Kanhaiya Kumar: ‘‘ఆమె రీల్స్ చేయడంలో బాగా బిజీ’’.. ఫడ్నవీస్ భార్యపై కన్హయ్య కామెంట్స్
- ఆమె రీల్స్ చేయడంలో బాగా బిజీ..
- ఫడ్నవీస్ భార్యని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు..
- అమృతా ఫడ్నవీస్ని టార్గెట్ చేసిన కన్హయ్య కుమార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kanhaiya Kumar: మహరాష్ట్ర ఎన్నికల్లో విమర్శలు ప్రతివిమర్శలు తారాస్థాయికి చేరాయి. తాజాగా కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ భార్య గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉపముఖ్యమంత్రి భార్య ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తున్నప్పుడు ‘‘మతాన్ని రక్షించే’’ బాధ్యత ప్రజలపై ఎందుకు ఉండాలని ప్రశ్నించారు. నాగ్పూర్లో జరిగిన ర్యాలీలో అమృతా ఫడ్నవీస్ పేరును నేరుగా ప్రస్తావంచకుండా ఈ వ్యాఖ్యలు చేశారు. నాగ్పూర్ సౌత్వెస్ట్ నియోజకవర్గం నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ పోటీ చేస్తున్నారు. ఇదే సీటు నుంచి కాంగ్రెస్ తరుపున ప్రఫుల్ల గూడాఢే పోటీ చేస్తున్నారు. ఆయన తరుపున కన్హయ్య కుమార్ ప్రచారం చేశారు.
కన్హయ్య కుమార్ దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్ని ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు. శిక్షణ పొందిన క్లాసికల్ సింగర్, బ్యాంకర్ అయిన అమృతా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. “ఇది ధర్మయుద్ధం (మతయుద్ధం) అయితే, మతాన్ని రక్షించడం గురించి మీరు ప్రసంగాలు చేసే ఏ నాయకుడిని అయినా ప్రశ్నించండి. మతాన్ని రక్షించే పోరాటంలో నాయకుడి స్వంత కొడుకులు, కుమార్తెలు కూడా పాల్గొంటారా అని అడగండి. మతం గురించి మాట్లాడే నాయకుడి పిల్లలు విదేశాల్లో చదువుతున్నప్పుడు ప్రజానీకం మతాన్ని కాపాడుతున్నారు. ఉపముఖ్యమంత్రి భార్య ఇన్స్టాగ్రామ్ను ఎలా రీల్స్ చేస్తుంది?’’ అని కన్హయ్య కుమార్ అన్నారు.
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- IMD Rain Alert: దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- India At UN: పాక్కు భారత్ షాక్.. కాశ్మీర్ రాగం పాడితే ఇదే సమాధానం!
Read Also: V. Hanumantha Rao: కులగణన చేయాలా వద్దా.. నాదెండ్ల భాస్కర్ రావు చెప్పాలి..
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) చైర్పర్సన్గా ఉన్న హోం మంత్రి అమిత్ షా కుమారుడు జయ్ షాపై కూడా ఆయన విమర్శలు చేశారు. ‘‘ అమిత్ షా కుమారుడు జై షా మతాన్ని కాపాడుతున్నాడా..? అతను బీసీసీఐలో ఐపీఎల్ టీమ్స్ ఏర్పాటు చేస్తున్నాడు. అయితే, డీమ్ 11 టీమ్స్ తయారు చేయాలని మనకు చెబుతున్నారు. మనం క్రికెటర్లు కావాలని కలలు కంటే, చివరకు జూదగాళ్లుగా మిగిలిపోతున్నాము’’ అని అన్నారు.
అయితే, కన్హయ్య కుమార్ వ్యాఖ్యలపై బీజేపీ విరుచుకుపడింది. ఇది ప్రతీ మరాఠీ మహిళను అవమానించడమే అని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా అన్నారు. కన్హయ్య ఓ ఉగ్రవాది, పార్లమెంట్పై దాడి చేసిన అఫ్జల్ గురు మద్దతుదారుడని అన్నారు. అఫ్జల్ గురు వర్ధంతి సందర్భంగా జేఎన్యూలో ఓ కార్యక్రమం నిర్వహించి 2016లో కన్హయ్య కుమార్ దేశ ద్రోహం కింద అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఫడ్నవీస్ ‘‘ఓట్ జిహాద్’’ వ్యాఖ్యల తర్వాత కన్హయ్య ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!