PM Modi: కాంగ్రెస్లా ప్రేమ లేఖలు పంపే కాలం పోయింది.. ఇళ్లలోని దూరి ఉగ్రవాదుల్ని చంపేస్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ మరోసారి కాంగ్రెస్ టార్గెట్గా విమర్శలు గుప్పించారు. జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన జేఎంఎం-కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలను ‘‘పిరికిపంద’’గా అభివర్ణించారు. జాతీయ భద్రతపై కాంగ్రెస్ సరిగా వ్యవహరించలేదని ఆయన శనివారం పాలములో జరిగిన ర్యాలీలో మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయిందని, సహాయం కోసం పాకిస్తాన్ ఇప్పుడు ‘‘ఏడుస్తోంది, అరుస్తోంది’’ అని అన్నారు.
Read Also: S Jaishankar: బైడెన్ ‘జెనోఫోబిక్’ వ్యాఖ్యలపై తనదైన శైలిలో స్పందించిన జైశంకర్..
Also Read
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
- Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
గతంలో ఉగ్రవాదుల దాడుల తర్వాత కాంగ్రెస్ పిరికి ప్రభుత్వాలు ప్రపంచ వేదికపై ఏడ్చేదని, ప్రస్తుతం ప్రపంచవేదికపై భారత్ ఏడ్చే కాలం పోయింది. ఇప్పుడు పాకిస్తానే సాయం కోసం ఏడుస్తోందని ప్రధాని మోడీ అన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు శాంతిని కాంక్షిస్తూ పాకిస్తాన్కి ప్రేమ లేఖలు రాసేవని, దీని ప్రతిస్పందనగా పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని పంపేదని ఆయన అన్నారు. నేటి భారత్ లేఖల్ని రాయదు, ఇది కొత్త భారతదేశం, ఇంట్లోకి దూరి ఉగ్రవాదుల్ని చంపేస్తుందని అన్నారు.
సర్జికల్ స్ట్రైక్స్తో అల్లాడిపోయిన పాకిస్తాన్ ఇప్పుడు యువరాజును(రాహుల్ గాంధీ)ని ప్రధాని చేయాలని ప్రార్థిస్తోందని, అయితే భారత్ మాత్రం బలమైన ప్రభుత్వం కావాలని కోరుకుంటోందని అన్నారు. ఇటీవల పాకిస్తాన్ మాజీ మంత్రి రాహుల్ గాంధీ వీడియోను షేర్ చేసి ‘రాహుల్ గాంధీ అన్ ఫైర్’’ అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ ఘాటుగా స్పందిస్తోంది. కాంగ్రెస్ పాకిస్తాన్ మద్దతు కోరుతోందని బీజేపీ నేతలు విమర్శించారు. గతంలో బలహీన ప్రభుత్వాలతో పోల్చితే ప్రస్తుతం బీజేపీ ఉగ్రవాదంపై స్థిరమైన, పటిష్టమైన చర్యలు తీసుకుంటోందని అన్నారు.
తాజావార్తలు
-
Jana Nayagan : బాక్సాఫీస్ డిజాస్టర్గా విజయ్ ‘జన నాయగన్’.. డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
IND vs SL Test: శ్రీలంకలో టీమిండియా ల్యాండ్.. స్టార్ ప్లేయర్ మిస్సింగ్.. మొదటి టెస్ట్ డౌటే!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
ట్రెండింగ్
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!