PM Modi: బెంగాల్ ఫలితం దేశ ఉజ్వల భవిష్యత్కు నాంది.. విజయోత్సవ ప్రసంగంలో మోడీ కీలక వ్యాఖ్యలు
- 3 రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు దేశ ఉజ్వల భవిష్యత్కు నాంది
- గంగోత్రి నుంచి గంగాసాగర్ వరకు కమలం వికసించింది
- విజయోత్సవ ప్రసంగంలో మోడీ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్తో పాటు అస్సాం, పుదుచ్చేరిలో బీజేపీ విజయం దేశ ఉజ్వల భవిష్యత్కు నాంది అని ప్రధాని మోడీ అన్నారు. మూడు రాష్ట్రాల్లో విజయం సందర్భంగా ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యాలయంలో విజయోత్సవ సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ సహా కేంద్రమంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడారు. ఈ ఘన విజయంతో బీజేపీ కార్యకర్తలు చరిత్ర సృష్టించారని కొనియాడారు. ఈరోజు చారిత్రాత్మకమైనది.. అపూర్వమైనది.. కార్యకర్తల ఆనందంలో తాను కూడా పాలుపంచుకుంటున్నట్లు చెప్పారు. ప్రజాస్వామ్యం, పనితీరు రాజకీయాలపై విశ్వాసం చూపించే రోజు అన్నారు. బెంగాల్లో బీజేపీ ఘన విజయంతో గంగోత్రి నుంచి గంగాసాగర్ వరకు కమలం వికసించిందని మోడీ పేర్కొన్నారు.
నేటి నుంచి బెంగాల్లో కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతుంది. నేడు 20కి పైగా రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయి. ‘‘నాగరిక్ దేవో-భవ’’ మా మంత్రం. ప్రజలు మమ్మల్ని మరింత ఎక్కువగా విశ్వసిస్తున్నారు.’’ అని అన్నారు.
Also Read
- MDMA Factory: ఇంత టాలెంటెడ్ గా ఉన్నావేంట్రా నువ్వు.. ఇంట్లోనే MDMA తయారీ కేంద్రం పెట్టేశావ్.!
- PM Modi: ఎర్రకోట వేదికగా యూత్కు ప్రధాని మోడీ గుడ్న్యూస్.. కోటి మంది యువతకు ఉచితంగా..
- PM Modi: ప్రభుత్వ అధికార వర్గాల్లోనూ మావోయిస్టు భావజాలం.. 'అర్బన్ నక్సల్స్'ను సమాజం దూరం పెట్టాలి..
- Trisha Krishnan: సీఎం విజయ్ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో త్రిష.. ఫ్రంట్ రోలో కూర్చుని సెల్యూట్
‘‘బెంగాల్లో తొలిసారి భయం కాదు.. ప్రజాస్వామ్యం గెలిచింది. దేశ ప్రజల మనోభావాలను, సంస్కృతిని అర్థం చేసుకోవడంలో కాంగ్రెస్ విఫలమైంది. కాంగ్రెస్, టీఎంసీ, ఇతరులు కొన్ని రోజుల క్రితం ‘నారీ శక్తి’ని అడ్డుకున్నారు. అందుకే మహిళలు వారిని శిక్షించారు. ఎన్నికల సమయంలో విదేశాల్లో యుద్ధ సంకేతాలు ఉన్నప్పటికీ భారతదేశంలోని ప్రజలు అటువంటి సమయంలో స్థిరత్వానికే ఓటు వేశారు. బెంగాల్ తొలి కేబినెట్ సమావేశంలో ఆయుష్మాన్ భారత్కు పచ్చజెండా ఊపుతాం.’’ అని ప్రకటించారు.
‘‘ఇక బెంగాల్లో మహిళలకు భద్రత, యువతకు ఉద్యోగాలు లభిస్తాయి. బెంగాల్లో భయం, హింస లేని ఈ కొత్త ఉదయం కోసం తరతరాలుగా ఎదురుచూశారు.’’ అని అన్నారు. ‘‘భారత్ మాతా కీ జై, జై శ్రీ రామ్’’ అంటూ ఉత్తేజపరిచే నినాదాలతో మోడీ ప్రసంగాన్ని ముగించారు.
#WATCH | Delhi | PM Narendra Modi ends his address at the BJP HQ after the party is set to achieve a landslide victory in West Bengal and Assam, by saying, "… I express my heartfelt gratitude to all citizens, all voters and all countrymen for making BJP-NDA victorious once… pic.twitter.com/AzyzOsJ5gY
— ANI (@ANI) May 4, 2026
తాజావార్తలు
-
Mahindra BE 6 SPORTEQ: మహీంద్రా BE6 స్పోర్టెక్ ఎలక్ట్రిక్ SUV విడుదల.. 683KM రేంజ్, Gemini AIతో అదిరిపోయే ఫీచర్లు
-
Saira Banu First Look: ముస్లిం అమ్మాయిని ప్రేమించే యువకుడిగా ఆది.. ఆకట్టుకుంటున్న ‘సైరాబాను’ ఫస్ట్ లుక్..
-
Rohit Sharma: రోహిత్ శర్మ రిటైర్మెంట్కు బ్రేక్..! హిట్మ్యాన్కు మరో అవకాశం
-
Team India: బ్రిటీషర్ల గడ్డపై స్వాతంత్య్ర దినోత్సవం.. లండన్లో జెండా ఎగరేసిన విరాట్ కోహ్లీ.. గుర్తుందా?
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
ట్రెండింగ్
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!