PM Narendra Modi: ప్రపంచం అంతా భారత్ వైపు చూస్తోంది.. కొందరు దేశ విజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
PM Narendra Modi’s speech in Parliament: పార్లమెంట్ లో రాష్ట్రపతి ప్రసంగంపై ప్రధాని మోదీ కీలక ఉపన్యాసం చేశారు. రాష్ట్రపతి దేశంలోని మహిళలు, సోదరీమణులకు స్ఫూర్తిదాయకం అని కొనియాడారు. రాష్ట్రపతి దేశంలో గిరిజనులు ఉన్నతిని పెంచారని అన్నారు. 100 ఏళ్లకు ఒకసారి వచ్చే మహమ్మారి, యుద్దం లాంటి పరిస్థితులను భారత్ తట్టుకుందని మోదీ అన్నారు. ఎన్నికల కంటే దేశంలోని 140 కోట్ల ప్రజల సామర్థ్యం, శక్తి గొప్పదని అన్నారు. సమర్థవంతంగా భారత్ సంక్షోభాల నుంచి బయటపడిందని, ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించిందని అన్నారు.
ప్రపంచం అంతా భారత్ వైపు ఎంతో ఆశగా ఎదురుచూస్తోందని అన్నారు. భారతదేశంలో స్థిరమైన ప్రభుత్వం ఉందని, రాజకీయ అస్థిరత లేదని, పైగా నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం ఉందని చెప్పారు. విమర్శలను పట్టించుకోం అని.. సమయానుకూలంగా దేశానికి ఏం కావాలో అది చేసుకుంటూ పోతాం అని ప్రధాని స్పష్టం చేశారు. దేశంలో అవినీతిని నిర్మూలించాం. భారత్ ఈ క్షణం కోసం చాలా ఏళ్లుగా ఎదురుచూసిందని.. కోవిడ్ను భారత్ సమర్థవంతంగా ఎదుర్కొంది.. చాలా దేశాలను నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వేధిస్తున్నాయి.. ప్రపంచంలో 5వ ఆర్థిక శక్తిగా భారత్ ఆవిర్భవించింది.. ఇది దేశం గర్వించదగిన విషయం అని అన్నారు.
Also Read
Read Also: USA: విమానంలో ల్యాప్టాప్కు మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్..
దేశవ్యాప్తంగా అందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందించామని.. 150 దేశాలకు వ్యాక్సిన్లు పంపిణీ చేశామని ప్రధాని సభలో ప్రకటించారు. డిజిటల్ ఇండియాను చూసి ప్రపంచదేశాలు ఆశ్చర్యపోతున్నాయని.. వ్యాక్సిన్ సర్టిఫికేట్స్ కూడా క్షణాల్లో వచ్చేస్తున్నాయని.. కానీ కొందరు మాత్రం నిరాశతో ఉన్నారని విమర్శించారు. దేశంలో 90 వేల స్టార్టప్స్ పనిచేస్తున్నాయి, మొబైళ్ల తయారీలో దేశం రెంస్థానంలో ఉంది, ఇంధనం వినియోగంలో భారత్ మూడో స్థానంలో ఉందని తెలిపారు.
ప్రపంచ అభివృద్ధితో పాటు భారతదేశం తన అభివృద్ధిని కూడా చూసుకుంటోందని, ఇది చూసి కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. దేశీయ వైమానిక రవాణాలో భారత్ మూడో స్థానంలో ఉందని, అన్ని క్రీడల్లో భారత క్రీడాకారులు సత్తా చూపిస్తున్నారని కొనియాడారు. భారత్ లోని ప్రతి రంగంలోనూ, ప్రతి ఆలోచనలోనూ, పెద్ద ఎత్తున ఆశాభావం కనిపిస్తోందని, మెడికల్, ఇంజనీరింగ్, వృత్తి విద్యా కోర్సుల్లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకుంటున్నారని తెలిపారు. ఇదంతా చూసి కొంతమంది నిరాశలో కూరుకుపోయారని విమర్శించారు.
తాజావార్తలు
-
Bhoghi : ‘కందుల సులోచన రాణి’గా.. అనుపమ.. ఫస్ట్ లుక్ బాగుంది
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Jasprit Bumrah: సీన్ రివర్స్.. బ్యాటర్ల ముందు బెంబేలెత్తిపోతున్న బుమ్రా.. కెరీర్లోనే చెత్త ప్రదర్శన!
-
Dhruva Natchathiram : విక్రమ్ సినిమా వస్తోంది.. కానీ సూర్యతో పోటీ తప్పేలా లేదు
-
AP SSC Results 2026: ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల.. పెరిగిన ఉత్తీర్ణత..
ట్రెండింగ్
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!