PM Modi: వారణాసిలో 4 వందే భారత్ రైళ్లను ప్రారంభించిన మోడీ
- దేశంలో పట్టాలెక్కిన మరో 4 కొత్త వందే భారత్ రైళ్లు
- వారణాసిలో వందే భారత్ రైళ్లను ప్రారంభించిన మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో మరో 4 కొత్త వందే భారత్ రైళ్లు పట్టాలెక్కాయి. వారణాసిలో ప్రధాని మోడీ జెండా ఊపి రైళ్లను ప్రారంభించారు. ఈ రైళ్లు వారణాసి-ఖజురహో, లక్నో-సహరాన్పూర్, ఫిరోజ్పూర్-ఢిల్లీ, ఎర్నాకులం-బెంగళూరు మార్గాల్లో పరుగులు తీయనున్నాయి. ఈ వందే భారత్ రైళ్లు ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన కనెక్టివిటీని అందించనున్నాయి. ప్రయాణ సమయాన్ని తగ్గించడంతో పాటు పర్యాటకాన్ని పెంపొందించడంలో కూడా సహాయపడనున్నాయి.
వారణాసి-ఖజురహో..
వారణాసి, ప్రయాగ్రాజ్, చిత్రకూట్, ఖజురహో వంటి మతపరమైన, సాంస్కృతిక నగరాలను కలుపుకుని వెళ్లుంది. ఇది ప్రస్తుత రైళ్లతో పోలిస్తే సుమారు 2 గంటల 40 నిమిషాలు ఆదా చేస్తుంది. ఈ రైళ్లు యాత్రికులు, పర్యాటకులకు ఖజురహో వంటి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించనుంది.
Also Read
- Konda Surekha: సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మహిళా మంత్రులు.. ‘నన్ను సపరేట్ చేయకండి’ అంటూ కొండా కీలక సురేఖ వ్యాఖ్యలు..!
- Bhatti Vikramarka: ‘హట్టి గోల్డ్ మైన్స్’ సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.!
- Lunar Eclipse 2026: ప్రారంభమైన చంద్రగ్రహణం (వీడియో).. సూతక కాలంపై పూర్తి వివరాలు?
- Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
లక్నో-సహరాన్పూర్..
ఈ ప్రయాణాన్ని దాదాపు 7 గంటల 45 నిమిషాల్లో పూర్తి చేయడానికి సహాయపడుతుంది. దాదాపు 1 గంట సమయం ఆదా అవుతుంది. ఈ రైలు లక్నో, సీతాపూర్, షాజహాన్పూర్, బరేలీ, మొరాదాబాద్, బిజ్నోర్, సహారాన్పూర్లను కలుపుతుంది. రూర్కీ ద్వారా హరిద్వార్కు కూడా సులభంగా చేరుకోవచ్చు.
ఫిరోజ్పూర్-ఢిల్లీ..
ఈ మార్గంలో అత్యంత వేగవంతమైన రైలు. ఇది కేవలం 6 గంటల 40 నిమిషాల్లో ప్రయాణిస్తుంది. ఈ రైలు పంజాబ్లోని ఫిరోజ్పూర్, బటిండా, పాటియాలా వంటి కీలకమైన నగరాలను ఢిల్లీతో కలుపుతుంది. వాణిజ్యం, పర్యాటకం, ఉపాధికి కొత్త అవకాశాలను సృష్టిస్తుంది. సరిహద్దు ప్రాంతాల అభివృద్ధికి దోహదపడుతుంది.
ఎర్నాకులం – బెంగళూరు..
దక్షిణ భారతదేశంలో ప్రయాణ సమయాన్ని 2 గంటలకు పైగా తగ్గించి కేవలం 8 గంటల 40 నిమిషాలకు తగ్గిస్తుంది. ఎర్నాకులం – బెంగళూరు వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రధాన ఐటీ, వాణిజ్య కేంద్రాలను అనుసంధానించడంలో కూడా సహాయపడుతుంది. ఈ మార్గం కేరళ, తమిళనాడు, కర్ణాటక మధ్య ఆర్థిక కార్యకలాపాలు, పర్యాటకాన్ని పెంచడానికి సహాయపడుతుంది.
#WATCH | Varanasi, UP | PM Narendra Modi flags off four new Vande Bharat Express trains from Banaras Railway Station
The new Vande Bharat Express trains will operate on the Banaras–Khajuraho, Lucknow–Saharanpur, Firozpur–Delhi, and Ernakulam–Bengaluru routes
(Source: DD) pic.twitter.com/2GfI45aVGt
— ANI (@ANI) November 8, 2025
తాజావార్తలు
-
Renault Kwid Facelift 2027: రెనాల్ట్ క్విడ్ ఫేస్లిఫ్ట్ 2027 విడుదల.. 4 ఎయిర్బ్యాగ్స్, 10.1″ టచ్స్క్రీన్.. ధర ఎంతంటే?
-
Nepal Floods: నేపాల్ వరదల్లో ఏపీ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అదృశ్యం.. భర్త ఆచూకీ కోసం భార్య ఆవేదన!
-
Raaka : ‘రాకా’లో త్రిపాత్రాభినయం చేస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ?
-
Konda Surekha: సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మహిళా మంత్రులు.. ‘నన్ను సపరేట్ చేయకండి’ అంటూ కొండా కీలక సురేఖ వ్యాఖ్యలు..!
-
Acer Swift Neo AI Laptop: Acer Swift Neo AI ల్యాప్టాప్ రిలీజ్.. 32GB RAM, 1TB SSDతో అదిరిపోయే ఫీచర్లు.. తక్కువ ధరకే
ట్రెండింగ్
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!