Arvind Kejriwal: లిక్కర్ కేసులో నా పేరు లేదు.. ఇది రాజకీయ కుట్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టైన సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. తన అరెస్ట్ ‘రాజకీయ కుట్ర’ అని గురువారం ఆరోపించారు. ఈడీ కస్టడీ ఈరోజు ముగియడంతో మరో 7 రోజుల పాటు కస్టడీ కోరుతూ.. దర్యాప్తు సంస్థ రౌస్ ఎమెన్యూ కోర్టును ఆశ్రయించింది. కోర్టు గదిలోకి తీసుకువచ్చే క్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇది రాజకీయ కుట్ర అని, దీనికి ప్రజలే సమాధానం చెబుతారని కేజ్రీవాల్ అన్నారు. ఆప్ మంత్రులు అతిషి, గోపాల్ రాయ్, సౌరభ్ భరద్వాజ్తో పాటు ముఖ్యమంత్రి సతీమణి సునీతా కేజ్రీవాల్ కోర్టుకి హాజరయ్యారు.
Read Also: Lemons: దేవుడా.. 9 నిమ్మకాయలు కేవలం రెండున్నర లక్షలే.. అసలు అంతలా ఏముంది వాటిలో..?!
Also Read
- Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
- HAPIDA SKYNeX Flying Vehicle: ట్రాఫిక్కు చెక్ పెట్టే ‘ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కార్’.. యువకుడి అద్భుత ఆవిష్కరణ! (వీడియో)
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
- Punjab: జంతర్ మంతర్-ఉగ్రకుట్ర కేసు ప్రకంపనలు.. అమృత్సర్ పోలీస్ చీఫ్కు ట్రాన్స్ఫర్
కోర్టులో కేజ్రీవాల్ సొంత వాదనలు వినిపించారు. ఈ కేసులో తనను ఇరికించడమే ఈడీ లక్ష్యమని అన్నారు. సీబీఐ 31 వేల పేజీల, ఈడీ 25 వేల పేజీల ఛార్జిషీటులో తన పేరు ఎక్కడా లేదని చెప్పారు. మాగుంట రాఘవ రెడ్డి ఇచ్చిన 7 స్టేట్మెంట్లలో ఆరింటిలో తన పేరు లేదని చెప్పారు. లిక్కర్ కేసులో రూ. 100 కోట్ల అవినీతి జరిగితే, ఆ డబ్బు ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ తర్వాత రూ. 55 కోట్లని బీజేపీకి డొనేషన్ ఇచ్చారని అన్నారు. ఈడీకి రెండు లక్ష్యాలు ఉన్నాయని, తనను ఈ కేసులో ఇరికించడం, రెండోది ఆప్ పార్టీ లేకుండా చేయడమని ఆరోపించారు. నాపై ఎలాంటి కేసు లేదని, ఈడీకి నచ్చినన్ని రోజులు కస్టడీలో ఉంచుకోండి అని అన్నారు.
లిక్కర్ పాలసీ కేసులో మార్చి 21న కేజ్రీవాల్ని అరెస్ట్ చేయగా.. ఢిల్లీ కోర్టు మార్చి 28 వరకు ఈడీ కస్టడీకి అప్పగించింది. మరో 7 రోజులు ఈడీ కస్టడీ కోరుతోంది. కేజ్రీవాల్ స్టేట్మెంట్ రికార్డు చేశామని, తప్పించుకునేలా సమాధానాలు చెబుతున్నారని ఈడీ కోర్టుకు తెలిపింది. ఆప్ గోవా ఎమ్మెల్యే అభ్యర్థులతో కలిపి కేజ్రీవాల్ని ప్రశ్నించాలని చెప్పింది. ఈ కేసులో పంజాబ్ ఎక్సైజ్ అధికారులకు నోటీసులు ఇచ్చామని చెప్పింది.
తాజావార్తలు
-
Vegetable Chips: బయట ఫుడ్స్కి గుడ్బై.. ఇంట్లోనే చుక్క నూనె లేకుండా క్రిస్పీ, హెల్తీ వెజిటెబుల్ చిప్స్ రెడీ..
-
ISRO Recruitment: ఇంజనీరింగ్ అభ్యర్థులకు గోల్డెన్ ఛాన్స్.. ఇస్రోలో జాబ్స్కి నోటిఫికేషన్!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
Fazilka Border Drone Arms Smuggling: ఫాజిల్కా సరిహద్దు వద్ద పాకిస్థాన్ కుట్ర భగ్నం.. డ్రోన్, పిస్టల్, తూటాలు స్వాధీనం
-
Hollywood Box Office: ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ vs ‘ది ఒడిస్సీ’.. షేక్ అవుతున్న బాక్సాఫీస్.. కలెక్షన్స్ లో ఎవరిది పైచేయి?
ట్రెండింగ్
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!