PM Modi: ‘‘ఆపరేషన్ సిందూర్’’ ప్రతిధ్వని ప్రపంచానికి వినిపించింది.. మెల్బోర్న్లో మోడీ కామెంట్స్..
- ఆపరేషన్ సిందూర్ ప్రతిధ్వని ప్రపంచం మొత్తానికి వినిపించింది..
- భారత్ త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుంది.
- స్వదేశీ 6జీ టెక్నాలజీ అభివృద్ధిపై వేగంగా పని జరుగుతోంది.
- మెల్బోర్న్ సభలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ఆస్ట్రేలియాలో ప్రధాని నరేంద్రమోడీ పర్యటన కొనసాగుతోంది. గురువారం ఆయన మెల్బోర్న్లో ప్రవాస భారతీయుల్ని ఉద్దేశించి మాట్లాడారు. భారతదేశ స్వదేశీ రక్షణ సామర్థ్యాలు ప్రపంచ గుర్తింపును పొందాయని, దేశ సైనిక బలానికి ‘‘ఆపరేషన్ సిందూర్’’ నిదర్శనమని అన్నారు. ఉగ్రవాద శిబిరాల్లో పేలుళ్ల శబ్ధాలు ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనించాయని, ఆ సమయంలో భారత సంకల్పాన్ని ప్రపంచం మొత్తం చూసిందని ప్రధాని చెప్పారు.
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం ప్రతిస్పందించిన విషయాన్ని ప్రధాని మోడీ ప్రస్తావించారు. భారతదేశ రక్షణ వ్యవస్థల సామర్థ్యాన్ని, విశ్వసనీయతను ప్రపంచం చూస్తోంది అని మార్వెల్ స్టేడియంలో జరిగిన సభలో అన్నారు. ‘‘ఆపరేషన్ సింధూర్ సమయంలో, ఉగ్రవాదుల స్థావరాలపై జరిగిన పేలుళ్లను మీరు చూసే ఉంటారు. ఆ పేలుళ్ల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనించింది. ఉగ్రవాద శిబిరాలపై అలాంటి నిర్ణయాత్మక దాడి జరిగినప్పుడు, మీకు గర్వంగా అనిపించలేదా?’’ అని ప్రశ్నించినప్పుడు సభలోని భారతీయులు ఒక్కసారిగా చప్పట్లు, నినాదాలతో స్పందించారు.
Also Read
- Saayoni Ghosh: పార్లమెంట్ను అడ్డుకోవడం భావ్యం కాదు.. టీఎంసీ రెబల్ సాయోని ఘోష్ ఆగ్రహం
- El Nino Alert: ఐఎండీ అలర్ట్.. ఆగస్టులో తక్కువ వర్షాలుంటాయని హెచ్చరిక
- Delhi: ఐబీ ఉద్యోగి అంకిత్ శర్మ హత్య కేసులో సంచలన తీర్పు.. మాజీ ఆప్ నేత తాహిర్ హుస్సేన్కు జీవిత ఖైదు
- PM-KISAN Scheme: రైతులకు కేంద్రం గుడ్న్యూస్.. మరో ఐదేళ్లు పీఎం-కిసాన్
భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారే దిశగా స్థిరంగా పయనిస్తోందని మోడీ చెప్పారు. ఒక కల నెరవేరినప్పుడు మరొకటి పుడుతుంది, ఒక లక్ష్యాన్ని సాధించడం మరింత గొప్ప సంకల్పానికి దారి తీస్తుంది. ఇది ‘‘గ్రో మోర్’’, ‘‘అచీవ్ మోర్’’ అని నమ్మే భారతదేశం అని అన్నారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందే ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉందన్ని, వీలైనంత త్వరగా ప్రపంచంలో మొదటి మూడు ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలుస్తుందని ప్రధాని అన్నారు. భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద 5జీ మార్కెట్గా ఉందని, భారత్ ‘‘మేడ్ ఇన్ ఇండియా’’ 6జీ సాంకేతికపై వేగంగా పనిచేస్తోందని చెప్పారు.
తాజావార్తలు
-
Telangana SIR : తెలంగాణ ఓటర్లకు గుడ్న్యూస్.. SIR గడువు మరోసారి పొడిగింపు.!
-
Chanakya Niti: ఎంత కోపం వచ్చినా ఇలా కంట్రోల్ చేసుకోండి.. చాణక్యుడి 5 విజయ మంత్రాలు ఇవే!
-
Saayoni Ghosh: పార్లమెంట్ను అడ్డుకోవడం భావ్యం కాదు.. టీఎంసీ రెబల్ సాయోని ఘోష్ ఆగ్రహం
-
Sardar 2: కార్తి డ్యూయల్ రోల్ అరాచకం .. ఎస్.జె. సూర్య స్టైలిష్ విలనిజం..టీజర్ తో షేక్!
-
The Paradise Teaser: ఆగస్టు 6న ‘ది ప్యారడైజ్’ టీజర్.. నాని మ్యాడ్నెస్కు రెడీ అవ్వండి!
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!