Modi Sharad Pawar: ఒకే వేదికపై మోడీ, శరద్, అజిత్.. బుద్ధుందా అంటూ శివసేన ఫైర్
PM Modi Sharad Pawar Ajit Pawar Share Stage Days After INDIA alliance: ప్రతిపక్ష కూటమిలో సీనియర్ నాయకుల్లో ఒకరైన శరద్ పవార్ ఈరోజు మహారాష్ట్రంలో జరిగిన ఒక ఈవెంట్లో ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి వేదిక పంచుకున్నారు. పూణేలోని లోక్మాన్య తిలక్ స్మారక మందిర్ వారు మోడీకి లోకమాన్య తిలక్ జాతీయ అవార్డును బహూకరించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శరద్ పవార్ హాజరయ్యారు. ఇదే వేదికపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఎన్సీపీని చీల్చి బిజెపితో చేతులు కలిపిన శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్ కూడా ఉన్నారు. ఈ కార్యక్రమంలో పవార్ మాట్లాడుతూ.. దేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం తీసుకురావాలని లోకమాన్య తిలక్ కోరుకున్నారన్నారు. అయితే.. బ్రిటీష్ నుంచి స్వాతంత్రం పొందాలంటే, ప్రజల్ని ఏకం చేయాలని ఆయన గ్రహించారన్నారు. అప్పుడు ఆయన జర్నలిస్ట్గా మారి.. కేసరి, మరాఠా వారాపత్రికల్ని లాంచ్ చేశారన్నారు. బ్రిటీష్కి వ్యతిరేకంగా పోరాడారన్నారు. జర్నలిజంపై ఎలాంటి ఒత్తిళ్లు ఉండకూడదని తిలక్ చెబుతుండేవారని పవార్ గుర్తు చేశారు.
Yadadri: ఆన్లైన్లో యాదాద్రి ఆర్జిత పూజా టికెట్లు.. బుకింగ్ టైంలో ఇవి తప్పనిసరి
Also Read
- High Voltage Drama: ప్రియుడిపై ప్రేమ.. టవర్పై డ్రామా! సినిమాను మించిన సీన్ చూపించిన మైనర్ బాలిక..
- Judge Suicide: ఢిల్లీలో న్యాయమూర్తి ఆత్మహత్య.. బాత్రూంలో మృతదేహం..
- Central Govt: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. బీమా రంగంలోనే సంచలనం..
- Nashik TCS Case: టీసీఎస్ నాసిక్ నిందితురాలు నిదా ఖాన్కు షాక్..
మరోవైపు.. వచ్చే ఏడాది జాతీయ ఎన్నికల్లో అధికార బీజేపీని ఎదురించడమే లక్ష్యంగా 26 పార్టీలు కలిసి ‘INDIA’ కూటమిని ప్రకటించిన కొన్ని రోజుల తర్వాత ప్రధాని మోడీతో శరద్ పవార్ వేదికని పంచుకోవడంపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. ముఖ్యంగా.. శివసేన పార్టీ పవార్ ఈ ఈవెంట్కి వెళ్లకుండా ఉండాల్సిందని సూచించింది. శివసేనకు చెందిన ‘సామ్నా’ అనే సంపాదకీయం.. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) అవినీతికి పాల్పడిందని, అనంతరం పార్టీలో చీలికకు శ్రీకారం చుట్టి మహారాష్ట్ర రాజకీయాలపై బురద జల్లే ప్రయత్నం చేసిందని మోడీ ఆరోపించారని పేర్కొంది. అటు.. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడదని, అయినా ఒకే వేదికపై నవ్వుకుంటూ ఎలా కూర్చుంటారంటూ శివసేన(యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్ ప్రశ్నించారు. దీనికి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత బీజేపీదేనని నిలదీశారు. మీకసలు విజ్ఞత ఉందా? ఇద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే, ఒకే వేదికపై ఎలా కూర్చుంటారో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Tobacco Price: పాన్ మసాలా, పొగాకు ఎగుమతిదారులకు షాక్.. రీ ఫండ్కు నో ఛాన్స్
తాజావార్తలు
-
Mumbai Indians: ఓటమిలోనూ వరల్డ్ రికార్డ్.. టీ20 క్రికెట్ చరిత్రలో తొలి జట్టుగా ముంబై ఇండియన్స్
-
Ruturaj Gaikwad: ముంబైని ముంచిన చెన్నై వ్యూహం.. సీఎస్కే గెలుపు రహస్యం చెప్పిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్
-
Trisha Karuppu: వయసు రివర్స్ అవుతోంది.. త్రిష బ్యూటీపై ఫ్యాన్స్ ఫిదా! కానీ మేకర్స్తో గొడవ ఏంటి?
-
Onam Release : ఓనమ్ స్పెషల్.. ముగ్గురు మలయాళ బిగ్ స్టార్స్ మధ్య బిగ్ ఫైట్
-
Peddi: చరణ్ ‘పెద్ది’ పంజా.. మహేష్ బాబు నిర్మిస్తున్న ‘రావు బహదూర్’కు థియేటర్ల సెగ!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!