RSS: “దారా షికో”ని కాకుండా “ఔరంగజేబు”ని కొలుస్తున్నారు.. వారు దేశానికి ప్రమాదం..
- ఔరంగజేబు వివాదం నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ కీలక వ్యాఖ్యలు.. దారా షికోని కాకుండా ఔరంగజేబుని ఆరాధిస్తున్నారు.. అలాంటి ఆక్రమణదారు మనస్తత్వం భారత్కి ప్రమాదం.. ఆర్ఎస్ఎస్ దత్తాత్రేయ హోసబాలే కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RSS: ఔరంగజేబు సమాధి వివాదం నడుస్తు్న్న వేళ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే మాట్లాడుతూ.. ‘‘ భారతదేశ నైతికతకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తిని ఆరాధిస్తున్నామా..? ఆక్రమణదారుల మనస్తత్వం ఉన్నవారు భారతదేశానికి ముప్పు’’ అని అన్నారు. ఆర్ఎస్ఎస్ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన అఖిల భారతీయ ప్రతినిధి సభ ముగింపు రోజున ఇక్కడ విలేకరులను ఉద్దేశించి హోసబాలే మాట్లాడారు. సామాజిక సామరస్యాన్ని విశ్వసించే ఔరంగజేబు సోదరుడు దారా షికోని కాదని ఔరంగజేబుని ఒక ఐకాన్గా చేశారని ఆయన అన్నారు.
గతంలో చాలా సంఘటనలు జరిగాయి. ‘‘ఢిల్లీలో ఔరంగజేబు రోడ్డు ఉండేది, దానికి అబ్దుల్ కలాం రోడ్డుగా మార్చారు. దాని వెనక కారణం ఉంది. ఔరంగజేబు సోదరుడు దారుషికోని హీరోగా చేయలేదు. గంగా-జముని సంస్కృతిని సమర్థించే వారు దారా షికోను ముందుకు తీసుకురావాలని ఎప్పుడూ అనుకోలేదు. భారతదేశ నైతికతకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తిని మనం ఐకాన్గా చూపిస్తామా లేక ఈ భూమి సంప్రదాయాల ప్రకారం పనిచేసే వారితో మనం వెళ్తామా?’’ అని ఆయన అడిగారు.
Also Read
- Sakshi Jha: సాక్షి ఝా 'మ్యాన్ హేటర్' వ్యాఖ్యలు.. భర్తకు మద్యం తాగించి చంపాలనుకుంటున్నట్లు చెప్పిన వైనం
- Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
- RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
- Abhijeet Dipke: సోనమ్వాంగ్చుక్ దీక్ష భగ్నం వేళ అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం..
Read Also: Murder : రంగారెడ్డి జిల్లాలో దారుణం.. అప్పుల వివాదంతో యువకుడి దారుణ హత్య
ఆక్రమణదారుల మనస్తత్వం ఉన్న వ్యక్తులు దేశానికి ముప్పు కలిగిస్తారని, మొఘల్ చక్రవర్తి అక్బర్కు వ్యతిరేకంగా పోరాడిన రాజ్పుత్ రాజు మహారాణా ప్రతాప్ వంటి వ్యక్తులను హోసబాలే ప్రశంసించారు. ‘‘ బ్రిటిషర్లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం స్వాతంత్య్ర పోరాటం. వారికి ముందు ఉన్నవారికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం కూడా ఒక స్వాతంత్య్ర పోరాటమే. మహారాణా ప్రతాప్ స్వేచ్ఛ కోసం పోరాటం చేశారు. ఆక్రమణదారుల మనస్తత్వం ఉన్న వ్యక్తులు దేశానికి ప్రమాదం. మన దేశ నైతికతతో ఎవరు సరిపోతారో మనం నిర్ణయించుకోవాలి. ఇది మతం గురించి కాదు. ఇది ఆర్ఎస్ఎస్ దృఢమైన అభిప్రాయం’’ అని అన్నారు.
వక్ఫ్ బిల్లుపై మాట్లాడుతూ.. ప్రభుత్వం వక్ఫ్పై ఒక కమిషన్ ఏర్పాటు చేసింది, వారు ఏమి తీసుకువస్తారో చూద్దాము, ఇప్పటి వరకు జరిగిందంతా సరైన దిశలోనే జరిగిందని, భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్ధామని అన్నారు. బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎన్నికపై మాట్లాడుతూ, దీంట్లో ఎలాంటి జోక్యం ఉండదని, అది బీజేపీ చేస్తుందని, సంఘ్ కింద 32కి పైగా సంస్థలు ఉన్నాయని, ప్రతీది కూడా స్వతంత్రమైనదే అని, సొంత నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు
తాజావార్తలు
-
Explainer: అట్లాంటిక్ కింద 300°C వేడి నీరు.. సూర్యకాంతి లేకుండా జీవం ఎలా బతుకుతోంది?
-
KTR: 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా.!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Sakshi Jha: సాక్షి ఝా ‘మ్యాన్ హేటర్’ వ్యాఖ్యలు.. భర్తకు మద్యం తాగించి చంపాలనుకుంటున్నట్లు చెప్పిన వైనం
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?