Kanhaiya Kumar: ‘‘ఆమె రీల్స్ చేయడంలో బాగా బిజీ’’.. ఫడ్నవీస్ భార్యపై కన్హయ్య కామెంట్స్
- ఆమె రీల్స్ చేయడంలో బాగా బిజీ..
- ఫడ్నవీస్ భార్యని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు..
- అమృతా ఫడ్నవీస్ని టార్గెట్ చేసిన కన్హయ్య కుమార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kanhaiya Kumar: మహరాష్ట్ర ఎన్నికల్లో విమర్శలు ప్రతివిమర్శలు తారాస్థాయికి చేరాయి. తాజాగా కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ భార్య గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉపముఖ్యమంత్రి భార్య ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తున్నప్పుడు ‘‘మతాన్ని రక్షించే’’ బాధ్యత ప్రజలపై ఎందుకు ఉండాలని ప్రశ్నించారు. నాగ్పూర్లో జరిగిన ర్యాలీలో అమృతా ఫడ్నవీస్ పేరును నేరుగా ప్రస్తావంచకుండా ఈ వ్యాఖ్యలు చేశారు. నాగ్పూర్ సౌత్వెస్ట్ నియోజకవర్గం నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ పోటీ చేస్తున్నారు. ఇదే సీటు నుంచి కాంగ్రెస్ తరుపున ప్రఫుల్ల గూడాఢే పోటీ చేస్తున్నారు. ఆయన తరుపున కన్హయ్య కుమార్ ప్రచారం చేశారు.
కన్హయ్య కుమార్ దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్ని ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు. శిక్షణ పొందిన క్లాసికల్ సింగర్, బ్యాంకర్ అయిన అమృతా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. “ఇది ధర్మయుద్ధం (మతయుద్ధం) అయితే, మతాన్ని రక్షించడం గురించి మీరు ప్రసంగాలు చేసే ఏ నాయకుడిని అయినా ప్రశ్నించండి. మతాన్ని రక్షించే పోరాటంలో నాయకుడి స్వంత కొడుకులు, కుమార్తెలు కూడా పాల్గొంటారా అని అడగండి. మతం గురించి మాట్లాడే నాయకుడి పిల్లలు విదేశాల్లో చదువుతున్నప్పుడు ప్రజానీకం మతాన్ని కాపాడుతున్నారు. ఉపముఖ్యమంత్రి భార్య ఇన్స్టాగ్రామ్ను ఎలా రీల్స్ చేస్తుంది?’’ అని కన్హయ్య కుమార్ అన్నారు.
Also Read
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
- Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
Read Also: V. Hanumantha Rao: కులగణన చేయాలా వద్దా.. నాదెండ్ల భాస్కర్ రావు చెప్పాలి..
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) చైర్పర్సన్గా ఉన్న హోం మంత్రి అమిత్ షా కుమారుడు జయ్ షాపై కూడా ఆయన విమర్శలు చేశారు. ‘‘ అమిత్ షా కుమారుడు జై షా మతాన్ని కాపాడుతున్నాడా..? అతను బీసీసీఐలో ఐపీఎల్ టీమ్స్ ఏర్పాటు చేస్తున్నాడు. అయితే, డీమ్ 11 టీమ్స్ తయారు చేయాలని మనకు చెబుతున్నారు. మనం క్రికెటర్లు కావాలని కలలు కంటే, చివరకు జూదగాళ్లుగా మిగిలిపోతున్నాము’’ అని అన్నారు.
అయితే, కన్హయ్య కుమార్ వ్యాఖ్యలపై బీజేపీ విరుచుకుపడింది. ఇది ప్రతీ మరాఠీ మహిళను అవమానించడమే అని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా అన్నారు. కన్హయ్య ఓ ఉగ్రవాది, పార్లమెంట్పై దాడి చేసిన అఫ్జల్ గురు మద్దతుదారుడని అన్నారు. అఫ్జల్ గురు వర్ధంతి సందర్భంగా జేఎన్యూలో ఓ కార్యక్రమం నిర్వహించి 2016లో కన్హయ్య కుమార్ దేశ ద్రోహం కింద అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఫడ్నవీస్ ‘‘ఓట్ జిహాద్’’ వ్యాఖ్యల తర్వాత కన్హయ్య ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?