PM Modi: నేడు ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి ప్రధాని మోడీ..
- నేడు నాగ్పూర్ ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి పీఎం మోడీ..
- హెడ్గేవార్కి నివాళులు అర్పించనున్న ప్రధాని..
- పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన..
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ గుడు పడ్వా, ఉగాది పండగ సందర్భంగా ఈ రోజు నాగ్పూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లనున్నారు. అక్కడ ఆయన స్మృతి మందిర్లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) వ్యవస్థాపక నాయకులకు నివాళులు అర్పిస్తారని శనివారం ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. మోడీ తన పర్యటనలో డాక్టర్ హెడ్గేవార్ స్మృతి మందిర్లో ఉన్న ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు కేబీ హెడ్గేవార్, సంస్థ రెండో సర్సంఘచాలక్ ఎంఎస్ గోల్వాల్కర్ స్మారక చిహ్నాల వద్ద నివాళులర్పిస్తారు.
1956లో వేల మందితో కలిసి అంబేద్కర్ బౌద్ధమతాన్ని స్వీకరించిన దీక్ష భూమిలో బీఆర్అంబేద్కర్కి కూడా నివాళులర్పిస్తారు. మాధవ్ నేత్రాలయ ఐ ఇన్స్టిట్యూట్ అండ్ రీసెర్చ్ సెంటర్లోని నేత్రాలయ ప్రీమియం సెంటర్కు ప్రధాని శంకుస్థాపన చేస్తారని భావిస్తున్నారు. ఈ ఫెసిలిటీలో 250 పడకల ఆస్పత్రి, 14 ఔట్ పేషెంట్ విభాగాలు (OPDలు), 14 మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు ఉంటాయి.
Also Read
- Rajya Sabha: బీజేపీలో ఆప్ ఎంపీల విలీనం.. రాజ్యసభ ఛైర్మన్ ఆమోదం
- Kejriwal: ఆర్ఎస్ఎస్ జడ్జ్ల ముందు హాజరుకాను.. జస్టిస్ స్వర్ణకాంతకు కేజ్రీవాల్ లేఖ
- FASTag Major Changes: ఫాస్టాగ్ విధానంలో సంచలన మార్పులు.. నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు
- Designer Pen Smuggling: ఒక్కో పెన్ను రూ.50 వేలు.. కస్టమ్స్ సైతం నివ్వెరపోయే స్మగ్లింగ్!
వీటితో పాటు ప్రధాని మోడీ సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్కు చెందిన మందుగుండు సామాగ్రి ఫెసిలిటీని సందర్శిస్తారు. కొత్తగా నిర్మించిన 1250 మీటర్లు, 25 మీటర్ల వెడల్పు కలిగిన మానవరహిత వైమానిక వాహనాల(UAVలు) కోసం నిర్మించిన ఎయిర్స్ట్రిప్ను ప్రారంభిస్తారు. లైవ్ మునిషన్, వార్ హెడ్ పరీక్ష సెంటర్ని ప్రారంభిస్తారని ప్రకటనలో తెలిపారు.
ప్రధాని పర్యటన సందర్భంగా నాగ్పూర్లో విస్తృత భద్రతా ఏర్పాట్లను చేశారు. ప్రధాని కాన్వాయ్లో వీఐపీ రక్షణ కోసం RCEID (రేడియో నియంత్రిత ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజెస్) జామర్ పరికరాలను కలిగి ఉన్న 20 ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేశారు. స్థానిక యూనిట్లు, బాంబ్ స్వ్కాడ్, క్విక్ రెస్పాన్స్ టీం నుంచి 5000 మంది పోలీసులు మోహరించారు. మొత్తం 900 మంది ట్రాఫిక్ పోలీసులు రోడ్లపై మోహరించనున్నారు. నాగ్పూర్ పర్యటన తర్వాత ప్రధాని ఛత్తీస్గఢ్ బిలాస్పూర్కి వెళ్లనున్నారు. అక్కడ ఆయన విద్యుత్, చమురు, గ్యాస్, రైలు, రోడ్డు, విద్య, గృహనిర్మాణ రంగాలకు చెందిన అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు.
తాజావార్తలు
-
Sheikh Yusuf Afridi: ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో దుండగుల కాల్పులు.. లష్కర్-ఎ-తోయిబా అగ్ర కమాండర్ షేక్ అఫ్రిది హతం
-
Tollywood : మే 1 నుంచి థియేటర్ల బంద్?
-
The India Story: జూలై 24న కాజల్ అగర్వాల్ ‘ది ఇండియా స్టోరి’
-
AP Petrol Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సర్కార్ అలర్ట్.. కీలక ఆదేశాలు జారీ
-
Tamil Cinema : కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో భారీ కుదుపు.. హీరోలకు రెమ్యునరేషన్ ఇచ్చేది లేదని నిర్ణయం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!