PM Narendra Modi: ప్రపంచం అంతా భారత్ వైపు చూస్తోంది.. కొందరు దేశ విజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Narendra Modi’s speech in Parliament: పార్లమెంట్ లో రాష్ట్రపతి ప్రసంగంపై ప్రధాని మోదీ కీలక ఉపన్యాసం చేశారు. రాష్ట్రపతి దేశంలోని మహిళలు, సోదరీమణులకు స్ఫూర్తిదాయకం అని కొనియాడారు. రాష్ట్రపతి దేశంలో గిరిజనులు ఉన్నతిని పెంచారని అన్నారు. 100 ఏళ్లకు ఒకసారి వచ్చే మహమ్మారి, యుద్దం లాంటి పరిస్థితులను భారత్ తట్టుకుందని మోదీ అన్నారు. ఎన్నికల కంటే దేశంలోని 140 కోట్ల ప్రజల సామర్థ్యం, శక్తి గొప్పదని అన్నారు. సమర్థవంతంగా భారత్ సంక్షోభాల నుంచి బయటపడిందని, ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించిందని అన్నారు.
ప్రపంచం అంతా భారత్ వైపు ఎంతో ఆశగా ఎదురుచూస్తోందని అన్నారు. భారతదేశంలో స్థిరమైన ప్రభుత్వం ఉందని, రాజకీయ అస్థిరత లేదని, పైగా నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం ఉందని చెప్పారు. విమర్శలను పట్టించుకోం అని.. సమయానుకూలంగా దేశానికి ఏం కావాలో అది చేసుకుంటూ పోతాం అని ప్రధాని స్పష్టం చేశారు. దేశంలో అవినీతిని నిర్మూలించాం. భారత్ ఈ క్షణం కోసం చాలా ఏళ్లుగా ఎదురుచూసిందని.. కోవిడ్ను భారత్ సమర్థవంతంగా ఎదుర్కొంది.. చాలా దేశాలను నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వేధిస్తున్నాయి.. ప్రపంచంలో 5వ ఆర్థిక శక్తిగా భారత్ ఆవిర్భవించింది.. ఇది దేశం గర్వించదగిన విషయం అని అన్నారు.
Also Read
- Mamata Banerjee: మమత పార్టీలో విభేదాలు.. నిరసనకు 35 మంది ఎమ్మెల్యేలే హాజరు..
- Modi-Meloni: గంటల్లోనే కోట్లలో వ్యూస్.. ఇంటర్నెట్లో ప్రకంపనలు రేపుతున్న మెలోడీ వీడియో
- Suryastra Rocket: శత్రువులకు హెచ్చరికగా.. స్వదేశీ ‘సూర్యాస్త్ర’ రాకెట్ సక్సెస్.. పెరిగిన డిఫెన్స్ పవర్
- PM Modi: కాశీ-రోమ్ శాశ్వతనగరాలు.. సంబంధాలు కూడా అంతే గొప్పవన్న మోడీ
Read Also: USA: విమానంలో ల్యాప్టాప్కు మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్..
దేశవ్యాప్తంగా అందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందించామని.. 150 దేశాలకు వ్యాక్సిన్లు పంపిణీ చేశామని ప్రధాని సభలో ప్రకటించారు. డిజిటల్ ఇండియాను చూసి ప్రపంచదేశాలు ఆశ్చర్యపోతున్నాయని.. వ్యాక్సిన్ సర్టిఫికేట్స్ కూడా క్షణాల్లో వచ్చేస్తున్నాయని.. కానీ కొందరు మాత్రం నిరాశతో ఉన్నారని విమర్శించారు. దేశంలో 90 వేల స్టార్టప్స్ పనిచేస్తున్నాయి, మొబైళ్ల తయారీలో దేశం రెంస్థానంలో ఉంది, ఇంధనం వినియోగంలో భారత్ మూడో స్థానంలో ఉందని తెలిపారు.
ప్రపంచ అభివృద్ధితో పాటు భారతదేశం తన అభివృద్ధిని కూడా చూసుకుంటోందని, ఇది చూసి కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. దేశీయ వైమానిక రవాణాలో భారత్ మూడో స్థానంలో ఉందని, అన్ని క్రీడల్లో భారత క్రీడాకారులు సత్తా చూపిస్తున్నారని కొనియాడారు. భారత్ లోని ప్రతి రంగంలోనూ, ప్రతి ఆలోచనలోనూ, పెద్ద ఎత్తున ఆశాభావం కనిపిస్తోందని, మెడికల్, ఇంజనీరింగ్, వృత్తి విద్యా కోర్సుల్లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకుంటున్నారని తెలిపారు. ఇదంతా చూసి కొంతమంది నిరాశలో కూరుకుపోయారని విమర్శించారు.
తాజావార్తలు
-
KKR Vs MI: ఈడెన్ గార్డెన్స్లో హైవోల్టేజ్ పోరు: టాస్ గెలిచిన కేకేఆర్.. ముంబై బ్యాటింగ్..
-
iQOO 15T: ఐకూ 15T విడుదల.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్
-
RBI: ఈఎంఐ కట్టలేదని ఫోన్ బ్లాక్ చేస్తున్నారా..? బ్యాంకులకు ఆర్బీఐ వార్నింగ్.. ఇకపై అలా చేస్తే కుదరదు..
-
TGPSC : నిరుద్యోగులకు డబుల్ బెనిఫిట్.. వయోపరిమితి పెంపు.. తెలుగులో ఎగ్జామ్..!
-
ACB Raids : సస్పెండ్ అయినా తగ్గని లగ్జరీ.. సబ్ రిజిస్ట్రార్ ఇంట్లో తనిఖీల్లో బయటపడ్డ కోట్లు..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!