని తెలిపారు. Y2k లాంటి సంక్షోభలను ప్రపంచం ఎదుర్కొందన్నారు. భారత జనాభాలో అత్యధిక మానవ వనరులు ఉండడం అతి పెద్ద అసెట్ అన్నారు. భారత్ ప్రపంచాన్ని శాసించే దేశంగా ఎదగాలన్నారు. సింగపూర్, జపాన్ వంటి దేశాల్లో మానవ వనరులు తప్ప ప్రకృతివనరులు లేవన్నారు. హైదరాబాద్ లో పెట్టుబడులే కాకుండా 8 ఐటి హబ్ లు ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. ఉన్నచోట పని కల్పిస్తున్నామని, హైదరాబాద్ ధీటుగా ఐటి కంపెనీలు నిర్మించడం జరిగిందన్నారు. వరంగల్ పిల్లలు ప్రపంచం వ్యాప్తంగా ఉన్నత స్థానాల్లో రాణిస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు.
CM Jagan : ఏపీ నాలుగు దశాబ్దాలుగా వామపక్ష తీవ్రవాద ముప్పుతో పోరాడుతోంది

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp leaders
  • cm kcr
  • Congress leaders
  • KTR commentson
  • KTR sensational comments

తాజావార్తలు

  • Pawan Kalyan – Balineni Meet: పవన్‌ కల్యాణ్‌తో బాలినేని కీలక భేటీ.. గంటకు పైగా చర్చలు..

  • CM Revanth Reddy: విధులకు గైర్హాజరైన ఉద్యోగులకు జీతం కట్ చేస్తాం.. అసెంబ్లీలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

  • Bengaluru: టెక్ సిటీలో అమానుషం.. తండ్రిని సంచిలో పెట్టి కొరియర్‌కు యత్నం.. ఆ తర్వాత ఏమైందంటే..!

  • Story Board: డబ్బిస్తే.. ఏదైనా చేసుకోవచ్చా..? ఫామ్ హౌస్‌లో ఏం జరుగుతోంది..?

  • Delhi Rain: ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. ఉరుములు, మెరుపులతో దద్దరిల్లిన హస్తిన

ట్రెండింగ్‌

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • IPL Fastest Ball: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీలు.. టాప్-5లో మనోళ్లు ఇద్దరు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions