PM Narendra Modi: ప్రపంచం అంతా భారత్ వైపు చూస్తోంది.. కొందరు దేశ విజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Narendra Modi’s speech in Parliament: పార్లమెంట్ లో రాష్ట్రపతి ప్రసంగంపై ప్రధాని మోదీ కీలక ఉపన్యాసం చేశారు. రాష్ట్రపతి దేశంలోని మహిళలు, సోదరీమణులకు స్ఫూర్తిదాయకం అని కొనియాడారు. రాష్ట్రపతి దేశంలో గిరిజనులు ఉన్నతిని పెంచారని అన్నారు. 100 ఏళ్లకు ఒకసారి వచ్చే మహమ్మారి, యుద్దం లాంటి పరిస్థితులను భారత్ తట్టుకుందని మోదీ అన్నారు. ఎన్నికల కంటే దేశంలోని 140 కోట్ల ప్రజల సామర్థ్యం, శక్తి గొప్పదని అన్నారు. సమర్థవంతంగా భారత్ సంక్షోభాల నుంచి బయటపడిందని, ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించిందని అన్నారు.
ప్రపంచం అంతా భారత్ వైపు ఎంతో ఆశగా ఎదురుచూస్తోందని అన్నారు. భారతదేశంలో స్థిరమైన ప్రభుత్వం ఉందని, రాజకీయ అస్థిరత లేదని, పైగా నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం ఉందని చెప్పారు. విమర్శలను పట్టించుకోం అని.. సమయానుకూలంగా దేశానికి ఏం కావాలో అది చేసుకుంటూ పోతాం అని ప్రధాని స్పష్టం చేశారు. దేశంలో అవినీతిని నిర్మూలించాం. భారత్ ఈ క్షణం కోసం చాలా ఏళ్లుగా ఎదురుచూసిందని.. కోవిడ్ను భారత్ సమర్థవంతంగా ఎదుర్కొంది.. చాలా దేశాలను నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వేధిస్తున్నాయి.. ప్రపంచంలో 5వ ఆర్థిక శక్తిగా భారత్ ఆవిర్భవించింది.. ఇది దేశం గర్వించదగిన విషయం అని అన్నారు.
Also Read
Read Also: USA: విమానంలో ల్యాప్టాప్కు మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్..
దేశవ్యాప్తంగా అందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందించామని.. 150 దేశాలకు వ్యాక్సిన్లు పంపిణీ చేశామని ప్రధాని సభలో ప్రకటించారు. డిజిటల్ ఇండియాను చూసి ప్రపంచదేశాలు ఆశ్చర్యపోతున్నాయని.. వ్యాక్సిన్ సర్టిఫికేట్స్ కూడా క్షణాల్లో వచ్చేస్తున్నాయని.. కానీ కొందరు మాత్రం నిరాశతో ఉన్నారని విమర్శించారు. దేశంలో 90 వేల స్టార్టప్స్ పనిచేస్తున్నాయి, మొబైళ్ల తయారీలో దేశం రెంస్థానంలో ఉంది, ఇంధనం వినియోగంలో భారత్ మూడో స్థానంలో ఉందని తెలిపారు.
ప్రపంచ అభివృద్ధితో పాటు భారతదేశం తన అభివృద్ధిని కూడా చూసుకుంటోందని, ఇది చూసి కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. దేశీయ వైమానిక రవాణాలో భారత్ మూడో స్థానంలో ఉందని, అన్ని క్రీడల్లో భారత క్రీడాకారులు సత్తా చూపిస్తున్నారని కొనియాడారు. భారత్ లోని ప్రతి రంగంలోనూ, ప్రతి ఆలోచనలోనూ, పెద్ద ఎత్తున ఆశాభావం కనిపిస్తోందని, మెడికల్, ఇంజనీరింగ్, వృత్తి విద్యా కోర్సుల్లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకుంటున్నారని తెలిపారు. ఇదంతా చూసి కొంతమంది నిరాశలో కూరుకుపోయారని విమర్శించారు.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!