సెప్టెంబర్ 8న ప్రధాని మోడి ఎన్డీయే ఎంపీలకు విందు ఇవ్వనున్నారు. ఆతిథ్యమే కాదు ఎన్డీయేలోని అన్ని పార్టీలకు ఐక్యత సంకేతం ప్రధాని ఇచ్చే విందు ద్వారా ఇవ్వనున్నారు. విందు సమయంలో రాజకీయ చర్చలు, వ్యూహాత్మక నిర్ణయాలు, భవిష్యత్తు ప్రణాళికలపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఉపరాష్ట్రపతి ఎన్నికతో పాటు రాబోయే రాష్ట్రాల ఎన్నికలపై చర్చిస్తారు.
ఆపరేషన్ సిందూర్పై ప్రతిపక్షాలు వ్యవహరించిన తీరు ఎంతగానో బాధించిందని ప్రధాని మోడీ అన్నారు. మంగళవారం ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం అయింది. ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడంతో ప్రధాని మోడీని ఘనంగా సత్కరించారు.