Petrol Rates: కేంద్రం బాటలో రాజస్తాన్, కేరళ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రజలపై పెట్రో భారాన్ని తగ్గించింది. పెట్రోల్, డిజిల్ పై కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని పెట్రోల్ పై రూ. 8, డిజిల్ పై రూ.6 తగ్గించడంతో లీటర్ పెట్రోల్ పై రూ. 9.5, డిజిల్ పై రూ. 7 తగ్గింది. నిన్నటి అర్థరాత్రి నుంచి తగ్గిన రేట్లు అమలులోకి వచ్చాయి. గతేడాది నవంబర్ లో దీపావళి ముందు కూడా కేంద్ర ఇదే విధంగా లీటర్ పెట్రల్ పై రూ.5, డిజిల్ పై రూ. 10 కేంద్ర ఎక్సైజ్ టాక్స్ ను తగ్గించింది. ఆ సమయంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఉండటంతో ఎలక్షన్ స్టంట్ గా ప్రతిపక్షాలు కొట్టిపారేశాయి.
ఇదిలా ఉంటే కేంద్రం బాటలో పలు రాష్ట్రాలు పయణించే అవకాశం కనిపిస్తోంది. ప్రజల్లో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలపై వ్యతిరేఖత రాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాల్యూ ఆడెడ్ టాక్స్ (వ్యాట్) ను తగ్గించుకుంటున్నాయి. తాజాగా కేరళ, రాజస్తాన్ రాష్ట్రాలు పెట్రోల్, డిజిల్ పై రాష్ట్ర పన్నులను తగ్గించుకున్నాయి. దీంతో ఈ రాష్ట్రాల్లో మరింతగా పెట్రోల్ , డిజిల్ రేట్లు తక్కువ కానున్నాయి.
Also Read
- West Bengal: ‘‘అమ్మాయిలు 3 నెలల స్కర్టులు ధరించొద్దు’’.. బెంగాల్ మంత్రి ఎందుకు ఇలా చెప్పారు.?
- Free LPG Cylinders Scheme: గుడ్న్యూస్ చెప్పిన గోవా సీఎం.. 3 ఎల్పీజీ సిలిండర్లు ఫ్రీ.. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్
- RG Kar Case: ఆర్జీ కర్ కేసులో కీలక పరిణామం.. నిందితుడిపై రాళ్లు, ఇటుకలతో దాడి
- Nepal Floods: 275 మంది భారతీయులు గల్లంతు.. 166 మంది క్షేమం.. కేంద్రం కీలక ప్రకటన
శనివారం కేంద్రం పెట్రోల్, డిజిల్ రేట్లు తగ్గించిన తర్వాత కేరళ ప్రభుత్వం పెట్రోల్ పై రూ. 2.41, డిజిల్ పై రూ. 1.36 వ్యాట్ ను తగ్గించింది. ఇదే బాటలో రాజస్తాన్ ప్రభుత్వం కూడా పెట్రోల్, డిజిల్ పై టాక్సులను వరసగా రూ. 2.48, రూ. 1.16 తగ్గించింది. దీంతో ఈ రెండు రాష్ట్రాల్లో సామాన్యుడిపై మరింతగా భారం తగ్గినట్లు అయింది.
కేంద్రం నిర్ణయంతో పలు రాష్ట్రాలు కూడా పెట్రోల్, డిజిల్ పై రాష్ట్ర పన్నులను తగ్గించే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా టాక్సులు తగ్గించే అవకాశం ఉంది. దీంతో పాటు గతేడాది నవంబర్ లో కేంద్రం పన్నులను తగ్గించిన తర్వాత కూడా ఏపీ, తెలంగాణ, వెస్ట్ బెంగాల్ వంటి రాష్ట్రాలు పన్నులను తగ్గించలేదు. అయితే ఈసారి కేంద్ర నిర్ణయంతో తప్పక తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ రాష్ట్రాలు ఏవిధంగా స్పందిస్తాయో చూడాలి. ఈ ఏడాది డిసెంబర్ లో ఎన్నికలు జరుగనున్న హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు కూడా పెట్రోల్, డిజిల్ పై వ్యాట్ తగ్గించే అవకాశ ఉంది.
తాజావార్తలు
-
Gut Health: జీర్ణక్రియ మెరుగుపడాలంటే..? రోజువారీ ఆహారంలో ఈ ఐదు చేర్చండి
-
OTR: యాక్టివ్ మోడ్లోకి షకీల్.. కవిత ఎఫెక్ట్, కేటిఆర్ వార్నింగ్ కారణమా ?
-
OTR: కొండా సురేఖ బీజేపీలో చేరుతుందా ?
-
West Bengal: ‘‘అమ్మాయిలు 3 నెలల స్కర్టులు ధరించొద్దు’’.. బెంగాల్ మంత్రి ఎందుకు ఇలా చెప్పారు.?
-
Dancers Union Clash: పోలీసుల వద్దకి సినీ డాన్సర్స్ యూనియన్ పంచాయతీ!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!