Narendra Modi: ఉగ్రవాదుల్ని వదిలి, నన్ను టార్గెట్ చేశారు.. మోడీ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Narendra Modi Sensational Comments In Gujarat Election Campaign: గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు.. ఉగ్రవాదాన్ని టార్గెట్ చేయమని తాము చెప్పామని, కానీ వాళ్లు తనని టార్గెట్ చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదాన్ని కూడా ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుంటోందని అన్నారు. కాంగ్రెస్ హయాంలో అనేక చోట్ల ఉగ్రదాడులు జరిగాయని, అయినా కాంగ్రెస్ చర్యలు తీసుకోకుండా ఉగ్రవాదం పట్ల ఉదాసీనంగా వ్యవహరించిందని పేర్కొన్నారు. అయితే.. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఉగ్రవాదులు భయపడుతున్నారని మోడీ పేర్కొన్నారు.
‘‘కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు దేశంలో ఉగ్రవాద కార్యాకలాపాలు విస్తృతంగా పెరిగాయి. గుజరాత్ రాష్ట్రం చాలాకాలం వరకు ఉగ్రవాదుల లక్ష్యంగా ఉంది. సూరత్, అహ్మదాబాద్లలో ఎన్నోసార్లు దాడులు జరిగాయి. ఆ దాడుల్లో ఎందరో రాష్ట్ర ప్రజలు మృతి చెందారు. అప్పుడు ఉగ్రవాదాన్ని టార్గెట్ చేయమని కాంగ్రెస్ని కోరాం. కానీ, వాళ్లు నన్ను మాత్రమే టార్గెట్ చేశారు. వాళ్లు నా మీద దృష్టి సారించడం వల్ల.. ఉగ్రవాదులు రెచ్చిపోయారు. దేశంలో చాలా చోట్ల బాంబు దాడులు జరిగాయి. ఉగ్రవాదాన్ని కూడా కాంగ్రెస్ తన ఓటు బ్యాంకుగా పరిగణిస్తోంది. బాట్లా హౌస్ ఎన్కౌంటర్ జరిగినప్పుడు.. కాంగ్రెస్ నేతలు వారికి మద్దతుగా మాట్లాడారు. టెర్రరిస్టులకు అనుకూలంగా మొసలి కన్నీరు కార్చారు’’ అంటూ మోడీ చెప్పారు. అయితే బీజేపీ మాత్రం ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు కృషి చేస్తోందని, ఇప్పుడు ఉగ్రవాదులు సరిహద్దుల్లో దాడులు చేయడానికి ముందు ఉగ్రవాదులు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారని తెలిపారు.
Also Read
- Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
ఇదే సమయంలో.. ఆమ్ ఆద్మీ పార్టీపై కూడా మోడీ ధ్వజమెత్తారు. కొన్ని పార్టీలు షార్ట్ కట్స్ని నమ్ముకుంటున్నాయని.. బుజ్జగింపు, ఓటు బ్యాంక్ రాజకీయాలను అనుసరిస్తున్నాయని ఆప్పై సెటైర్లు గుప్పించారు. అందుకే ఉగ్రవాదం విషయంలో మౌనంగా ఉంటున్నాయన్నారు. కాగా.. గుజరాత్లో డిసెంబర్ 1, డిసెంబర్ 5న రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 8న ఫలితాలను ప్రకటిస్తారు. గత 27 సంవత్సరాలుగా గుజరాత్లో అధికారంలో ఉన్న బీజేపీ.. ఈసారి కూడా గెలవాలని కసరత్తు చేస్తోంది. ఈ ఎన్నికల్లో 140 సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
తాజావార్తలు
-
Samantha : సమంత వర్సెస్ శోభితా-చైతూ.. విడిపోయినా ఆగని సోషల్ మీడియా వార్!
-
Rahul Dev: భార్య మరణంతో కుప్పకూలిపోయా.. కొడుకే నా జీవితాన్ని మార్చేశాడు: రాహుల్ దేవ్
-
Bhagirath Choudhary: మంత్రే లబ్ధిదారుడు.. సొంత మంత్రిత్వ శాఖ పథకం నుంచి రూ.99 లక్షల సబ్సిడీ..
-
Herbal Hair Care: షాంపూలు రాకముందు జుట్టు మెరిసేలా ఉంచిన సహజ చిట్కాలు ఇవే..
-
FIH Pro League: క్రికెట్ మాత్రమే కాదు.. హాకీలోనూ పాకిస్థాన్ను చిత్తుచిత్తుగా ఓడించిన భారత్.!
ట్రెండింగ్
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!