PM Modi: లొంగిపోండి లేదంటే వదిలిపెట్టం.. టీఎంసీ గుండాలకు మోడీ ఫైనల్ వార్నింగ్..
- టీఎంసీ గుండాలకు ప్రధాని మోడీ స్ట్రాంగ్ వార్నింగ్..
- లోంగిపోండి లేదంటే వదిలిపెట్టనని హెచ్చరిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం బెంగాల్ ప్రచారంలో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో.. గుండాలు, సిండికేట్లకు ఇదే చివరి వార్నింగ్ అంటూ హెచ్చరించారు. బిష్ణుపూర్లో జరిగిన బీజేపీ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. ‘‘టీఎంసీ గుండాలు, సిండికేట్లు, అవినీతిపరులందరికి చివరి అవకాశం ఇస్తున్నాను. ఏప్రిల్ 29లోపు మీరు మీకు సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్లో లొంగిపోండి. మే 4 తర్వాత ఎవరినీ వదిలిపెట్టేది లేదు. బిష్ణుపూర్ మాఫియా, టీఎంసీ సిండికేట్ జాగ్రత్తగా వినండి. దీనిని ఇకపై సహించేది లేదు’’ అని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.
Also Read
రాష్ట్రంలో మహిళా ఓటర్లే లక్ష్యంగా ప్రధాని హామీలు ఇచ్చారు. బెంగాల్తో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత రేషన్, మాతృశక్తి భరోసా కార్డ్ ద్వారా ఏడాదికి రూ. 36,000 అందిస్తామని ఆయన చెప్పారు. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ను ఎవరూ దొంగిలించలేరని అన్నారు. పొరుగున ఉన్న అస్సాం, త్రిపుర, ఒడిశా, బీహార్లో మహిళలకు అందుతున్న పథకాలు, బెంగాల్లో టీఎంసీ ప్రభుత్వం వల్ల లభించడం లేదని చెప్పారు. పీఎం ఆవాస్ యోజన కింద మహిళలకు శాశ్వత ఇళ్ల కోసం రూ. 1.5 లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు.
మమతా బెనర్జీ సర్కార్కు బెంగాల్ మహిళలు ప్రధాన ఓటు బ్యాంకుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ మహిళల్ని తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తోంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23, ఏప్రిల్ 29 తేదీలలో రెండు దశల్లో జరగనున్నాయి, ఓట్ల లెక్కింపు మే 4న చేపట్టనున్నారు. మమతా బెనర్జీ వరుసగా నాలుగోసారి అధికారాన్ని దక్కించుకోవాలని ప్రయత్నిస్తుండగా, బీజేపీ ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!