PM Modi: ఆసియాన్ శిఖరాగ్ర సమావేశానికి మోడీ దూరం! కారణమిదే!
- ఆసియాన్ శిఖరాగ్ర సమావేశానికి మోడీ దూరం!
- భారత్ తరపున విదేశాంగ మంత్రి జైశంకర్ హాజరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ మరో విదేశీ పర్యటనకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల గాజా శాంతి శిఖరాగ్ర సమావేశానికి దూరంగా ఉన్నారు. ఈజిప్టు వేదికగా జరిగిన ఈ సమావేశానికి ట్రంప్ స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించినా మోడీ వెళ్లలేదు. తాజాగా మలేషియా వేదికగా అక్టోబర్ 26 నుంచి 28 వరకు ఆసియాన్ శిఖరాగ్ర సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా హాజరవుతున్నారు. ఈ సమావేశానికి కూడా ప్రధాని మోడీ వెళ్లడం లేదని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Bengaluru: బెంగళూరులో దారుణం.. మహిళపై గ్యాంగ్ రేప్ చేసి దోపిడీ
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
- Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్హాసన్ కీలక వ్యాఖ్యలు
- 1991 India Gold Crisis: రాత్రికి రాత్రి బ్రిటన్కు 47,000 కిలోల బంగారం తరలింపు.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే!
ఆదివారం నుంచి ప్రారంభమయ్యే ఆసియన్ శిఖరాగ్ర సమావేశాలకు ప్రధాని మోడీ వెళ్లడం లేదని.. షెడ్యూల్ సమస్యల కారణంగా మోడీ పర్యటనకు దూరంగా ఉంటున్నట్లు ఈ విషయం తెలిసిన వ్యక్తులు మీడియాకు తెలియజేశారు. ప్రధాని మోడీ తరపున విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మలేషియా వెళ్తారని.. ఆసియాన్ శిఖరాగ్ర సమావేశాల్లో భారతదేశం తరపున జైశంకర్ ప్రాతినిధ్యం వహిస్తారని ఈ మేరలకు మలేషియాకు భారత్ తెలిపింది.
ఇది కూడా చదవండి: Delhi Encounter: ఢిల్లీలో భారీ ఎన్కౌంటర్.. నలుగురు గ్యాంగ్స్టర్లు హతం
ఆసియాన్ (ఆగ్నేయాసియా దేశాల సంఘం) శిఖరాగ్ర సమావేశం అక్టోబర్ 26 నుంచి 28 వరకు కౌలాలంపూర్లో జరగనున్నాయి. శిఖరాగ్ర సమావేశాల్లో జరిగే చర్చల్లో భారత్ ఎంత వరకు పాల్గొంటుందనే దానిపై క్లారిటీ లేకపోయినా.. వర్చువల్ మోడ్లో మాత్రం ప్రధాని మోడీ పాల్గొనే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తు్న్నాయి.
ఆసియాన్ శిఖరాగ్ర సమావేశం అనేది ఆగ్నేయాసియా దేశాల ఆర్థిక, రాజకీయ, భద్రత, సామాజిక-సాంస్కృతిక అభివృద్ధికి సంబంధించిన ఆసియాన్ (ASEAN) సభ్య దేశాల నాయకులు నిర్వహించే ద్వివార్షిక సమావేశం. ఈ సమావేశాలు ప్రాంతీయ, ప్రపంచ సమస్యలను చర్చించడానికి, సహకారాన్ని బలోపేతం చేయడానికి, కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ప్రపంచ నాయకులంతా ఒకచోట చేరతారు. ప్రస్తుతం ఈ సమావేశానికి మలేషియా అధ్యక్ష స్థానం వహిస్తోంది. ఈ సమావేశాల్లో పాల్గొంటున్నట్లుగా ఇప్పటికే ట్రంప్.. మలేషియాకు సమాచారం అందించారు.
ఇది కూడా చదవండి: Medchal: గోరక్షక్దళ్ సభ్యుడిపై ముస్లిం యువకుడి కాల్పులు.. గోవుల తరలింపు సమాచారం ఇస్తానని పిలిచి..
- Tags
- Asean summit
- Malaysia
- PM Modi
- trump
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..