PM Narendra Modi: ప్రధాని మోదీకి పుతిన్ ఫోన్.. యుద్ధంపై సంభాషణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi, Russian President Vladimir Putin speak on phone: భారత్, రష్యా మధ్య కీలక పరిణామం చోటు చేసుకుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. ఇరు నేతలు రెండు దేశాల దౌత్య సంబంధాలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై సంభాషించినట్లు పీఎంఓ తెలిపింది. ఉక్రెయిన్ తో యుద్ధంలో దౌత్యమే ఏకైక మార్గమని ప్రధాని మోదీ పుతిన్ కు పునరుద్ఘాటించారని వెల్లడించింది. పుతిన్, మోదీతో మాట్లాడినట్లు క్రెమ్లిన్ వర్గాలు కూడా ధృవీకరించాయి.
కొన్ని నెలల క్రితం ఉజ్బకిస్తాన్ సమర్ కండ్ లో జరిగిన షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్ సీ ఓ) సమావేశంలో ప్రధాని మోదీ, రష్యా ప్రెసిడెంట్ పుతిన్ చర్చించుకున్నారు. ఆ తరువాత ప్రస్తుతం ఇప్పుడే మళ్లీ ఇరుదేశాల నేతలు టెలిఫోన్ లో ముచ్చటించారు. గతంలో ఎస్ సీ ఓ సమ్మిట్ లో రష్యా, భారత దేశాల మధ్య ఇంధన సహకారం, వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ-భద్రతా సహకారం, ఇతర రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల గురించి ఇరు నేతలు ముచ్చటించారు. ఆ సమయంలో ‘ ఇది యుద్ధాలకు సమయం’ కాదని మోదీ, పుతిన్ కు సూచించారు.
Also Read
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
- Supreme Court: తల్లిదండ్రులు ఐఏఎస్లు అయితే మళ్లీ పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు? సుప్రీంకోర్టు సూటి ప్రశ్నలు
- RBI Dividend: ప్రభుత్వానికి ఆర్బీఐ రికార్డు స్థాయి నిధుల బదిలీ.. దాదాపు రూ.2.87 లక్షల కోట్ల వరకు..
- Marco Rubio: భారత్ టూర్కు మార్కో రూబియో.. వెనిజులా ట్విస్ట్తో పర్యటనపై సర్వత్రా ఆసక్తి
Read Also: Jamia Masjid: స్త్రీ-పురుషులు కలిసి కూర్చోవడం, ఫోటోగ్రఫీపై జామియా మసీద్ నిషేధం
ఇదిలా ఉంటే తాజాగా టెలిఫోన్ సంభాషనలో ప్రధాని మోదీ భారత్ జీ-20 అధ్యక్ష బాధ్యతల గురించి పుతిన్ కు వివరించారు. దీంతో పాటు ఈ ఏడాది షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ అధ్యక్ష బాధ్యతలను కూడా భారతదేశమే నిర్వహిస్తోంది. ఈ సమయంలో రెండు దేశాలు కలిసి పనిచేయాలని ప్రధాని మోదీ, పుతిన్ తో అన్నారని పీఎంఓ తెలిపింది.
ఇదిలా ఉంటే భారత దేశానికి రష్యా డిస్కౌంట్ పై ఆయిల్ సరఫరా చేస్తోంది. పాశ్చాత్య దేశాల బెదిరింపులను లెక్కచేయకుండా భారత్ కొనుగోలు చేస్తోంది. ఇదిలా ఉంటే భారత్ నుంచి కొన్ని విడిభాగాలను సరఫరా చేయాలని రష్యా కోరుతోంది. ఈ మేరకు భారత ప్రభుత్వానికి కావాల్సిన వస్తువుల గురించి తెలిపింది. భారత్ కూడా రష్యాకు కావాల్సిన వస్తువులను సరఫరా చేయాలనే ఉద్దేశ్యంతోనే ఉంది.
తాజావార్తలు
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
VishnuPriya : ఏడ్చి ఏడ్చి విసిగిపోయా, ఇక నోరు మూసుకునేది లేదు: విష్ణుప్రియ ఫైర్!
-
Supreme Court: తల్లిదండ్రులు ఐఏఎస్లు అయితే మళ్లీ పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు? సుప్రీంకోర్టు సూటి ప్రశ్నలు
-
RBI Dividend: ప్రభుత్వానికి ఆర్బీఐ రికార్డు స్థాయి నిధుల బదిలీ.. దాదాపు రూ.2.87 లక్షల కోట్ల వరకు..
ట్రెండింగ్
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!