Petrol-Diesel prices: ఇరాన్ వార్, మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు దేశ ఇంధన రంగాన్ని ప్రభావితం చేస్తున్నాయి. మన దేశమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఇంధన సమస్యలు ఉన్నాయి. ఇదిలా ఉంటే, ప్రధాని నరేంద్రమోడీ పొదుపు మంత్రాన్ని పాటించాలని చెప్పారు. దేశంలో పెట్రోల్-డీజిల్ ధరలు పెరుగుతాయనే ఆందోళనల నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) సంజయ్ మల్హోత్రా కీలక వ్యాఖ్యలు చేశారు.
Read Also: Supreme Court: హిందూ మతం ఓ జీవన విధానం.. దీపం వెలిగిస్తే సరిపోతుందన్న సుప్రీంకోర్టు
మధ్యప్రాచ్యంలో సంఘర్షణ కొనసాగితే, ప్రపంచ మార్కెట్లలో పెరుగుతున్న ముడి చమురు ధరల కారణంగా భారత్లో పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచాల్సి రావచ్చని మల్హోత్రా అన్నారు. మంగళవారం స్విట్జర్లాండ్లో స్విస్ నేషనల్ బ్యాంక్ మరియు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంయుక్తంగా నిర్వహించిన ఒక సమావేశంలో మల్హోత్రా అన్నారు. దీనికి ఒక రోజు ముందు కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి కూడా ధరలు పెంచాల్సి రావచ్చని సూచించారు.
పెరుగుతున్న ఇంధన ధరలు భారత్లో ద్రవ్యోల్బణాన్ని పరీక్షిస్తున్నాయని మల్హోత్రా చెప్పారు. ఇలాంటి సమయంలో రిజ్వ్ బ్యాంక్ విధానపరమైన జోక్యం చేసుకోవాల్సి వస్తుందని ఆర్బీఐ గవర్నర్ అన్నారు. ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడానికి ఇప్పటి వరకు కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ యథాతథంగా ఉంచింది. జూన్ 5న మరోసారి ద్రవ్య విధాన సమావేశం జరుగనుంది. ఈ నేపథ్యంలోనే ఆర్బీఐ గవర్నర్ నుంచి ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం.
