PM Modi-Ayodhya: ధ్వజారోహణతో ఎన్నో ఏళ్ల నాటి గాయాలు పోయాయి
- అయోధ్య శ్రీరామ్లల్లా ఆలయంలో ధ్వజారోహణం
- ఆలయ శిఖరంపై కాషాయ జెండా ఆవిష్కరించిన మోడీ
- ఎన్నో ఏళ్ల సంకల్పం నెరవేరిందన్న మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అయోధ్య రామమందిరంపై కాషాయ జెండాను ప్రధాని మోడీ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ భావోద్వేగ ప్రసంగం చేశారు. ఎన్నో ఏళ్ల సంకల్పం ఈరోజు నెరవేరిందని తెలిపారు. ధ్వజారోహణతో ఎన్నో ఏళ్ల నాటి గాయాలు మానిపోయాయని చెప్పుకొచ్చారు. రామమందిర నిర్మాణం కోసం ప్రాణ త్యాగం చేసిన ప్రతి భక్తుడికి నివాళులు అర్పిస్తున్నానన్నారు.
ఎప్పుడైనా సత్యమే గెలుస్తుందని.. నేడు నిలబెట్టిన ధర్మ ధ్వజము.. పేదరికం, బాధలు లేని సమాజాన్ని నిర్మించడానికి.. వివక్షతను వదిలించుకోవడానికి మనకు స్ఫూర్తినిస్తుందని చెప్పారు. ఈ కాషాయ జెండా హిందూ నాగరికత పునరుజ్జీవనాన్ని సూచిస్తుందని.. అంతేకాకుండా సంవత్సరాల గాయం కూడా మానిపోతుందని పేర్కొన్నారు.
Also Read
- TMC Crisis: బెంగాల్ రాజకీయాల్లో సంచలనం.. ‘‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ’’లో టీఎంసీ ఎంపీలు విలీనం..
- Ship sink: ఒమన్ తీరంలో మునిగిన షిప్.. 14 మంది భారతీయులకు తప్పిన ప్రమాదం..
- Madhya Pradesh: ప్రాణాలు తీసిన వదంతి.. రైలు నుంచి దూకిన ప్రయాణికుల్ని ఢీకొట్టిన మరో రైలు..
- PM Modi: భారత్ రండి, మాతో కలిసి పని చేయండి.. మోడీ పిలుపు..
ఈరోజు దేశం, ప్రపంచం మొత్తం రామనామస్మరణతో మార్మోగుతుందని తెలిపారు. ప్రతి రామ భక్తుని హృదయం సంతోషంగా ఉందని చెప్పారు. శతాబ్దాల బాధ తొలగడంతో భక్తులంతా చాలా సంతోషంగా ఉన్నట్లు పేర్కొన్నారు. 500 సంత్సరాలుగా వెలుగుతున్న ఆ త్యాగానికి నేటితో పరిపూర్ణత వచ్చిందని చెప్పుకొచ్చారు.
దేశం పురోగతి సాధించాలంటే.. మన గుర్తింపు గురించి మనం గర్వపడాలన్నారు. మన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. మన మనస్సులో ముద్రించిన బానిస మనస్తత్వాన్ని వదిలించుకోవాలని కోరారు. మనకు స్వేచ్ఛ లభించింది కానీ న్యూనతా భావాల నుంచి కాదన్నారు.
అంతకముందు అయోధ్య శ్రీరామ్లల్లా ఆలయంలో జరిగిన ధ్వజారోహణం కార్యక్రమంలో ప్రధాని మోడీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రామాలయంపై 22 అడుగుల కాషాయ జెండాను మోడీ ఆవిష్కరించారు. రామ జన్మభూమి ట్రస్ట్ సభ్యుల సమక్షంలో జెండా ఆవిష్కరణ జరిగింది. సాధువులు, ప్రముఖులు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరయ్యారు.
‘‘ధ్వజ్ ఆరోహణ్’’ కార్యక్రమంలో భాగంగా జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ జెండా లంబకోణ త్రిభుజాకారంలో సూర్యుని చిహ్నాన్ని కలిగి ఉంది. శాశ్వత శక్తి, దైవిక తేజస్సు, ధర్మం, జ్ఞానోదయాన్ని సూచిస్తుంది. శ్రీరాముడితో సంబంధం ఉన్న అన్ని లక్షణాలు ఈ జెండాలో కనిపిస్తాయి. ‘ఓం’ చిహ్నంతో చెక్కబడిన జెండాను ఆలయ ‘శిఖర్’ పైన ఉంచారు.
తాజావార్తలు
-
Women’s T20 World Cup 2026 : పాకిస్తాన్ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
-
Donald Trump: ఓ వైపు డీల్, మరోవైపు ఇజ్రాయిల్ దాడులు.. ట్రంప్ తీవ్ర అసంతృప్తి..
-
CM Chandrababu : కృష్ణానది పడవ ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం.. మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటన
-
Nag Ashwin: ‘మాయాబజార్’ సెట్స్ చూసిన మహానుభావుడితో సినిమా.. ఎమోషనల్ అయిన స్టార్ ప్రొడ్యూసర్!
-
TMC Crisis: బెంగాల్ రాజకీయాల్లో సంచలనం.. ‘‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ’’లో టీఎంసీ ఎంపీలు విలీనం..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నాన్-స్టిక్ అవసరమే లేదు.. ఈ ట్రిక్తో స్టీల్ పాత్రలే సూపర్.!
-
Child Safety Tips : స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి.. పిల్లలకు ఈ 5 ‘అబద్ధాలు’ నేర్పించండి..!
-
Cleaning Hacks : పరుపు, దిండు నుంచి వాసన వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో ఫ్రెష్.!
-
Kitchen Tips : బియ్యాన్ని ఇలా కడగకపోతే అన్నం రుచి, ఆరోగ్యం రెండూ దెబ్బే.!
-
Rahamathullah Gurbaj: నా సెంచరీకి కారణం గౌతమ్ గంభీర్.. అఫ్గాన్ ఓపెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు!