PM Modi: బెంగాల్ ఫలితం దేశ ఉజ్వల భవిష్యత్కు నాంది.. విజయోత్సవ ప్రసంగంలో మోడీ కీలక వ్యాఖ్యలు
- 3 రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు దేశ ఉజ్వల భవిష్యత్కు నాంది
- గంగోత్రి నుంచి గంగాసాగర్ వరకు కమలం వికసించింది
- విజయోత్సవ ప్రసంగంలో మోడీ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్తో పాటు అస్సాం, పుదుచ్చేరిలో బీజేపీ విజయం దేశ ఉజ్వల భవిష్యత్కు నాంది అని ప్రధాని మోడీ అన్నారు. మూడు రాష్ట్రాల్లో విజయం సందర్భంగా ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యాలయంలో విజయోత్సవ సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ సహా కేంద్రమంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడారు. ఈ ఘన విజయంతో బీజేపీ కార్యకర్తలు చరిత్ర సృష్టించారని కొనియాడారు. ఈరోజు చారిత్రాత్మకమైనది.. అపూర్వమైనది.. కార్యకర్తల ఆనందంలో తాను కూడా పాలుపంచుకుంటున్నట్లు చెప్పారు. ప్రజాస్వామ్యం, పనితీరు రాజకీయాలపై విశ్వాసం చూపించే రోజు అన్నారు. బెంగాల్లో బీజేపీ ఘన విజయంతో గంగోత్రి నుంచి గంగాసాగర్ వరకు కమలం వికసించిందని మోడీ పేర్కొన్నారు.
నేటి నుంచి బెంగాల్లో కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతుంది. నేడు 20కి పైగా రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయి. ‘‘నాగరిక్ దేవో-భవ’’ మా మంత్రం. ప్రజలు మమ్మల్ని మరింత ఎక్కువగా విశ్వసిస్తున్నారు.’’ అని అన్నారు.
Also Read
- PM Modi on NEET Protest: నీట్ పేపర్ లీక్ వివాదంపై మౌనం వీడిన ప్రధాని మోడీ.. ఫాస్ట్ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు ఆదేశం
- CJP Protest: విద్యార్థుల మాటున అసాంఘిక శక్తులు.. CJP నిరసనలపై పోలీసుల సంచలన ప్రకటన..
- Dharmendra Pradhan: కేంద్ర విద్యాశాఖ మంత్రిని తప్పించకపోవడానికి 5 బలమైన కారణాలివే..
- Sonam Wangchuk: 'నేను ఇంకా బ్రతికే ఉన్నాను'.. ఆస్పత్రి బెడ్పై నుంచి సోనమ్ వాంగ్చుక్ భావోద్వేగ సందేశం
‘‘బెంగాల్లో తొలిసారి భయం కాదు.. ప్రజాస్వామ్యం గెలిచింది. దేశ ప్రజల మనోభావాలను, సంస్కృతిని అర్థం చేసుకోవడంలో కాంగ్రెస్ విఫలమైంది. కాంగ్రెస్, టీఎంసీ, ఇతరులు కొన్ని రోజుల క్రితం ‘నారీ శక్తి’ని అడ్డుకున్నారు. అందుకే మహిళలు వారిని శిక్షించారు. ఎన్నికల సమయంలో విదేశాల్లో యుద్ధ సంకేతాలు ఉన్నప్పటికీ భారతదేశంలోని ప్రజలు అటువంటి సమయంలో స్థిరత్వానికే ఓటు వేశారు. బెంగాల్ తొలి కేబినెట్ సమావేశంలో ఆయుష్మాన్ భారత్కు పచ్చజెండా ఊపుతాం.’’ అని ప్రకటించారు.
‘‘ఇక బెంగాల్లో మహిళలకు భద్రత, యువతకు ఉద్యోగాలు లభిస్తాయి. బెంగాల్లో భయం, హింస లేని ఈ కొత్త ఉదయం కోసం తరతరాలుగా ఎదురుచూశారు.’’ అని అన్నారు. ‘‘భారత్ మాతా కీ జై, జై శ్రీ రామ్’’ అంటూ ఉత్తేజపరిచే నినాదాలతో మోడీ ప్రసంగాన్ని ముగించారు.
#WATCH | Delhi | PM Narendra Modi ends his address at the BJP HQ after the party is set to achieve a landslide victory in West Bengal and Assam, by saying, "… I express my heartfelt gratitude to all citizens, all voters and all countrymen for making BJP-NDA victorious once… pic.twitter.com/AzyzOsJ5gY
— ANI (@ANI) May 4, 2026
తాజావార్తలు
-
Constable Suicide: డీజీపీ కార్యాలయంలో తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య.!
-
Nokia 123 Shield: నోకియా 123 షీల్డ్ ఫీచర్ ఫోన్ విడుదల.. 19 రోజుల బ్యాటరీ బ్యాకప్, క్రేజీ ఫీచర్స్
-
India vs Zimbabwe: ఇంగ్లండ్లో తమ్ముడు సామ్ కరన్.. జింబాబ్వే టీమ్లో అన్న బెన్ కరన్.. టీమిండియాకు ‘కరన్’ గండం!
-
Guru Purnima 2026: గురు పౌర్ణమి జూలై 28నా? 29నా? సరైన తేదీ, శుభ ముహూర్తం, పూజా విధానం ఇదే
-
Jananayagan : విజయ్ ‘జననాయకుడు’ ఓవర్సీస్ రివ్యూ.. వద్దు బ్రో
ట్రెండింగ్
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!