Rahul Gandhi: ఇది గాంధీ-గాడ్సేల మధ్య పోరాటం.. మోడీ వెనక చూసి కార్ నడుపుతున్నాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: కాంగ్రెస్ హయాంలో జరిగిన రైలు ప్రమాదాలకు బ్రిటీష్ వారిని తప్పు పట్టలేదని రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ న్యూయార్క్లోని భారతీయ ప్రవాసులను ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో జరిగిన రైలు ప్రమాదాలకు బ్రిటిష్ వారిని నిందించడం లేదని, కేంద్ర మంత్రి బాధ్యత వహించారని ఆయన అననారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ లకు భవిష్యత్తును చూసే సామర్థ్యం లేదు.. ఏం అడిగినా వెనక్కు చూస్తారు.. రైలు ప్రమాదం ఎందుకు జరిగిందని ప్రభుత్వాన్ని అడిగితే.. 50 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ఇలా చేసిందని చెబుతుంటారని ఎద్దేవా చేశారు.
Read Also: CM KCR : బాసర సరస్వతి అమ్మవారి ఆలయాన్ని పెద్ద ఎత్తున మనం నిర్మాణం
Also Read
ప్రధాని నరేంద్ర మోడీ వెనక అద్దం చూస్తూ భారతదేశం అనే కార్ నడుపుతున్నాడని విమర్శించారు. బీజేపీ ఎప్పుడూ గతం గురించి మాత్రమే మాట్లాడుతుందని, భవిష్యత్తు గురించి ఆలోచించనది విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీల మధ్య పోరు గురించి అభివర్ణిస్తూ.. ఇది మహాత్మా గాంధీ, నాథురాం గాడ్సేల మధ్య పోరాటమని రాహుల్ గాంధీ అన్నారు. ఒక నాథురామ్ గాడ్సే కోపం, హింస, జీవిత వాస్తవికతను ఎదుర్కోలేక, గాంధీని కాల్చిచంపడానికి కారణం అని అన్నారు. గాంధీజీ ముందు చూసే వాడని, ఆధునికుడు, ఓపెన్ మైండెడ్ అని, గాడ్సే గతంలో గురించి మాట్లాడాడు, భవిష్యత్ గురించి మాట్లాడలేదని, అతను కోపం, ద్వేషంతో ఉన్నాడని రాహుల్ గాంధీ విమర్శించారు. అంతకుముందు రాహుల్ గాంధీ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాజీనామాకు డిమాండ్ చేశారు. ఒడిశా బాలాసోర్ రైలు దుర్ఘటనపై ఆయన డిమాండ్ చేయాలని ట్వీట్ చేశారు.
తాజావార్తలు
-
Rajpal Yadav: కోర్టులోనూ నటిస్తున్నారా?.. రాజ్పాల్ యాదవ్పై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు, రూ.2 కోట్లు కట్టాల్సిందే!
-
Drone Attack on Mecca: మక్కా సమీపంలో డ్రోన్ కలకలం.. కూల్చివేసిన సౌదీ బలగాలు.!
-
Wedding Date Confirmed: క్రికెటర్ రింకు సింగ్, ఎంపీ ప్రియా సరోజ్ల పెళ్లి తేదీ ఫిక్స్..!
-
China vs US: AI ఏ అగ్రరాజ్యానికీ సొంతం కాదు.. అమెరికాకు చైనా వార్నింగ్..
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!