PM Narendra Modi: నా జీవితం దేశానికే అంకితం.. నా రక్షణ కవచాన్ని మీరు ఛేదించలేరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Narendra Modi’s speech in Parliament: పార్లమెంట్ లో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. విపక్షాల చేస్తున్న విమర్శలపై ఘాటుగా స్పందించారు. మోడీపై బురదజల్లి లబ్ధిపొందాలని విపక్షాలు అనుకుంటున్నాయి. పేపర్లు, టీవీల్లో మోడీని విమర్శించి లబ్ధిపొందలేరు.. నా జీవితాన్ని దేశం కోసం అంకితం చేశా.. దేశ ప్రజలకు నాపై విశ్వాసం ఉంది, అది విపక్షాల అంచనాకు అందదు అని అన్నారు. 140 కోట్ల మంది ప్రజల ఆశీర్వాడమే నాకు రక్ష అని.. ఈ రక్షణ కవచాన్ని మీరు ఛేదించలేరని కీలక వ్యాఖ్యలు చేశారు. 50 ఏళ్లుగా నేను ప్రజా జీవితంలో ఉన్నా, పేదల కష్టసుఖాల గురించి తెలుసని అన్నారు.
Read Also: PM Narendra Modi: ప్రపంచం అంతా భారత్ వైపు చూస్తోంది.. కొందరు దేశ విజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
Also Read
నేను 25 కోట్ల కుటుంబాల సభ్యుడిని అని.. కొందరు ఒకే కుటుంబానికి సేవ చేస్తారు, కానీ నేను 25 కోట్ల కుటుంబాలకు సేవ చేస్తున్నా అని ప్రధాని అన్నారు. దేశంలో రోడ్లు, హైవేలు, రైల్వేలు గణనీయంగా అభివృద్ధి చేశామని వెల్లడించారు. ఒకప్పుడు రైల్వేలు అంటే యాక్సిడెంట్లు గుర్తుకు వచ్చేవని, ఇవాళ వందే భారత్ రైలును చూసి భారతీయులు గుర్వపడుతున్నారని అన్నారు. దేశాన్ని ముందుకు నడిపిస్తోంది మధ్యతరగతి వర్గమే అని, ఒకప్పుడు ప్రభుత్వాలు మధ్య తరగతిని గుర్తించలేదని.. మా ప్రభుత్వం మధ్యతరగతి వర్గం నిజాయితీని గుర్తించిందని ప్రధాని వెల్లడించారు. ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల దేశ అభివృద్ధి జరగదని అన్నారు .అనేక పథకాల్లో మధ్యతరగతి వర్గానికి ప్రాధాన్యత కల్పించామని పేర్కొన్నారు. జన ఔషధి స్టోర్ వల్ల మధ్యతరగతి వర్గానికి చాలా మేలు జరుగుతుందని తెలిపారు.
9 ఏళ్లలో 70 ఎయిర్ పోర్టుల కట్టామని అన్నారు. మనదేశంలోనే మొబైల్ డేటా ఛార్జీలు తక్కువగా ఉన్నాయని తెలిపారు. 2020 నుంచి 2030 దశాబ్ద కాలం “ఇండియా డికేడ్” గా ప్రపంచ చరిత్రలో నిలిచిపోతుందని ప్రధాని స్పష్టం చేశారు.నాలుగు వరసల రోడ్లను దేశమంతటా విస్తరిస్తున్నాం అని.. మౌళికసదుపాయాల ప్రాజెక్టుల్లో భారీగా పెట్టుబడులు పెట్టినట్లు ప్రధాని వెల్లడించారు. దేశ ప్రజలు నెగిటివిటీని నమ్మడం లేదని, విపక్షాలు పునారాలోచించుకోవాల్సిన సమయం అని ప్రధాని హితవు పలికారు.
తాజావార్తలు
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
-
CM Chandrababu: ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరగాలి.. పారదర్శక పాలనతో ముందుకు వెళ్లాలి..!
-
The Red Bag : రాశీ కీలక పాత్రలో ‘ది రెడ్ బ్యాగ్’
-
Maharashtra: పెళ్లింట తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!