Himani Narwal: కాంగ్రెస్ కార్యకర్త హిమాని నర్వాల్ను నిందితుడు ఎందుకు చంపాడంటే..!
- కాంగ్రెస్ మహిళా కార్యకర్త హిమాని నర్వాల్ హత్య కేసులో పురోగతి
- వ్యక్తిగత ఘర్షణలో స్నేహితుడే చంపాడని పోలీసుల వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ మహిళా కార్యకర్త హిమాని నర్వాల్ (23) హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మార్చి 1న రోహ్తక్-ఢిల్లీ హైవేలోని సంప్లా బస్టాండ్ సమీపంలో సూట్కేస్లో నర్వాల్ మృతదేహం లభ్యమైంది. అయితే ఈ ఘటనపై హర్యానా ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఇక రంగంలోకి దిగిన సిట్ బృందం.. సోమవారం ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఝజ్జర్కు చెందిన సచిన్గా గుర్తించారు.
ఇది కూడా చదవండి: Meenakshi Natarajan: దేశంలో కార్పొరేట్ వ్యవస్థ రాజ్యమేలుతోంది..
Also Read
- New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
- Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
- Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
అయితే నిందితుడు సచిన్తో హిమాని నర్వాల్కు పరిచయం ఉందని పోలీసులు తెలిపారు. సచిన్… ఝజ్జర్లో మొబైల్ దుకాణం నడుపుతున్నాడు. ఒక సంవత్సరం క్రితం ఆమెతో సచిన్కు పరిచయం ఏర్పడింది. సోషల్ మీడియా ద్వారా ఇద్దరికి పరిచయం ఏర్పడింది. గత కొన్ని నెలలుగా రోహ్తక్లోని విజయ్నగర్లో నివాసం ఉంటున్న హిమాని ఇంటికి తరచుగా వస్తూ ఉండేవాడు. ఫిబ్రవరి 27న రాత్రి 9 గంటల ప్రాంతంలో హిమానితో సచిన్ ఇంట్లోనే బస చేశాడని అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ క్రిషన్ కుమార్ రావు తెలిపారు. మరుసటి రోజు ఇద్దరి మధ్య ఒక విషయంపై వాగ్వాదం చోటుచేసుకుంది. హిమాని చేతులను దుప్పిటితో కట్టేసి. మొబైల్ ఫోన్ ఛార్జర్తో గొంతుకోసి సచిన్ చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని సూట్కేస్లో భద్రపరిచాడు. ఇక ఆమె ఫోన్, ల్యాప్టాప్, ఆభరణాలు తీసుకెళ్లి దుకాణంలో దాచి పెట్టాడు. ఆమె స్కూటీలోనే తీసుకెళ్లి దాచిపెట్టాడు. అనంతరం ఆమె మృతదేహం ఉన్న సూట్కేస్ను ఆటోలో తీసుకెళ్లి సాంప్లా బస్టాండ్ దగ్గర విదిలేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీకెమెరాలో రికార్డ్ అయ్యాయి.
ఇది కూడా చదవండి: War 2 : వార్ 2 నుంచి ఫ్యాన్స్కు కిక్కిచ్చే న్యూస్..
ఇక హిమాని మృతదేహాన్ని దహనం చేయడానికి కుటుంబ సభ్యులు నిరాకరించారు. తమ కుమార్తెకు ఎవరితోనూ సన్నిహిత సంబంధాలు లేవని.. హత్యకు ఏదో బలమైన కారణం ఉందని బాధితురాలి తల్లి సవితా నర్వాల్ అనుమానం వ్యక్తం చేసింది. డబ్బు కోసమే.. స్నేహితుడు ఎలా చంపుతాడని ప్రశ్నించింది. పోలీసుల విచారణపై తమకు అనుమానం ఉందన్నారు. నిందితుడికి మరణశిక్ష విధించాలని బాధిత కుటుంబం డిమాండ్ చేసింది.
ఇది కూడా చదవండి: Sonakshi : టాలీవుడ్లోకి మరో బాలీవుడ్ స్టార్ భామ
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!