PM Modi: కాంగ్రెస్లా ప్రేమ లేఖలు పంపే కాలం పోయింది.. ఇళ్లలోని దూరి ఉగ్రవాదుల్ని చంపేస్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ మరోసారి కాంగ్రెస్ టార్గెట్గా విమర్శలు గుప్పించారు. జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన జేఎంఎం-కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలను ‘‘పిరికిపంద’’గా అభివర్ణించారు. జాతీయ భద్రతపై కాంగ్రెస్ సరిగా వ్యవహరించలేదని ఆయన శనివారం పాలములో జరిగిన ర్యాలీలో మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయిందని, సహాయం కోసం పాకిస్తాన్ ఇప్పుడు ‘‘ఏడుస్తోంది, అరుస్తోంది’’ అని అన్నారు.
Read Also: S Jaishankar: బైడెన్ ‘జెనోఫోబిక్’ వ్యాఖ్యలపై తనదైన శైలిలో స్పందించిన జైశంకర్..
Also Read
- Liquor Prices: మద్యం బాటిళ్లపై అదనపు వసూళ్లు.. సీఎం సీరియస్.. 3 రోజుల్లో 240 మందిపై వేటు..
- Explainer: ఆ నగరాలు మునిగిపోతున్నాయి..! UN నివేదికలో షాకింగ్ నిజాలు!
- Teachers Day 2026: ఉపాధ్యాయులతో ప్రధాని మోడీ సంభాషణ.. టీచర్స్ డే సందర్భంగా కీలక సందేశం
- Chirag Paswan: జంతర్ మంతర్ దాడి కేసులో ట్విస్ట్.. భరద్వాజ్పై FIRకు చిరాగ్ పాశ్వాన్ డిమాండ్
గతంలో ఉగ్రవాదుల దాడుల తర్వాత కాంగ్రెస్ పిరికి ప్రభుత్వాలు ప్రపంచ వేదికపై ఏడ్చేదని, ప్రస్తుతం ప్రపంచవేదికపై భారత్ ఏడ్చే కాలం పోయింది. ఇప్పుడు పాకిస్తానే సాయం కోసం ఏడుస్తోందని ప్రధాని మోడీ అన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు శాంతిని కాంక్షిస్తూ పాకిస్తాన్కి ప్రేమ లేఖలు రాసేవని, దీని ప్రతిస్పందనగా పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని పంపేదని ఆయన అన్నారు. నేటి భారత్ లేఖల్ని రాయదు, ఇది కొత్త భారతదేశం, ఇంట్లోకి దూరి ఉగ్రవాదుల్ని చంపేస్తుందని అన్నారు.
సర్జికల్ స్ట్రైక్స్తో అల్లాడిపోయిన పాకిస్తాన్ ఇప్పుడు యువరాజును(రాహుల్ గాంధీ)ని ప్రధాని చేయాలని ప్రార్థిస్తోందని, అయితే భారత్ మాత్రం బలమైన ప్రభుత్వం కావాలని కోరుకుంటోందని అన్నారు. ఇటీవల పాకిస్తాన్ మాజీ మంత్రి రాహుల్ గాంధీ వీడియోను షేర్ చేసి ‘రాహుల్ గాంధీ అన్ ఫైర్’’ అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ ఘాటుగా స్పందిస్తోంది. కాంగ్రెస్ పాకిస్తాన్ మద్దతు కోరుతోందని బీజేపీ నేతలు విమర్శించారు. గతంలో బలహీన ప్రభుత్వాలతో పోల్చితే ప్రస్తుతం బీజేపీ ఉగ్రవాదంపై స్థిరమైన, పటిష్టమైన చర్యలు తీసుకుంటోందని అన్నారు.
తాజావార్తలు
-
Lenovo Yoga Tab Plus Gen 2: 12,700mAh బ్యాటరీ.. 4K 144Hz డిస్ప్లే.. లెనోవో యోగా ట్యాబ్ ప్లస్ జెన్ 2 వచ్చేసింది
-
Hanuman Ansh Singer: ఒక్క పాటతో అంధ గాయకుడి లైఫ్ టర్న్.. బాలీవుడ్ నుంచి వరుస ఆఫర్లు..
-
Liquor Prices: మద్యం బాటిళ్లపై అదనపు వసూళ్లు.. సీఎం సీరియస్.. 3 రోజుల్లో 240 మందిపై వేటు..
-
Revanth Reddy: తెలంగాణలో ఓట్ల తొలగింపుపై రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్.. కాంగ్రెస్ శ్రేణులకు కీలక సూచనలు!
-
Dengue Insurance Claim: ‘డెంగ్యూ సీరియస్ కాదట’.. ప్లేట్లెట్స్ 70 వేల కంటే తగ్గలేదంటూ మెడిక్లెయిమ్ రిజెక్ట్?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!