PM Modi: ప్రధాన మంత్రి నరేంద్రమోడీ తన మణిపూర్ పర్యటన నుంచి నేపాల్ తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సుశీల కార్కీకి అభినందనలు తెలియజేశారు. ఇంఫాల్లోని చారిత్రాత్మక కాంగ్లా కోట నుంచి మాట్లాడుతూ.. ‘‘హిమాలయ ఒడిలో ఉన్న నేపాల్ మా సన్నిహిత మిత్రుడు. మేము చరిత్ర, విశ్వాసం ఆధారంగా కలిసి ఉన్నాము. మేము కలిసి పురోగమిస్తున్నాము. 1.4 బిలియన్ల భారతీయుల తరుఫున నేపాల్ మొదటి మహిళ ప్రధాని అయిన సుశీల కార్కిని నేను అభినందిస్తున్నాను. ఆమె నేపాల్లో…
Sushila Karki: నేపాల్లో కొత్త శకం మొదలైంది. హిమాలయ దేశానికి తొలి మహిళా ప్రధానిగా మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కర్కీ ప్రమాణస్వీకారం చేశారు. అవినీతికి వ్యతిరేకంగా జెన్-జెడ్ నిరసనకారులు చేసిన ఆందోళనలతో కేపీ శర్మ ఓలీ ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. జెన్-జెడ్ ప్రతినిధులు, ఆర్మీ, అధ్యక్షుడితో జరిపిన చర్చల్లో సుశీల కర్కీని ప్రధానిగా ఎన్నుకున్నారు. ఆమె చేత అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ ప్రమాణస్వీకారం చేయించారు.
Nepal: అవినీతికి వ్యతిరేకంగా నేపాల్ యువత నిర్వహించిన నిరసనలు హింసాత్మకంగా మారిన సంగతి తెలిసింది. నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియాపై బ్యాన్ విధించడంతో ఒక్కసారిగా యువత రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపింది. సోమవారం భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 19 మంది మరణించడంతో, ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి.
Nepal Palace Massacre: నేపాల్లో సోషల్ మీడియా బ్యాన్కు వ్యతిరేకంగా యువత పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఈ నిరసనలకు తలొగ్గి ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామా చేశారు. ఆయన మంత్రివర్గంలోని పలువురు మంత్రులు కూడా రాజీనామాలు చేశారు. ఇప్పుడు నేపాల్లో మరోసారి రాచరికం మళ్లీ వస్తుందా అనే వాదన మొదలైంది.