RSS: “దారా షికో”ని కాకుండా “ఔరంగజేబు”ని కొలుస్తున్నారు.. వారు దేశానికి ప్రమాదం..
- ఔరంగజేబు వివాదం నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ కీలక వ్యాఖ్యలు.. దారా షికోని కాకుండా ఔరంగజేబుని ఆరాధిస్తున్నారు.. అలాంటి ఆక్రమణదారు మనస్తత్వం భారత్కి ప్రమాదం.. ఆర్ఎస్ఎస్ దత్తాత్రేయ హోసబాలే కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RSS: ఔరంగజేబు సమాధి వివాదం నడుస్తు్న్న వేళ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే మాట్లాడుతూ.. ‘‘ భారతదేశ నైతికతకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తిని ఆరాధిస్తున్నామా..? ఆక్రమణదారుల మనస్తత్వం ఉన్నవారు భారతదేశానికి ముప్పు’’ అని అన్నారు. ఆర్ఎస్ఎస్ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన అఖిల భారతీయ ప్రతినిధి సభ ముగింపు రోజున ఇక్కడ విలేకరులను ఉద్దేశించి హోసబాలే మాట్లాడారు. సామాజిక సామరస్యాన్ని విశ్వసించే ఔరంగజేబు సోదరుడు దారా షికోని కాదని ఔరంగజేబుని ఒక ఐకాన్గా చేశారని ఆయన అన్నారు.
గతంలో చాలా సంఘటనలు జరిగాయి. ‘‘ఢిల్లీలో ఔరంగజేబు రోడ్డు ఉండేది, దానికి అబ్దుల్ కలాం రోడ్డుగా మార్చారు. దాని వెనక కారణం ఉంది. ఔరంగజేబు సోదరుడు దారుషికోని హీరోగా చేయలేదు. గంగా-జముని సంస్కృతిని సమర్థించే వారు దారా షికోను ముందుకు తీసుకురావాలని ఎప్పుడూ అనుకోలేదు. భారతదేశ నైతికతకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తిని మనం ఐకాన్గా చూపిస్తామా లేక ఈ భూమి సంప్రదాయాల ప్రకారం పనిచేసే వారితో మనం వెళ్తామా?’’ అని ఆయన అడిగారు.
Also Read
Read Also: Murder : రంగారెడ్డి జిల్లాలో దారుణం.. అప్పుల వివాదంతో యువకుడి దారుణ హత్య
ఆక్రమణదారుల మనస్తత్వం ఉన్న వ్యక్తులు దేశానికి ముప్పు కలిగిస్తారని, మొఘల్ చక్రవర్తి అక్బర్కు వ్యతిరేకంగా పోరాడిన రాజ్పుత్ రాజు మహారాణా ప్రతాప్ వంటి వ్యక్తులను హోసబాలే ప్రశంసించారు. ‘‘ బ్రిటిషర్లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం స్వాతంత్య్ర పోరాటం. వారికి ముందు ఉన్నవారికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం కూడా ఒక స్వాతంత్య్ర పోరాటమే. మహారాణా ప్రతాప్ స్వేచ్ఛ కోసం పోరాటం చేశారు. ఆక్రమణదారుల మనస్తత్వం ఉన్న వ్యక్తులు దేశానికి ప్రమాదం. మన దేశ నైతికతతో ఎవరు సరిపోతారో మనం నిర్ణయించుకోవాలి. ఇది మతం గురించి కాదు. ఇది ఆర్ఎస్ఎస్ దృఢమైన అభిప్రాయం’’ అని అన్నారు.
వక్ఫ్ బిల్లుపై మాట్లాడుతూ.. ప్రభుత్వం వక్ఫ్పై ఒక కమిషన్ ఏర్పాటు చేసింది, వారు ఏమి తీసుకువస్తారో చూద్దాము, ఇప్పటి వరకు జరిగిందంతా సరైన దిశలోనే జరిగిందని, భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్ధామని అన్నారు. బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎన్నికపై మాట్లాడుతూ, దీంట్లో ఎలాంటి జోక్యం ఉండదని, అది బీజేపీ చేస్తుందని, సంఘ్ కింద 32కి పైగా సంస్థలు ఉన్నాయని, ప్రతీది కూడా స్వతంత్రమైనదే అని, సొంత నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!