Karnataka: ముస్లిం ఐఏఎస్పై బీజేపీ నేత అనుచిత వ్యాఖ్యలు.. కర్ణాటకలో దుమారం
- ముస్లిం ఐఏఎస్పై బీజేపీ నేత అనుచిత వ్యాఖ్యలు
- కర్ణాటకలో దుమారం.. అధికారికి క్షమాపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కల్నల్ సోఫియా ఖురేషిపై మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలు మరువక ముందే.. మరో బీజేపీ నేత.. ఒక ముస్లిం మహిళా ఐఏఎస్ అధికారిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో కర్ణాటకలో తీవ్ర దుమారం రేపింది. ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది.
ఇది కూడా చదవండి: Allari Naresh : సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో అల్లరి నరేష్..
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
కలబురగి డిప్యూటీ కమిషనర్ ఫౌజియా తరణమ్ కార్యాలయం దగ్గర బీజేపీ నిరసన చేపట్టింది. ఈ సందర్భంగా అక్కడే ఉన్న బీజేపీ శాసనమండలి సభ్యుడు ఎన్.రవికుమార్.. ఆమెను ఉద్దేశించి మతతత్వ వ్యాఖ్యలు చేశారు. కలబురగి డిప్యూటీ కమిషనర్ పాకిస్థాన్ నుంచి వచ్చారా? లేదంటే ఇక్కడి ఐఏఎస్ అధికారియో తనకు తెలియదన్నారు. మీ చప్పట్లు చూస్తుంటే.. డిప్యూటీ కమిషనర్ నిజంగానే పాకిస్థాన్ నుంచి వచ్చినట్లు అనిపిస్తుందని వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: KTR : అమెరికా, లండన్ పర్యటనకు బయలుదేరిన కేటీఆర్
ఈ వ్యాఖ్యలు కర్ణాటకలో తీవ్ర దుమారం రేపాయి. మంత్రి ప్రియాంక్ ఖర్గే స్పందిస్తూ.. బీజేపీ నేత వ్యాఖ్యలు చాలా అసహ్యకరమైనవని తెలిపారు. ఈ విధంగా మాట్లాడే వ్యక్తులు నిజమైన భారతీయులేనా? అని సందేహం కలుగుతుందన్నారు.
ఇక కలబురగి నివాసి ఒకరు.. బీజేపీ నేతపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రభుత్వ ఉద్యోగిని బెదిరించడం, మతపరమైన భావాలను రెచ్చగొట్టే ఉద్దేశ్యంతో చేసిన దురుద్దేశపూరిత చర్యలు మరియు షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలకు చెందిన వ్యక్తులపై దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే ఐఏఎస్ అధికారిపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడంతో బీజేపీ నేత రవికుమార్ స్పందించారు. భావోద్వేగంతో అలా మాట్లాడానని.. తమ పార్టీ బాధ్యతాయుతమైన కేంద్ర పాలక పార్టీ అని, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని తెలిపారు. తన వ్యాఖ్యలకు ఐఏఎస్ అధికారిని క్షమాపణ కోరుతున్నట్లు చెప్పారు.
ఇటీవల భారత్… పాకిస్థాన్పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. దీనికి కల్నల్ సోఫియా ఖురేషి నాయకత్వం వహించారు. ఆపరేషన్ సిందూర్కు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు మీడియాకు తెలియజేశారు. అయితే మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా.. ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్లో ఉగ్రవాదులు.. మన సోదరీమణుల సిందూరాన్ని తుడి చేస్తే.. అదే ఉగ్రవాదుల మతానికి చెందిన సోఫియా ఖురేషిని ప్రధాని మోడీ పాకిస్థాన్పైకి పంపించారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. న్యాయస్థానాలు కూడా మంత్రి వ్యాఖ్యల్ని తప్పపట్టాయి. కోర్టు ఆదేశాలతో మంత్రిపై కేసు నమోదైంది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!