Rajnath Singh: పీఓకే ప్రజలు భారత్లో చేరాలి.. పాకిస్తాన్లా కాకుండా సొంత వారిలా చూస్తాం..
- పీఓకే ప్రజలు భారత్లో చేరాలని రాజ్నాథ్ సింగ్ పిలుపు..
- పాకిస్తాన్లా కాకుండా సొంత వాళ్లుగా చూస్తాం..
- జమ్మూ కాశ్మీర్ ఎన్నిలక ప్రచారంలో రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajnath Singh: పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లోని ప్రజలు భారత్లో చేరాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కోరారు. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అభ్యర్థి రాకేష్ సింగ్ ఠాకూర్కి మద్దతుగా రాంబన్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ర్యాలీలో రాజ్నాథ్ ప్రసంగించారు. పీఓకే ప్రజలు భారత్లో వచ్చి చేరాలని, వారిని విదేశీయుల్లా చూసే పాకిస్తాన్లా కాకుండా సొంతవారిలా ఆదరిస్తామని చెప్పారు.
ఆర్టికల్ 370 గురించి నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమి హామీ ఇవ్వడాన్ని ఆయన ప్రస్తావించారు. ఎన్సీ మేనిఫెస్టోలో ఆర్టికల్ 370ని తిరిగి తీసుకువస్తామని హామీ ఇచ్చింది. అయితే, ఈ హామీ గురించి మాట్లాడుతూ రాజ్నాథ్ సింగ్ ఎన్సీ, కాంగ్రెస్ పార్టీలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. బీజేపీ ఉన్నంత కాలం జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని తీసుకురావడం అసాధ్యమని చెప్పారు.
Also Read
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
- Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
- PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
Read Also: Brij Bhushan: వినేష్ ఫోగట్, బజరంగ్ పునియాలపై మాట్లాడొద్దు.. బ్రిజ్ భూషణ్కి బీజేపీ సలహా..
ఆగస్టు 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత, 2014 ఎన్నికల తర్వాత తొలిసారిగా ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీ, పీడీపీలు ఒంటరిగా పోటీ చేస్తుండగా, నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ)-కాంగ్రెస్లు కలిసి కూటమిగా పోటీలో నిలిచాయి. ఆర్టికల్ 370, 35-ఏ రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో జరిగిన మార్పుని రాజ్నాథ్ స్వాగతించారు. గతంలో ఇక్కడి యువకులు పిస్టల్స్, రివాల్వర్లను కలిగి ఉండేవారని, ఇప్పుడు వారి చేతుల్లో ల్యాప్టాప్, కంప్యూటర్లు ఉన్నాయని అన్నారు.
జమ్మూ కాశ్మీర్లో 2014 తర్వాత, ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా ఎన్నికలు జరగబోతున్నాయి. 90 మంది సభ్యులు ఉన్న అసెంబ్లీకి 3 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశ సెప్టెంబర్ 18న, రెండో దశ సెప్టెంబర్ 25, మూడో దశ అక్టోబర్ 01న జరుగుతాయి. అక్టోబర్ 08న కౌంటింగ్ జరగనుంది.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!