Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Pm Modi Says 8 Crore Jobs Created In 3 4 Years Silenced Fake Narratives

PM Modi: ప్రతిపక్షాల ఫేక్ ప్రచారంపై ప్రధాని మోడీ ఫైర్..

Published Date :July 13, 2024 , 9:28 pm
By Venu Goapl Reddy
  • ప్రతిపక్షాల ఫేక్ ప్రచారంపై ప్రధాని ఫైర్..
  • అటల్ సేతు గురించి తప్పుడు ప్రచారం..
  • మహారాష్ట్రలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన..
PM Modi: ప్రతిపక్షాల ఫేక్ ప్రచారంపై ప్రధాని మోడీ ఫైర్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

PM Modi: ప్రతిపక్షాలు ‘‘నకిలీ కథనాలను’’ ప్రచారం చేస్తున్నాయని ప్రధాని నరేంద్రమోడీ ఫైర్ అయ్యారు. శనివారం ముంబైలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. ఇలా నకిలీ కథనాలను ప్రచారం చేసేవారు అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాదికి వ్యతిరేకమని అన్నారు. ఉద్యోగాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) నివేదికను ఉటంకిస్తూ ప్రధాని మోడీ మాట్లాడారు. దేశంలో సుమారు 8 కోట్ల కొత్త ఉద్యోగాలు సృష్టించామని, ఈ గణాంకాలు వారిని నిశ్శబ్ధం చేస్తాయని ప్రతిపక్షాలను ఉద్దేశించి అన్నారు. ఈ వ్యక్తులు పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు,దేశాభివృద్ధిని వ్యతిరేకిస్తున్నారని, వారి తప్పుడు ప్రచారాన్ని ప్రజలు చూస్తున్నారని చెప్పారు. ఎన్డీయే పేదలకు, రైతులకు, యువతకు మద్దతు ఇస్తోందని చెప్పారు.

Read Also: CM Revanth Reddy: గౌడన్నలకు ‘కాటమయ్య రక్ష’.. రేపు సేఫ్టీ కిట్ల పంపిణీ స్కీమ్‌ ప్రారంభించనున్న సీఎం

ముంబైలో రూ.29,400 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. అటల్ సేతు వంతెనపై పగుళ్లు ఏర్పడిందన్న కాంగ్రెస్ ఆరోపణపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముంబైలో జీవన నాణ్యతను ఉత్తమంగా చేయడమే తమ ఉద్దేశ్యమన్నారు. ముంబై చుట్టూ కనెక్టివిటీ పెరుగుతోందని, ముంబైలో కోస్ట్ రోడ్, అటల్ సేతు పూర్తయిందని చెప్పారు. అటల్ సేతు గురించి తప్పుడు ప్రచారం చేసేవారు కూడా ప్రయోజనం పొందుతున్నారని పరోక్షంగా కాంగ్రెస్‌ని విమర్శించారు.

“అటల్ సేతు ఇప్పుడు రోజుకు 20,000 వాహనాలకు సేవలను అందిస్తోంది, 25 లక్షల లీటర్ల ఇంధనం ఆదా అవుతుంది. మెట్రో అభివృద్ధి కూడా వేగంగా పురోగమిస్తోంది. పదేళ్ల క్రితం ముంబైలో కేవలం 8 కి.మీ మెట్రో లైన్లు మాత్రమే ఉన్నాయి. నేడు, మనకు 80 కి.మీలు ఉన్నాయి, ఇంకా 200 కి.మీ.ల పని కొనసాగుతోంది.’’ అని ప్రధాని మోడీ చెప్పారు. ముంబైతో పొరుగు ప్రాంతాలకు వీటి ద్వారా కనెక్టివిటీ పెరుగుతుందని చెప్పారు. ఈ ప్రాజెక్టులు ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయని అన్నారు. ముంబై ప్రపంచంలోనే ఫిన్ టెక్ రాజధానిగా మారాలని కాంక్షిస్తున్నట్లు చెప్పారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • INDIA Bloc
  • Maharashtra
  • PM Modi

తాజావార్తలు

  • Lok sabha: పార్లమెంట్ ఉభయ సభలు నిరవధిక వాయిదా

  • IPL 2026-SRH: ఎస్‌ఆర్‌హెచ్ నుంచి కీలక అప్‌డేట్‌.. సన్‌రైజర్స్‌లోకి సఫారీ పేసర్!

  • Prakash Raj Faces Defamation Suit: ప్రకాష్‌ రాజ్‌కు షాక్.. వంద కోట్ల పరువు నష్టం దావా..!

  • Janhvi Kapoor:మద్యపానం నా జీవితంలో ఒక విలన్‌లా తయారైంది..

  • AP Singh: అమెరికా యుద్ధ విమానంలో భారత్ ఎయిర్ చీఫ్ ఏపీ సింగ్ పర్యటన.. ఫొటోలు వైరల్

ట్రెండింగ్‌

  • Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!

  • Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?

  • Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!

  • Chia Seeds : మధుమేహానికి చెక్ పెట్టే చియా సీడ్స్.. షుగర్ లెవల్స్ తగ్గాలంటే ఇలా తిని చూడండి!

  • రాత్రి పడుకునే ముందు శరీరంలోని ఈ రెండు భాగాలకు ఆవనూనెతో ఎందుకు మర్దన చేయాలి?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions