PM Modi: రష్యా, ఇరాన్ విదేశాంగ మంత్రులతో మోడీ భేటీ.. ఇంధన సంక్షోభంపై చర్చ
- ఢిల్లీలో బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం
- రష్యా, ఇరాన్ విదేశాంగ మంత్రులతో మోడీ ప్రత్యేక భేటీ
- ఇంధన సంక్షోభంపై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని మోడీ గురువారం కీలక దౌత్య సమావేశాలు నిర్వహించారు. ఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో ప్రధాని మోడీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అంతర్జాతీయంగా నెలకొన్న తాజా పరిణామాలపై చర్చించారు.

Also Read
- Modi-Putin: మోడీ, రాష్ట్రపతికి పుతిన్ సందేశం.. యూపీ తుఫాన్ మృతులకు సంతాపం
- Pakistan: ఢిల్లీని టార్గెట్ చేసే మిస్సైల్ను పరీక్షించిన పాకిస్తాన్..
- Delhi: 2 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్.. విదేశీ టూర్లు రద్దు.. పొదుపు మంత్రం ప్రకటించిన ఢిల్లీ సర్కార్
- Kerala: ‘‘కాంగ్రెస్ ముస్లిం లీగ్’’.. సీఎం ఎంపికపై బీజేపీ ఫైర్..
దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇరాన్ యుద్ధం, పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలపై ఈ భేటీల్లో చర్చ జరిగినట్లు సమాచారం. అలాగే బ్రిక్స్ సమావేశానికి హాజరైన విదేశాంగ మంత్రులు, ప్రతినిధులతో కలిసి మోడీ అధికారిక ‘‘బ్రిక్స్ ఫ్యామిలీ ఫొటో’’లో కూడా పాల్గొన్నారు. సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇదిలా ఉంటే ఎస్.జైశంకర్ బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం కోసం భారత్ మండపంలోకి వచ్చిన రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్కు స్వాగతం పలికారు. సభ్య దేశాలు, పరిశీలక దేశాల విదేశాంగ మంత్రులు, ప్రతినిధులను కూడా ఆయన ఆహ్వానించారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా పర్యటనలో భాగంగా బీజింగ్లో ఉండటంతో.. ఆయన స్థానంలో భారతదేశంలోని చైనా రాయబారి జు ఫీహోంగ్ సమావేశానికి హాజరయ్యారు. అలాగే ఇండోనేషియా విదేశాంగ మంత్రి సుగియోనో, దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి రోనాల్డ్ లామోలా, ఇథియోపియా ప్రతినిధి గిడియాన్ తిమోతీ హెస్సన్లకు జైశంకర్ స్వాగతం పలికారు. యూఏఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ఖలీఫా షహీన్ అల్ మరార్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.
ప్రపంచ, ప్రాంతీయ అంశాలు, ఆర్థిక సహకారం, బహుపాక్షిక సంస్కరణలు, వాణిజ్యం, అభివృద్ధి సవాళ్లపై చర్చించేందుకు బ్రిక్స్ వేదికగా నిలుస్తోంది. 2026 బ్రిక్స్ చైర్మన్షిప్ను భారత్ నిర్వహిస్తున్న నేపథ్యంలో మే 14 నుంచి 15 వరకు జరగనున్న ఈ సమావేశం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. బ్రెజిల్ నుంచి ఈ ఏడాది జనవరి 1న భారత్ బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించింది. గతంలో 2012, 2016, 2021 సంవత్సరాల్లో కూడా భారత్ బ్రిక్స్ సదస్సులకు ఆతిథ్యం ఇచ్చింది.
తాజావార్తలు
-
Modi-Putin: మోడీ, రాష్ట్రపతికి పుతిన్ సందేశం.. యూపీ తుఫాన్ మృతులకు సంతాపం
-
PM Modi: రష్యా, ఇరాన్ విదేశాంగ మంత్రులతో మోడీ భేటీ.. ఇంధన సంక్షోభంపై చర్చ
-
YS Jagan : వైసీపీలోకి మోపిదేవి శ్రీనివాసరావు.. రేపల్లె బాధ్యత మనదే.. కార్యకర్తలే నా బలం
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అద్భుత అవకాశం.. సీనియర్ జట్టులోకి ఒక్క అడుగు దూరంలో..
-
Pakistan: ఢిల్లీని టార్గెట్ చేసే మిస్సైల్ను పరీక్షించిన పాకిస్తాన్..
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?