PM Modi: ప్రధాని నరేంద్రమోడీ మరోసారి కాంగ్రెస్ టార్గెట్గా విమర్శలు గుప్పించారు. జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన జేఎంఎం-కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలను ‘‘పిరికిపంద’’గా అభివర్ణించారు. జాతీయ భద్రతపై కాంగ్రెస్ సరిగా వ్యవహరించలేదని ఆయన శనివారం పాలములో జరిగిన ర్యాలీలో మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయిందని, సహాయం కోసం పాకిస్తాన్ ఇప్పుడు ‘‘ఏడుస్తోంది, అరుస్తోంది’’ అని అన్నారు.
Read Also: S Jaishankar: బైడెన్ ‘జెనోఫోబిక్’ వ్యాఖ్యలపై తనదైన శైలిలో స్పందించిన జైశంకర్..
గతంలో ఉగ్రవాదుల దాడుల తర్వాత కాంగ్రెస్ పిరికి ప్రభుత్వాలు ప్రపంచ వేదికపై ఏడ్చేదని, ప్రస్తుతం ప్రపంచవేదికపై భారత్ ఏడ్చే కాలం పోయింది. ఇప్పుడు పాకిస్తానే సాయం కోసం ఏడుస్తోందని ప్రధాని మోడీ అన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు శాంతిని కాంక్షిస్తూ పాకిస్తాన్కి ప్రేమ లేఖలు రాసేవని, దీని ప్రతిస్పందనగా పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని పంపేదని ఆయన అన్నారు. నేటి భారత్ లేఖల్ని రాయదు, ఇది కొత్త భారతదేశం, ఇంట్లోకి దూరి ఉగ్రవాదుల్ని చంపేస్తుందని అన్నారు.
సర్జికల్ స్ట్రైక్స్తో అల్లాడిపోయిన పాకిస్తాన్ ఇప్పుడు యువరాజును(రాహుల్ గాంధీ)ని ప్రధాని చేయాలని ప్రార్థిస్తోందని, అయితే భారత్ మాత్రం బలమైన ప్రభుత్వం కావాలని కోరుకుంటోందని అన్నారు. ఇటీవల పాకిస్తాన్ మాజీ మంత్రి రాహుల్ గాంధీ వీడియోను షేర్ చేసి ‘రాహుల్ గాంధీ అన్ ఫైర్’’ అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ ఘాటుగా స్పందిస్తోంది. కాంగ్రెస్ పాకిస్తాన్ మద్దతు కోరుతోందని బీజేపీ నేతలు విమర్శించారు. గతంలో బలహీన ప్రభుత్వాలతో పోల్చితే ప్రస్తుతం బీజేపీ ఉగ్రవాదంపై స్థిరమైన, పటిష్టమైన చర్యలు తీసుకుంటోందని అన్నారు.