PM Modi: లొంగిపోండి లేదంటే వదిలిపెట్టం.. టీఎంసీ గుండాలకు మోడీ ఫైనల్ వార్నింగ్..
- టీఎంసీ గుండాలకు ప్రధాని మోడీ స్ట్రాంగ్ వార్నింగ్..
- లోంగిపోండి లేదంటే వదిలిపెట్టనని హెచ్చరిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం బెంగాల్ ప్రచారంలో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో.. గుండాలు, సిండికేట్లకు ఇదే చివరి వార్నింగ్ అంటూ హెచ్చరించారు. బిష్ణుపూర్లో జరిగిన బీజేపీ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. ‘‘టీఎంసీ గుండాలు, సిండికేట్లు, అవినీతిపరులందరికి చివరి అవకాశం ఇస్తున్నాను. ఏప్రిల్ 29లోపు మీరు మీకు సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్లో లొంగిపోండి. మే 4 తర్వాత ఎవరినీ వదిలిపెట్టేది లేదు. బిష్ణుపూర్ మాఫియా, టీఎంసీ సిండికేట్ జాగ్రత్తగా వినండి. దీనిని ఇకపై సహించేది లేదు’’ అని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.
Also Read
- August New Rules 2026: రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు.. ప్రతి ఇంటి బడ్జెట్పై ప్రభావం చూపే 10 మార్పులు..
- Cauvery Dispute: కావేరీ వివాదం మళ్లీ వేడెక్కింది.. సీఎం విజయ్తో డీకే శివకుమార్ భేటీ వాయిదా
- Kulgam: కుల్గామ్లో ఉగ్ర దాడి.. వలస కార్మికుడు మృతి
- Saayoni Ghosh: పార్లమెంట్ను అడ్డుకోవడం భావ్యం కాదు.. టీఎంసీ రెబల్ సాయోని ఘోష్ ఆగ్రహం
రాష్ట్రంలో మహిళా ఓటర్లే లక్ష్యంగా ప్రధాని హామీలు ఇచ్చారు. బెంగాల్తో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత రేషన్, మాతృశక్తి భరోసా కార్డ్ ద్వారా ఏడాదికి రూ. 36,000 అందిస్తామని ఆయన చెప్పారు. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ను ఎవరూ దొంగిలించలేరని అన్నారు. పొరుగున ఉన్న అస్సాం, త్రిపుర, ఒడిశా, బీహార్లో మహిళలకు అందుతున్న పథకాలు, బెంగాల్లో టీఎంసీ ప్రభుత్వం వల్ల లభించడం లేదని చెప్పారు. పీఎం ఆవాస్ యోజన కింద మహిళలకు శాశ్వత ఇళ్ల కోసం రూ. 1.5 లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు.
మమతా బెనర్జీ సర్కార్కు బెంగాల్ మహిళలు ప్రధాన ఓటు బ్యాంకుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ మహిళల్ని తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తోంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23, ఏప్రిల్ 29 తేదీలలో రెండు దశల్లో జరగనున్నాయి, ఓట్ల లెక్కింపు మే 4న చేపట్టనున్నారు. మమతా బెనర్జీ వరుసగా నాలుగోసారి అధికారాన్ని దక్కించుకోవాలని ప్రయత్నిస్తుండగా, బీజేపీ ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది.
తాజావార్తలు
-
Off The Record: సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి బ్యాడ్ మార్నింగ్?
-
West Indies: వ్యక్తిగత కారణాలతోనే దూరం.. క్రికెట్ వెస్టిండీస్ ప్రకటనను గుర్తుచేసిన పేసర్..
-
August New Rules 2026: రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు.. ప్రతి ఇంటి బడ్జెట్పై ప్రభావం చూపే 10 మార్పులు..
-
Tablet Launched: 10,100mAh బ్యాటరీ, కాగితం లాంటి డిస్ప్లే.. అదిరిపోయిన ఫీచర్స్..
-
Cauvery Dispute: కావేరీ వివాదం మళ్లీ వేడెక్కింది.. సీఎం విజయ్తో డీకే శివకుమార్ భేటీ వాయిదా
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!