PM Modi: ఎన్డీఏ ఎంపీలకు మోడీ విందు.. మెనూ ప్రత్యేకతలు ఇవే!
- ఎన్డీఏ ఎంపీలకు మోడీ విందు
- చాలా ఆనందంగా ఉందంటూ ట్వీట్
- మెనూ ప్రత్యేకతలు ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ ఎన్డీఏ ఎంపీలకు ప్రత్యేక విందు ఇచ్చారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత గురువారం సాయంత్రం కళ్యాణ్ మార్గ్లో తన నివాసంలో ఈ విందు ఇచ్చారు. ఎన్డీఏ ఎంపీలకు విందు ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని ఎక్స్లో మోడీ పేర్కొన్నారు. ఈ సమావేశం జాతీయ అభివృద్ధి, ప్రాంతీయ ఆకాంక్షలకు ఉమ్మడి నిబద్ధతను సూచిస్తుందని తెలిపారు. రాబోయే సంవత్సరాల్లో దేశాభివృద్ధి కోసం కలిసి పని చేస్తూనే ఉంటామని చెప్పారు.
మెనూ స్పెషల్ ఇదే..
ఎంపీలకు ఇచ్చిన విందులో పూర్తి శాఖాహార మెనూకే ప్రాధాన్యత ఇచ్చారు. గోంగూర పన్నీర్, పాలకూర పప్పు హైలైట్గా నిలిచాయి. ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్కు వడ్డించిన శాఖాహార భోజనమే ఎంపీలకు వండించినట్లు సమాచారం. మెనూలో ప్రాంతీయ భారతీయ వంటకాలను ఎంపిక చేశారు.
Also Read
- Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
- Jharkhand Protest: JPSC పరీక్ష రద్దుకు జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధం.. CBI దర్యాప్తుపై విద్యార్థుల పట్టు
- Congress: ‘‘బీజేపీని మెప్పించే వ్యాఖ్యలు వద్దు’’.. శశి థరూర్పై కాంగ్రెస్ ఫైర్..
- CJP: AAP డూప్లికేట్గా CJP.? కాక్రోచ్ పార్టీ కీలక పదవుల్లో మాజీ ఆప్ నేతలు..
అల్లంతో నారింజ రసం
దానిమ్మ రసం
సబ్జ్ బాదం షోర్బా: కూరగాయలు, బాదం, సుగంధ ద్రవ్యాలు
కాకుమ్ మటర్ అఖ్రోత్ కి షమ్మీ: పచ్చి బఠానీలు, పిండిచేసిన వాల్నట్లతో ఫాక్స్టెయిల్ మిల్లెట్. గ్రిడిల్పై వండుతారు.
కోతింబిర్ వాడి: కొత్తిమీర ఆకులు, శనగపిండితో తయారుచేసిన రుచికరమైన చిరుతిండి.
గోంగూర పనీర్: సోరెల్ ఆకులతో మసాలా దినుసుల కాటేజ్ చీజ్ కర్రీ.
ఖుబానీ మలై కోఫ్తా: క్రీమీ జీడిపప్పు కూరలో నేరేడు పండుతో నింపిన కుడుములు.
గజర్ మేథి మాటర్: మెంతి ఆకులతో టెంపర్డ్ ఎర్ర క్యారెట్లు, తాజా బఠానీలు.
భిండి సంభారియా: నువ్వులు, వేరుశెనగ, బెల్లం కలిపిన బెండకాయ
పాలకూర పప్పు: పాలకూరతో ఆంధ్రా తరహాలో టెంపర్ చేసిన పప్పు
కాలే మోతి చిల్గోజా పులావ్: మినప్పప్పు, కాల్చిన పైన్ గింజలతో బాస్మతి బియ్యం
వివిధ రకాల భారతీయ రొట్టెలు: రోటీ/ మిస్సీ రోటీ/ నాన్/ తవా లచ్చా పరాఠా
కాల్చిన పిస్తా లాంగ్చా: ఖోయాతో చేసిన పిస్తా-స్టఫ్డ్ స్వీట్
అడ ప్రదామన్: తాటి బెల్లం, కొబ్బరి పాలు, ఎండిన గింజలతో వండిన బియ్యం ముక్కలు.
మంగళవారం ఎన్డీఏ ఎంపీలతో మోడీ సమావేశం అయినప్పుడు… బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ప్రధాని మోడీని అభినందించారు. గొప్ప విజయంతో బాధ్యత పెరిగినట్లు చెప్పారు. ప్రజల సంక్షేమం కొరకు కష్టపడి పని చేయాలని ఎంపీలను మోడీ కోరారు.
Was a delight to have hosted NDA MPs for dinner at 7, Lok Kalyan Marg this evening. The NDA family represents a shared commitment to good governance, national development and regional aspirations. Together, we will continue working to strengthen our nation’s development journey…
— Narendra Modi (@narendramodi) December 11, 2025
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్చాట్లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!