Farmers Killing: లఖింపూర్ ఖేరి ఘటన.. 4 నెలల తర్వాత మౌనం వీడిన మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది… అయితే, తొలిసారి ఈ ఘటనపై స్పందించారు ప్రధాని నరేంద్ర మోడీ… లఖింపూర్ ఖేరీ ఘటన జరిగిన 4 నెలల తర్వాత మొదటి సారి రైతుల హత్యలపై వ్యాఖ్యానించారు.. ఈ కేసులో కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా అక్టోబర్ నుండి జైలులో ఉండగా.. అజయ్ మిశ్రాను పదవి నుంచి తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసినప్పటికీ అతడిని హోం శాఖ సహాయ మంత్రిగా కొనసాగిస్తోంది నరేంద్ర మోడీ సర్కార్.. అయితే, లఖింపూర్ ఖేరీ ఘటనపై మౌనం వీడిన ప్రధాని.. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు వాహనం నిరసన తెలిపిన రైతులపైకి దూసుకెళ్లాడన్న ఆరోపణలకు సంబంధించిన కేసులో ఉత్తరప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తోందని అన్నారు.
Read Also: KTR: మోడీ క్షమాపణ చెప్పాల్సిందే..!
Also Read
- Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Mohan Bhagwat: రిజర్వేషన్లు కొనసాగాలి, వారు వదులుకోవాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
- Mohan Bhagwat: స్వలింగ వివాహాలపై మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు
ఉత్తరప్రదేశ్లో మొదటి దశ ఓటింగ్కు ఒక రోజు ముందు వార్తా సంస్థ ఏఎన్ఐతో మాట్లాడిన ప్రధాని మోడీ.. చర్యలు, దర్యాప్తు నుండి బీజేపీ తన వాళ్లను రక్షించిందుకే ప్రయత్నాలు చేస్తోందన్న ఆరోపణలపై స్పందించారు.. సుప్రీంకోర్టు ఏ కమిటీని కోరుకుందో దానికి రాష్ట్ర ప్రభుత్వం తన సమ్మతిని తెలిపిందని.. ఏ న్యాయమూర్తి విచారణకు సుప్రీంకోర్టు కోరుకుందో.. దానిపై రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తోందన్నారు ప్రధాని మోడీ.. కాగా, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ లఖింపూర్ ఖేరీ వద్ద అక్టోబర్ 3న రైతులు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీ నిర్వహిస్తుండగా.. రైతులపైకి దూసుకెళ్లింది ఓ కారు.. ఆ కారును ఆశిష్ మిశ్రా నడుపుతున్నాడు. రెండ్రోజుల తర్వాత అతడిని అరెస్టు చేశారు… అయితే, దర్యాప్తులో నెమ్మదిగా సాగుతున్నట్లు ఆరోపణలు రావడంతో, సుప్రీంకోర్టు విచారణకు ఆదేశించింది. రైతుల ఆగ్రహం, లఖింపూర్ ఖేరీ ఘటన ప్రభావం.. యూపీ ఎన్నికలలో బీజేపీపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని విశ్లేషణలు ఉన్నాయి .. ముఖ్యంగా రైతులు గణనీయమైన ఓటింగ్ కలిగి ఉన్న పశ్చిమ ప్రాంతాలలో.. కొంత కోపాన్ని తగ్గించడానికి, ప్రభుత్వం నవంబర్లో వ్యవసాయ చట్టాలను ఉపసంహరిస్తూ నిర్ణయం తీసుకుంది.. దీంతో ఢిల్లో సరిహద్దుల్లో సుదీర్ఘకాలం నిరసన తెలిపిన రైతులు కూడా తమ ఆందోళనను ముగించారు.. ఇక, రైతుల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలను.. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఉపసంహరించుకున్నామని ప్రధాని మోడీ తెలిపారు.
తాజావార్తలు
-
National Handloom Day: చేనేత కుటుంబాలకు భారీ ఊరట.. రూ.179 కోట్లు జమ చేయనున్న ప్రభుత్వం!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
Friday Horoscope: ఆ రాశి వారు జాగ్రత్త.. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు!
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!