Mamata Banerjee: దేశంలో అధ్యక్ష తరహా పాలన.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి..
“Please Save Democracy,” Mamata Banerjee Urges Chief Justice of India: దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలను నాశనం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఇదే ధోరణి కొనసాగితే దేశంలో అధ్యక్ష తరహా పాలనకు దారి తీస్తుందని ఆమె హెచ్చరించారు. ప్రజాస్వామ్యం, సమాఖ్య వ్యవస్థను కాపాడాలని ఆమె భారత ప్రధాన న్యాయమూర్తిని కోరారు. కోల్కతాలోని నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ జురిడికల్ సైన్సెస్ (ఎన్యుజెఎస్) స్నాతకోత్సవానికి హాజరైన సిజెఐ జస్టిస్ యుయు లలిత్ సమక్షంలో మమతా బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రజలను వేధింపుల నుంచి రక్షించాలని న్యాయవ్యవస్థను కోరారు. సమాజంలో ఓ నిర్ధిష్ట వర్గం ప్రజాస్వామ్య అధికారాన్ని స్వాధీనం చేసుకుంటున్నారని విమర్శించారు. దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది..? ప్రజాస్వామ్యాన్ని రక్షించండి అంటూ కాన్వోకేషన్ కార్యక్రమంలో సీజేఐని కోరారు. మీడియా పక్షపాతం గురించి ఆమె మాట్లాడుతూ.. వారు ఎవరినైనా దుర్భాషలాడగలరా..? ఎవరినైనా నిందించగలారా..? అని ప్రశ్నించారు. మా ప్రతిష్ట మా ఇజ్జత్ అని.. ఒకసారి ప్రతిష్టకు భంగం కలిగితే అంతా అయిపోతుందని మమతా బెనర్జీ అన్నారు.
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
Read Also: Tammareddy Bharadwaj: విజయ్ దేవరకొండ కోసం అన్ని కోట్లు ఎవడు పెట్టమన్నాడు..?
తీర్పు వెలువడకముందే చాలా విషయాలు జరుగుతున్నాయని సీజేఐ సమక్షంలోనే అన్నారు. ఈ విషయం చెప్పడానికి నన్ను క్షమించండి.. నేను తప్పు చేసినట్లు భావిస్తే క్షమాపణలు చెబుతున్నానని మమతా బెనర్జీ అన్నారు. ఎన్యూజేఎస్ ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన సంస్థ ఒకటి అని.. సీజేఐ పోషిస్తున్న పాత్ర చాలా ముఖ్యమని.. సీజేఐ యూయూ లలిత్ ను అభినందించారు. రెండు నెలల్లోనే న్యాయవ్యవస్థ అంటే ఎంటో లలిత్ చూపించారని అన్నారు.
ప్రజలు న్యాయవ్యవస్థపై విశ్వాసం కోల్పోయారని నేను అనడం లేదని.. అయితే కానీ ప్రస్తుతం పరిస్థితి మరింత దిగజారిందని అన్నారు. న్యాయవ్యవస్థ ప్రజలను అన్యాయం నుంచి రక్షించాలని.. వారి మొర వినాలని.. ప్రజలు బాధలు పడుతున్నారని మమతా బెనర్జీ అన్నారు.
తాజావార్తలు
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
-
India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
-
SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
-
AP Govt: 99 పైసలకే ఎకరం భూమి కేటాయించిన ఏపీ.. మొత్తం 20 ఎకరాలు..
-
India Women vs SA Women: ఛేదనలో బొక్కబోర్లా పడ్డ టీమిండియా.. 4-1తో సిరీస్ ఓటమి.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!