PM Modi: కాంగ్రెస్లా ప్రేమ లేఖలు పంపే కాలం పోయింది.. ఇళ్లలోని దూరి ఉగ్రవాదుల్ని చంపేస్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ మరోసారి కాంగ్రెస్ టార్గెట్గా విమర్శలు గుప్పించారు. జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన జేఎంఎం-కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలను ‘‘పిరికిపంద’’గా అభివర్ణించారు. జాతీయ భద్రతపై కాంగ్రెస్ సరిగా వ్యవహరించలేదని ఆయన శనివారం పాలములో జరిగిన ర్యాలీలో మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయిందని, సహాయం కోసం పాకిస్తాన్ ఇప్పుడు ‘‘ఏడుస్తోంది, అరుస్తోంది’’ అని అన్నారు.
Read Also: S Jaishankar: బైడెన్ ‘జెనోఫోబిక్’ వ్యాఖ్యలపై తనదైన శైలిలో స్పందించిన జైశంకర్..
Also Read
- Elephant: కర్ణాటకలో పర్యాటకురాలు మృతికి కారణమైన ఏనుగు మృతి.. ఏం జరిగిందంటే..
- Global Internet Disruption: ఇరాన్ వ్యాఖ్యలతో కొత్త టెన్షన్..! ఇంటర్నెట్ స్తంభించిపోతుందా..? భారత్కు ముప్పు తప్పదా..?
- Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ 'మాస్' స్టేట్మెంట్!
- Supreme Court: రోడ్లపై వీధి కుక్కలు కనిపిస్తే అంతే! సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. పాత ఆర్డర్ మారేదే లేదని స్పష్టం
గతంలో ఉగ్రవాదుల దాడుల తర్వాత కాంగ్రెస్ పిరికి ప్రభుత్వాలు ప్రపంచ వేదికపై ఏడ్చేదని, ప్రస్తుతం ప్రపంచవేదికపై భారత్ ఏడ్చే కాలం పోయింది. ఇప్పుడు పాకిస్తానే సాయం కోసం ఏడుస్తోందని ప్రధాని మోడీ అన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు శాంతిని కాంక్షిస్తూ పాకిస్తాన్కి ప్రేమ లేఖలు రాసేవని, దీని ప్రతిస్పందనగా పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని పంపేదని ఆయన అన్నారు. నేటి భారత్ లేఖల్ని రాయదు, ఇది కొత్త భారతదేశం, ఇంట్లోకి దూరి ఉగ్రవాదుల్ని చంపేస్తుందని అన్నారు.
సర్జికల్ స్ట్రైక్స్తో అల్లాడిపోయిన పాకిస్తాన్ ఇప్పుడు యువరాజును(రాహుల్ గాంధీ)ని ప్రధాని చేయాలని ప్రార్థిస్తోందని, అయితే భారత్ మాత్రం బలమైన ప్రభుత్వం కావాలని కోరుకుంటోందని అన్నారు. ఇటీవల పాకిస్తాన్ మాజీ మంత్రి రాహుల్ గాంధీ వీడియోను షేర్ చేసి ‘రాహుల్ గాంధీ అన్ ఫైర్’’ అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ ఘాటుగా స్పందిస్తోంది. కాంగ్రెస్ పాకిస్తాన్ మద్దతు కోరుతోందని బీజేపీ నేతలు విమర్శించారు. గతంలో బలహీన ప్రభుత్వాలతో పోల్చితే ప్రస్తుతం బీజేపీ ఉగ్రవాదంపై స్థిరమైన, పటిష్టమైన చర్యలు తీసుకుంటోందని అన్నారు.
తాజావార్తలు
-
Khawaja Asif: పశ్చిమాసియాలో యుద్ధం మళ్లీ మొదలవ్వడంపై పాక్ రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు
-
Elephant: కర్ణాటకలో పర్యాటకురాలు మృతికి కారణమైన ఏనుగు మృతి.. ఏం జరిగిందంటే..
-
Prices Hike: పాలు, ఫుడ్డు, సబ్బులు.. ఏదీ కొనేటట్టు లేదు బాబోయ్..పరిస్థితి ఇలాగే కొనసాగితే బతుకు బస్టాండే..!
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
Pawan Kalyan: మళ్ళీ స్టైలిష్ లుక్’లోకి పవన్ కళ్యాణ్
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!