PM Modi: నేపాల్ ప్రధాని సుశీల కర్కితో మాట్లాడిన మోడీ.. ఏం చర్చించారంటే..!
- నేపాల్ ప్రధాని సుశీల కర్కితో మాట్లాడిన మోడీ
- వివరాలు ఎక్స్లో పోస్ట్ చేసిన ప్రధాని మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేపాల్ ప్రధాని సుశీలా కర్కితో ప్రధాని మోడీ తొలిసారి సంభాషించారు. ఇటీవల నేపాల్లో సంభవించిన సంక్షోభం కారణంగా కేపీ శర్మ ఓలి ప్రభుత్వం కూలిపోయింది. అనంతరం నేపాల్ సుప్రీంకోర్టు మాజీ చీఫ్ సుశీలా కర్కిని తాత్కాలిక ప్రధానిగా ఎన్నకున్నారు.
గురువారం సుశీలా కర్కితో ప్రధాని మోడీ ఫోన్లో సంభాషించారు. ఇటీవల జరిగిన విషాదకరమైన ప్రాణనష్టంపై మోడీ సంతాపం వ్యక్తం చేశారు. శాంతి, స్థిరత్వాన్ని పునరుద్ధరించే ప్రయత్నాలకు భారతదేశం మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ మేరకు ప్రధాని మోడీ ఎక్స్లో పేర్కొన్నారు. నేపాల్ ప్రధాని సుశీలతో ఆహ్లాదకరమైన సంభాషణ జరిగినట్లుగా తెలిపారు. అలాగే శుక్రవారం నేపాల్ జాతీయ దినోత్సవం సందర్భంగా సుశీలకు, నేపాల్ ప్రజలకు మోడీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపినట్లు మోడీ రాసుకొచ్చారు.
Also Read
- Tamil Nadu: మరో వివాదంలో విజయ్ సర్కార్.. బస్సుల రంగులపై రాజకీయ రచ్చ
- IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
- UP: యూపీ ఎన్నికల వేళ కాల్పులు.. ప్రయాగ్రాజ్లో ఎస్పీ నేత హత్య
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
ఇది కూడా చదవండి: Rajasthan: ప్రియుడి కోసం ఓ ఇల్లాలు దుశ్చర్య.. అడ్డుగా ఉందని 3 ఏళ్ల చిన్నారిని చంపేసిన తల్లి
ఇక నేపాల్ తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సుశీల మాట్లాడుతూ.. 6 నెలలు కంటే ఎక్కువ కాలం అధికారం అంటిపెట్టుకుని ఉండటానికి రాలేదని చెప్పారు. 6 నెలల్లో కొత్త పార్లమెంట్కు బాధ్యతలు అప్పగిస్తామని బాధ్యతలు స్వీకరించిన సమయంలో సుశీల చెప్పుకొచ్చారు. నేపాల్లో 2026, మార్చి 5న కొత్త ఎన్నికలు జరగనున్నాయి.
ఇది కూడా చదవండి: Tamil Nadu: దక్షిణాదికొస్తే కంగనా రనౌత్ను చెప్పుతో కొట్టిండి.. దుమారం రేపుతోన్న కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు
కేపీ శర్మ ఓలి ప్రభుత్వ.. నేపాల్లో సోషల్ మీడియాపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది యువతలో ఆగ్రహాన్ని రగిలించింది. జెన్-జెడ్ పేరుతో పెద్ద ఎత్తున ఉద్యమం చెలరేగింది. ఖాట్మండులో భారీగా నిరసనకారులు వచ్చి ఆందోళన చేపట్టారు. దీంతో ప్రభుత్వ కార్యాలయాలు, మంత్రుల ఇళ్లపై ఆందోళనకారులు దాడి చేశారు. ఈ ఘర్షణల్లో 19 మంది నిరసనకారులు చనిపోయారు. ఒక మాజీ ప్రధాని భార్య సజీవదహనం అయింది. అనంతరం కేపీ శర్మ ఓలి ప్రభుత్వం కూలిపోయింది. అటు తర్వాత సుశీలా కర్కి తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం నేపాల్లో పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాయి.
Had a warm conversation with Mrs. Sushila Karki, Prime Minister of the Interim Government of Nepal. Conveyed heartfelt condolences on the recent tragic loss of lives and reaffirmed India’s steadfast support for her efforts to restore peace and stability. Also, I extended warm…
— Narendra Modi (@narendramodi) September 18, 2025
తాజావార్తలు
-
Assembly Protest: దివ్యాంగుల అసెంబ్లీ ముట్టడి.. పోలీసుల అడ్డగింత.!
-
Bollywood: ‘హనుమాన్ అంశ్’ తర్వాత బాలీవుడ్లో భక్తి సినిమాల జోరు.. వరుసగా కొత్త ప్రాజెక్టులు!
-
Bhatti Vikramarka: ఇంధన సామర్థ్యమే మరో విద్యుత్ కేంద్రం.. డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు.!
-
Asia Cup Trophies: బీసీసీఐ కీలక అప్డేట్.. త్వరలో భారత్కు ఆసియా కప్ ట్రోఫీలు!
-
Daayra: కరీనా కపూర్ ‘దాయరా’ దిశా కేసు ఆధారంగా తెరకెక్కిందా?
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!