PM Narandra Modi: టార్గెట్ 2024.. బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతో ప్రధాని కీలక భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Narandra Modi: బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ సమావేశమై, కీలక పథకాలను మరింత మెరుగ్గా అమలు చేయాలని సూచించారు. ఆదివారం ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్యమంత్రుల మండలి సమావేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాలకు చెందిన మొత్తం 12 మంది ముఖ్యమంత్రులు, ఎనిమిది మంది ఉప ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ సంభాషించారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా కూడా పాల్గొన్నారు. గతంలో ఇలాంటి చివరి సమావేశం 2021 డిసెంబర్లో వారణాసిలో జరిగింది. ఈ సమావేశంలో, ప్రధాని మోదీ గతిశక్తి, హర్ ఘర్ జల్, స్వామిత్వ, డీబీటీ అమలు, ప్రభుత్వ ఇ-మార్కెట్ప్లేస్ వంటి కొన్ని కీలక పథకాలు, కార్యక్రమాలను ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మరింత మెరుగ్గా అమలు చేయాలని ఉద్ఘాటించారు.
గ్రామీణ ప్రాంతాల గురించి మాట్లాడుతూ.. గోబర్ధన్ వెబ్ పోర్టల్ ప్రాముఖ్యత, అవసరం గురించి ప్రధాని మోదీ మాట్లాడారు. పంట ఉత్పాదకతపై నానో-ఎరువుల యొక్క సానుకూల ప్రభావం గురించి ఆయన వివరించారు. వాటి వినియోగాన్ని పెంచడం గురించి మాట్లాడారు. అన్ని కీలక పథకాల సంతృప్త స్థాయి కవరేజీని నిర్ధారించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఈ దిశగా ముందడుగు వేయాలని అన్నారు. సులభతరమైన వ్యాపారాన్ని పెంపొందించాల్సిన అవసరం గురించి ప్రధాని వివరించారు. ఇందుకోసం ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను ఆయన వివరించారు. దేశంలో వ్యాపార వాతావరణాన్ని మరింత పెంచే దిశగా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని ఆయన ప్రోత్సహించారు.
Also Read
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Mamata Banerjee: మమతా దీదీకి మరో షాక్.. ముస్లిం ఎమ్మెల్యేల తిరుగుబాటు..
- Mohan Bhagwat: ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- DMK: లోక్సభలో కాంగ్రెస్తో కలిసి కూర్చోం.. డీఎంకే నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్..!
President Ramnath Kovind: రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ చివరి ప్రసంగం.. ఆయన సందేశమిదే..
తమ రాష్ట్రాలు క్రీడలకు సముచితమైన ప్రాధాన్యతనిచ్చేలా చూడాలని.. యువత పెద్ద సంఖ్యలో పాల్గొనడానికి, నిమగ్నమయ్యేలా ప్రోత్సహించడానికి అత్యుత్తమ సౌకర్యాలు కల్పించాలని ప్రధానమంత్రులను ప్రధాని మోదీ కోరారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు తమ క్రీడా సంస్కృతిని పెంపొందించుకోవడాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలని ఆయన ఉద్ఘాటించారు. అన్ని పట్టణాలు, గ్రామాలు, నగరాలు తమ వ్యవస్థాపక దినోత్సవాలను జరుపుకోవడం యొక్క ప్రాముఖ్యత గురించి కూడా ఆయన మాట్లాడారు.ఈ సమావేశంలో ఈ రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. ప్రతి పథకం కూడా మారుమూల గ్రామాల వరకు, అర్హులైన లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అమృత్ సరోవర్ మిషన్ పురోగతి, హర్ ఘర్ తిరంగా ప్రచారానికి సంబంధించిన సన్నాహాలను కూడా సమీక్షించారు. సుపరిపాలన ద్వారా ఆజాదీ కా అమృత్కాల్ను అంత్యోదయ యుగంగా మార్చేందుకు సీఎంలందరూ కట్టుబడి ఉండాలన్నారు.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!