Pinarayi Vijayan: ‘‘కేరళ మినీ పాకిస్తాన్’’.. స్పందించిన పినరయి విజయన్..
- ‘‘కేరళ మిని పాకిస్తాన్’’ వ్యాఖ్యలపై ప్రతిపక్షాల ఆగ్రహం..
- వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ మంత్రి నితీష్ రాణే..
- లౌకికవాదానికి విఘాతమని సీఎం పినరయి విజయన్ విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pinarayi Vijayan: ‘‘కేరళ మిని పాకిస్తాన్’’ అంటూ బీజేపీ నేత, మహారాష్ట్ర మంత్రి నితీష్ రాణే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యల్ని కేరళ సీఎం పినరయి విజయన్ తప్పుపట్టారు. ఈ వ్యాఖ్యలు ‘‘ తీవ్రమైన హానికరమైనవి’’, ‘‘పూర్తిగా ఖండించదగినది’’ అని అభివర్ణించారు. ఇది కేరళపై ద్వేషపూరిత ప్రచారాన్ని ప్రతిబింబిస్తోందని అన్నారు. ఈ వ్యాఖ్యలు లౌకికవాదం, మతసామరస్యానికి పునాది అయిన కేరళకు వ్యతిరేకంగా సంఘ్ పరివార్ చేస్తున్న ద్వేషపూరిత ప్రచారమని విమర్శించారు. కేరళపై జరిగిన ఈ నీచమైన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని పినరయి చెప్పారు. సంఘ్ పరివార్ ద్వేషపూరిత ప్రచారానికి వ్యతిరేకంగా అన్ని ప్రజాస్వామ్య, లౌకిక శక్తులు ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
మహారాష్ట్ర మంత్రి నితీస్ రాణే ఇటీవల ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలు ప్రియాంకా గాంధీ, రాహుల్ గాంధీలు మినిపాకిస్తాన్ అయిన కేరళ వయనాడ్ నుంచి ఎన్నికయ్యారని అన్నారు. ‘‘కేరళ మిని పాకిస్తాన్, అందుకే రాహుల్ గాంధీ, అతడి సోదరి అక్కడ నంచి గెలిచారు. ఉగ్రవాదులంతా వారికి ఓటు వేస్తారు. ఇది నిజం, ఉగ్రవాదులతో కలిసి ఉండే వారు ఎంపీలుగా మారారు’’ అని రాణే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Also Read
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
Read Also: Bheems Ceciroleo : టాలీవుడ్ లో దూసుకెళ్తున్న భీమ్స్..
ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. కాంగ్రెస్ అధికార ప్రతినిధి అతుల్ లోంధే మాట్లాడుతూ.. ‘‘నితీష్ రాణే నుంచి ఇంకేం ఆశించవచ్చు..? అతను ఈ పని చేయడానికే ఎన్నికయ్యారు. అతడికి మంత్రి పదవిలో కొనసాగే హక్కు ఉందా అని నేను ప్రధాని మోడీ, సీఎం ఫడ్నవీస్లను అడగాలని అనుకుంటున్నా.’’అని అన్నారు. శివసేన ఠాక్రే వర్గం నేత ఆనంద్ దూబే మాట్లాడుతే.. ప్రధాని కేవలం లక్ష ఓట్లతో గెలిచినందుకు బీజేపీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. ప్రియాంకాగాంధీ 4 లక్షల ఓట్ల తేడాతో గెలవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు.
విమర్శల నేపథ్యంలో నితీష్ రాణే తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. కేరళ భారతదేశంలో భాగం, అయితే హిందువుల జనాభా తగ్గడంపై ప్రతీ ఒక్కరూ ఆందోళన చెందుతున్నారు, హిందువులను ముస్లింలుగా, క్రైస్తవులుగా మార్చడం అక్కడ రోజూ సాధారణంగా మారిందని అన్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
-
Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్పై కన్నీళ్లు పెట్టుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ దర్శకుడు!
-
Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
-
Rahul Gandhi: ‘ప్రభుత్వాన్ని తొలగించండి’ అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!