PM Modi: నేపాల్ ప్రధాని సుశీల కార్కికి మోడీ అభినందనలు, ఆ దేశ ప్రజలకు సందేశం..
- నేపాల్ ప్రధాని సుశీల కార్కికి ప్రధాని మోడీ అభినందనలు..
- నేపాల్ ప్రజలకు మోడీ సందేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాన మంత్రి నరేంద్రమోడీ తన మణిపూర్ పర్యటన నుంచి నేపాల్ తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సుశీల కార్కీకి అభినందనలు తెలియజేశారు. ఇంఫాల్లోని చారిత్రాత్మక కాంగ్లా కోట నుంచి మాట్లాడుతూ.. ‘‘హిమాలయ ఒడిలో ఉన్న నేపాల్ మా సన్నిహిత మిత్రుడు. మేము చరిత్ర, విశ్వాసం ఆధారంగా కలిసి ఉన్నాము. మేము కలిసి పురోగమిస్తున్నాము. 1.4 బిలియన్ల భారతీయుల తరుఫున నేపాల్ మొదటి మహిళ ప్రధాని అయిన సుశీల కార్కిని నేను అభినందిస్తున్నాను. ఆమె నేపాల్లో శాంతి, స్థిరత్వం, శ్రేయస్సుకు మార్గం సుగమం చేస్తారనే నమ్మకం నాకు ఉంది’’ అని అన్నారు.
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
నేపాల్ దేశ తొలి మహిళ ప్రధాని అయిన కార్కిని ‘‘మహిళా సాధికారత’’కు ఉదాహరణగా అభివర్ణించారు. నేపాల్లో ఇటువంటి అల్లకల్లోల పరిస్థితుల్లో ‘‘ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టిన ప్రతి వ్యక్తిని తాను అభినందిస్తున్నాను’’ అని ఆయన అన్నారు. ‘‘నేపాల్లో ఇటీవల జరిగిన సంఘటనల్లో గుర్తించబడని విషయం ఏంటంటే, గత కొన్ని రోజులుగా నేపాల్ యువత వీధులను శుభ్రం చేస్తున్నట్లు కనిపించారు. దీనిని సోషల్ మీడియాలో నేను చూశానున. ఇది నేపాల్ పునరుజ్జీవనానికి సంకేతం. నేపాల్ ఉజ్వల భవిష్యత్తుకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా’’ అని ఆ దేశ ప్రజలకు సందేశం ఇచ్చారు.
దీనికి ముందు, ప్రధాని మోడీ ఎక్స్ ద్వారా సుశీల కార్కికి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ నేపాల్ తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన గౌరవనీయులైన శ్రీమతి సుశీల కార్కికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. నేపాల్ ప్రజలు శాంతి, పురోగతి, శ్రేయస్సుకు భారతదేశం దృఢంగా కట్టుబడి ఉంది’’ అని అన్నారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!