PM Modi: ఈనెల 29న ఢిల్లీలో ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్న మోడీ
- ఈనెల 29న ఢిల్లీలో ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్న మోడీ
- పరివర్తన్ ర్యాలీతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో వచ్చే ఏడాది ప్రారంభంలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అధికార ఆప్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. కేజ్రీవాల్ ఇంటింటా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. అలాగే అభ్యర్థులను కూడా ప్రకటించేశారు. అంతేకాకుండా ఉచిత హామీలు కూడా ప్రకటిస్తున్నారు. ఇంకోవైపు కాంగ్రెస్ కూడా సన్నద్ధమవుతోంది. అయితే ఈసారి ఢిల్లీలో అధికారాన్ని ఛేజిక్కించుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 29న హస్తినలో ప్రధాని మోడీ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. పరివర్తన్ ర్యాలీతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.
ఇది కూడా చదవండి: Health Benefits Of Betel Leaves : తమల పాకుతో ఇన్ని లాభాలా?.. మీరూ ట్రై చేయండి
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
- Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్హాసన్ కీలక వ్యాఖ్యలు
- 1991 India Gold Crisis: రాత్రికి రాత్రి బ్రిటన్కు 47,000 కిలోల బంగారం తరలింపు.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే!
ఢిల్లీ ప్రభుత్వం కాలం ఫిబ్రవరితో ముగుస్తోంది. దీంతో వచ్చే నెలలోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జనవరి 6న ఓటర్ల తుది జాబితాను కేంద్రం ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. అనంతరం ఏదొక సమయంలో ఎన్ని్కల షెడ్యూల్ విడుదల చేయొచ్చని తెలుస్తోంది. జనవరి నెలాఖరులోగా ఎన్నికలు పూర్తి చేయొచ్చని సమాచారం. అందుకోసమే ప్రధాన పార్టీలు రెడీ అయిపోతున్నాయి.
ఇది కూడా చదవండి: Off The Record: ఆ సీనియర్ నేత మారిపోయారా..?
ఇదిలా ఉంటే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమిలో ఉన్న ఆప్, కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేస్తున్నాయి. రెండు పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో సింగిల్గానే బరిలోకి దిగాలని నిర్ణయం తీసుకున్నాయి. అంతేకాకుండా ఇటీవలే ఆప్ పరిపాలనపై కాంగ్రెస్ వైట్ పేపర్ విడుదల చేసింది. హామీల అమల్లో వైఫల్యం చెందిందని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. ఆ పార్టీ సీనియర్ నేత అజయ్ మాకెన్ అయితే.. ఆప్తో పొత్తు పెద్ద పొరపాటు అని అభివర్ణించారు. ఇక బీజేపీ కూడా ఇప్పటికే ఆయా కమిటీలను ఏర్పాటు చేసింది. ఇలా మూడు ప్రధాన పార్టీల మధ్య నువ్వానేనా? అన్నట్టుగా ఫైటింగ్ ఉండే అవకాశం ఉంది.
PM Modi to launch BJP's campaign for Delhi Assembly election 2025 with first Parivartan Rally on December 29
Read @ANI Story | https://t.co/IeMVeVqMj3#PMModi #BJP #DelhiAssembly #ParivartanRally pic.twitter.com/jWqrmzRz06
— ANI Digital (@ani_digital) December 27, 2024
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..