PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
- కాంగ్రెస్పై ధ్వజమెత్తిన ప్రధాని మోడీ..
- కాంగ్రెస్ పాలనపై తీవ్ర విమర్శలు..
- ‘‘హిందూ గ్రోత్ రేట్’’గా పిలువడంపై ఆగ్రహం..
- నిజానికి కాంగ్రెస్ గ్రోత్ రేట్ అంటూ కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడి 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో ఢిల్లీలో మిత్రపక్షాలు ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వాన్ని కొనియాడాయి. ఈ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనపై ధ్వజమెత్తారు. భారతదేశంలో మందకొడి వృద్ధిరేటను ‘‘హిందూ గ్రోత్ రేట్’’గా పిలిచారని, అది వాస్తవానికి ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’ అంటూ దుయ్యబట్టారు. విధానపరమైన, పాలనాపరమైన వైఫల్యాల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాలు దేశాన్ని నిస్సాహయ దుస్థితిలోకి నెట్టేశాయని ఆరోపించారు.
కాంగ్రెస్ పాలన వారసత్వం నుంచి దేశాన్ని ఎన్డీయే ప్రభుత్వం విముక్తి చేసిందని మోడీ చెప్పారు. 12 ఏళ్ల ఎన్డీయే పాలనలో కాంగ్రెస్ దుర్మార్గపు పాలన నుంచి దేశం విముక్తి పొందిందని, వేగవంతమైన అభివృద్ధి సాధ్యం కాదని ప్రజల్ని నమ్మించాలరని, చాలా తెలివిగా దానికి హిందూ గ్రోత్ రేట్ అని పిలిచారని మండిపడ్డారు. విధానపరమైన వైఫల్యాలకు బాధ్యత తీసుకోవడం మానేసి, దానిని దేశంలో మెజారిటీ వర్గంపై నిందలు వేసేలా హిందూ గ్రోత్ రేట్ అనే భావనను ప్రచారం చేశారని అన్నారు. పనితీరు, బాధ్యత, వైఫల్యాలు అన్నీ కాంగ్రెస్వే అని, కానీ అపవాదు మాత్రం దేశంలోని హిందూ జనాభాపై నెట్టారని అన్నారు.
Also Read
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
- Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
- TMC Crisis: నమ్మినవారే నట్టేట ముంచారు.. రెబల్ క్యాంప్లో మమత బెనర్జీ విధేయులు..
2014లో ఎన్డీయే ప్రభుత్వం అధికారం చేపట్టాక దేశ ప్రజల్లో కొత్త ఆశలు చిగురించాయని ప్రధాని అన్నారు. సరైన ఉద్దేశంతో పనిచేస్తే వేగవంతమైన అభివృద్ధి సాధ్యమని నిరూపించామని, దీనిని దేశ ప్రజలు చూశారని అన్నారు. ఎన్డీయే పనితీరుతో దేశంలోని 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశామని మోడీ తెలిపారు. ఇది తమ ప్రభుత్వ విధానాలు సరైన దిశలో ఉన్నాయనే దానిని నిదర్శనమని చెప్పారు. ఈ విజయం వ్యక్తిగతం కాదని, ఎన్డీయే కుటుంబం మొత్తం సాధించిన విజయమని ప్రధాని అన్నారు.
అసలు ‘‘హిందూ రేట్ ఆఫ్ గ్రోత్’’ అంటే ఏమిటి.?
‘‘హిందూ రేట్ ఆఫ్ గ్రోత్’’ అనే పదాన్ని ఆర్థిక శాస్త్రవేత్త రాజ్కృష్ణ 1978లో ఉపయోగించారు. స్వాతంత్య్రం తర్వాత 1950 నుంచి 1980ల వరకు భారత జీడీపీ వృద్ధిరేటు సుమారు 3.5%–4% మాత్రమే ఉండేది. అయితే, ఈ నెమ్మదైన వృద్ధిరేటనున సూచించడానికి ఈ పదాన్ని వాడారు. ‘‘తక్కువతో సంతృప్తి పడే హిందూ జీవనశైలి’’ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ ముందుకు పోలేదు అనే భావనను తీసుకువచ్చారు.
ఇప్పుడు ఈ పదమే వివాదానికి కారణమైంది. ఆర్థిక వృద్ధి నెమ్మదికి హిందువుల సంస్కృతి కారణం కాదని, నిజానికి దీనికి కారణం ప్రభుత్వం విధానాలు, భారీగా ప్రభుత్వ నియంత్రణ, నిర్బంధ నియామాలు కారణమని ఆర్థికవేత్తలు ఎత్తిచూపారు. ఆర్థిక వ్యవస్థ నెమ్మదిని ఒక మతానికికి ఆపాదించడం అన్యాయమని చెప్పారు. 1990లలో భారత ఆర్థిక వ్యవస్థను సరళీకరించిన తర్వాత వృద్ధి పుంజుకుంది. అప్పటి నుంచి ఈ ‘‘హిందూ రేట్ ఆఫ్ గ్రోత్’’ అనేది పాత పదంగా మారింది. అయితే, 2023లో మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ భారతదేశం ప్రమాదకరంగా ‘‘హిందూ రేట్ ఆఫ్ గ్రోత్’’కు దగ్గరగా ఉందని అన్నారు. ఈయన వ్యాఖ్యలు అనేక మంది ఆర్థిక వేత్తల నుంచి విమర్శలు ఎదుర్కొన్నాయి. ఎస్బీఐ చీఫ్ ఎకనామిస్ట్ సౌమ్య కాంతి ఘోష్ మాట్లాడుతూ.. దీనిని తప్పుడు అంచనాగా, పక్షపాతపూరిత వ్యాఖ్యగా విమర్శించారు.
తాజావార్తలు
-
PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
-
Gurnoor Brar: 17 ఏళ్ల వయసులో క్రికెట్ ప్రారంభం.. 9 ఏళ్ల కష్టానికి టీమిండియా పిలుపు..
-
Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!