PM Narendra Modi: నా జీవితం దేశానికే అంకితం.. నా రక్షణ కవచాన్ని మీరు ఛేదించలేరు..
PM Narendra Modi’s speech in Parliament: పార్లమెంట్ లో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. విపక్షాల చేస్తున్న విమర్శలపై ఘాటుగా స్పందించారు. మోడీపై బురదజల్లి లబ్ధిపొందాలని విపక్షాలు అనుకుంటున్నాయి. పేపర్లు, టీవీల్లో మోడీని విమర్శించి లబ్ధిపొందలేరు.. నా జీవితాన్ని దేశం కోసం అంకితం చేశా.. దేశ ప్రజలకు నాపై విశ్వాసం ఉంది, అది విపక్షాల అంచనాకు అందదు అని అన్నారు. 140 కోట్ల మంది ప్రజల ఆశీర్వాడమే నాకు రక్ష అని.. ఈ రక్షణ కవచాన్ని మీరు ఛేదించలేరని కీలక వ్యాఖ్యలు చేశారు. 50 ఏళ్లుగా నేను ప్రజా జీవితంలో ఉన్నా, పేదల కష్టసుఖాల గురించి తెలుసని అన్నారు.
Read Also: PM Narendra Modi: ప్రపంచం అంతా భారత్ వైపు చూస్తోంది.. కొందరు దేశ విజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
Also Read
- Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
- Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
- Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
- Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
నేను 25 కోట్ల కుటుంబాల సభ్యుడిని అని.. కొందరు ఒకే కుటుంబానికి సేవ చేస్తారు, కానీ నేను 25 కోట్ల కుటుంబాలకు సేవ చేస్తున్నా అని ప్రధాని అన్నారు. దేశంలో రోడ్లు, హైవేలు, రైల్వేలు గణనీయంగా అభివృద్ధి చేశామని వెల్లడించారు. ఒకప్పుడు రైల్వేలు అంటే యాక్సిడెంట్లు గుర్తుకు వచ్చేవని, ఇవాళ వందే భారత్ రైలును చూసి భారతీయులు గుర్వపడుతున్నారని అన్నారు. దేశాన్ని ముందుకు నడిపిస్తోంది మధ్యతరగతి వర్గమే అని, ఒకప్పుడు ప్రభుత్వాలు మధ్య తరగతిని గుర్తించలేదని.. మా ప్రభుత్వం మధ్యతరగతి వర్గం నిజాయితీని గుర్తించిందని ప్రధాని వెల్లడించారు. ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల దేశ అభివృద్ధి జరగదని అన్నారు .అనేక పథకాల్లో మధ్యతరగతి వర్గానికి ప్రాధాన్యత కల్పించామని పేర్కొన్నారు. జన ఔషధి స్టోర్ వల్ల మధ్యతరగతి వర్గానికి చాలా మేలు జరుగుతుందని తెలిపారు.
9 ఏళ్లలో 70 ఎయిర్ పోర్టుల కట్టామని అన్నారు. మనదేశంలోనే మొబైల్ డేటా ఛార్జీలు తక్కువగా ఉన్నాయని తెలిపారు. 2020 నుంచి 2030 దశాబ్ద కాలం “ఇండియా డికేడ్” గా ప్రపంచ చరిత్రలో నిలిచిపోతుందని ప్రధాని స్పష్టం చేశారు.నాలుగు వరసల రోడ్లను దేశమంతటా విస్తరిస్తున్నాం అని.. మౌళికసదుపాయాల ప్రాజెక్టుల్లో భారీగా పెట్టుబడులు పెట్టినట్లు ప్రధాని వెల్లడించారు. దేశ ప్రజలు నెగిటివిటీని నమ్మడం లేదని, విపక్షాలు పునారాలోచించుకోవాల్సిన సమయం అని ప్రధాని హితవు పలికారు.
తాజావార్తలు
-
Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
-
యష్ ‘టాక్సిక్’కు ఓటీటీ టెన్షన్..
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!