Mamata Banerjee: దేశంలో అధ్యక్ష తరహా పాలన.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
“Please Save Democracy,” Mamata Banerjee Urges Chief Justice of India: దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలను నాశనం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఇదే ధోరణి కొనసాగితే దేశంలో అధ్యక్ష తరహా పాలనకు దారి తీస్తుందని ఆమె హెచ్చరించారు. ప్రజాస్వామ్యం, సమాఖ్య వ్యవస్థను కాపాడాలని ఆమె భారత ప్రధాన న్యాయమూర్తిని కోరారు. కోల్కతాలోని నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ జురిడికల్ సైన్సెస్ (ఎన్యుజెఎస్) స్నాతకోత్సవానికి హాజరైన సిజెఐ జస్టిస్ యుయు లలిత్ సమక్షంలో మమతా బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రజలను వేధింపుల నుంచి రక్షించాలని న్యాయవ్యవస్థను కోరారు. సమాజంలో ఓ నిర్ధిష్ట వర్గం ప్రజాస్వామ్య అధికారాన్ని స్వాధీనం చేసుకుంటున్నారని విమర్శించారు. దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది..? ప్రజాస్వామ్యాన్ని రక్షించండి అంటూ కాన్వోకేషన్ కార్యక్రమంలో సీజేఐని కోరారు. మీడియా పక్షపాతం గురించి ఆమె మాట్లాడుతూ.. వారు ఎవరినైనా దుర్భాషలాడగలరా..? ఎవరినైనా నిందించగలారా..? అని ప్రశ్నించారు. మా ప్రతిష్ట మా ఇజ్జత్ అని.. ఒకసారి ప్రతిష్టకు భంగం కలిగితే అంతా అయిపోతుందని మమతా బెనర్జీ అన్నారు.
Also Read
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
- Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
Read Also: Tammareddy Bharadwaj: విజయ్ దేవరకొండ కోసం అన్ని కోట్లు ఎవడు పెట్టమన్నాడు..?
తీర్పు వెలువడకముందే చాలా విషయాలు జరుగుతున్నాయని సీజేఐ సమక్షంలోనే అన్నారు. ఈ విషయం చెప్పడానికి నన్ను క్షమించండి.. నేను తప్పు చేసినట్లు భావిస్తే క్షమాపణలు చెబుతున్నానని మమతా బెనర్జీ అన్నారు. ఎన్యూజేఎస్ ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన సంస్థ ఒకటి అని.. సీజేఐ పోషిస్తున్న పాత్ర చాలా ముఖ్యమని.. సీజేఐ యూయూ లలిత్ ను అభినందించారు. రెండు నెలల్లోనే న్యాయవ్యవస్థ అంటే ఎంటో లలిత్ చూపించారని అన్నారు.
ప్రజలు న్యాయవ్యవస్థపై విశ్వాసం కోల్పోయారని నేను అనడం లేదని.. అయితే కానీ ప్రస్తుతం పరిస్థితి మరింత దిగజారిందని అన్నారు. న్యాయవ్యవస్థ ప్రజలను అన్యాయం నుంచి రక్షించాలని.. వారి మొర వినాలని.. ప్రజలు బాధలు పడుతున్నారని మమతా బెనర్జీ అన్నారు.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?