PM Modi: లొంగిపోండి లేదంటే వదిలిపెట్టం.. టీఎంసీ గుండాలకు మోడీ ఫైనల్ వార్నింగ్..
- టీఎంసీ గుండాలకు ప్రధాని మోడీ స్ట్రాంగ్ వార్నింగ్..
- లోంగిపోండి లేదంటే వదిలిపెట్టనని హెచ్చరిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం బెంగాల్ ప్రచారంలో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో.. గుండాలు, సిండికేట్లకు ఇదే చివరి వార్నింగ్ అంటూ హెచ్చరించారు. బిష్ణుపూర్లో జరిగిన బీజేపీ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. ‘‘టీఎంసీ గుండాలు, సిండికేట్లు, అవినీతిపరులందరికి చివరి అవకాశం ఇస్తున్నాను. ఏప్రిల్ 29లోపు మీరు మీకు సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్లో లొంగిపోండి. మే 4 తర్వాత ఎవరినీ వదిలిపెట్టేది లేదు. బిష్ణుపూర్ మాఫియా, టీఎంసీ సిండికేట్ జాగ్రత్తగా వినండి. దీనిని ఇకపై సహించేది లేదు’’ అని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.
Also Read
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
- Bankra mosque: కోల్కతా ఎయిర్పోర్టు పక్కన 136 ఏళ్ల మసీదు తరలింపు..
- VBSA Bill: పార్లమెంట్లోకి ‘వీబీఎస్ఏ బిల్లు’.. ఎన్డీఏ రాష్ట్రాల సహా తీవ్ర వ్యతిరేకత.. కారణమిదేనా?
రాష్ట్రంలో మహిళా ఓటర్లే లక్ష్యంగా ప్రధాని హామీలు ఇచ్చారు. బెంగాల్తో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత రేషన్, మాతృశక్తి భరోసా కార్డ్ ద్వారా ఏడాదికి రూ. 36,000 అందిస్తామని ఆయన చెప్పారు. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ను ఎవరూ దొంగిలించలేరని అన్నారు. పొరుగున ఉన్న అస్సాం, త్రిపుర, ఒడిశా, బీహార్లో మహిళలకు అందుతున్న పథకాలు, బెంగాల్లో టీఎంసీ ప్రభుత్వం వల్ల లభించడం లేదని చెప్పారు. పీఎం ఆవాస్ యోజన కింద మహిళలకు శాశ్వత ఇళ్ల కోసం రూ. 1.5 లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు.
మమతా బెనర్జీ సర్కార్కు బెంగాల్ మహిళలు ప్రధాన ఓటు బ్యాంకుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ మహిళల్ని తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తోంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23, ఏప్రిల్ 29 తేదీలలో రెండు దశల్లో జరగనున్నాయి, ఓట్ల లెక్కింపు మే 4న చేపట్టనున్నారు. మమతా బెనర్జీ వరుసగా నాలుగోసారి అధికారాన్ని దక్కించుకోవాలని ప్రయత్నిస్తుండగా, బీజేపీ ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది.
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!