TheTigers Attacked: ఒడిస్సాలో కలకలం సృష్టిస్తున్న పులులు.. భయాందోళనలో ప్రజలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Odisha: కొద్ది నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ లోని చింతూరు జిల్లా తిరుమలలో చిరుతలు బీభత్సం సృష్టించిన విషయం అందరికి సుపరిచితమే.. అప్పుడు తిరుమలకు కాలినడకన వెళ్లేందుకు ప్రజలు చాల భయపడ్డారు. అయితే ప్రభుత్వం చర్యలను తీసుకుని చిరుతల బెడదను తొలిగించింది. కాగా ప్రస్తుతం ఒడిస్సా రాష్ట్రంలో పులులు కలకలం సుష్టిస్తున్నాయి. దీనితో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. వివరాలలోకి వెళ్తే.. శనివారం ఒడిస్సా రాష్ట్రం లోని నువాపాడ జిల్లా సదర్ రేంజ్, ధరంబంధ పోలీస్ స్టేషన్, సిలారిబహరా గ్రామం లో దారుణం చోటు చేసుకుంది. శనివారం నువాపాడ జిల్లా లోని సిలారిబహరా గ్రామానికి చెందిన మాజీ వార్డు సభ్యురాలు రామేశ్వరి మాఝీ(50) పైన పులి దాడి చేసింది. ఈ దాడిలో ఆమె మరణించగా అనంతరం ఆమె మృతదేహాన్ని పులి తినేసింది.
Read also:Anam Venkata Ramana Reddy: పేదలెవరో, పెత్తందార్లు ఎవరో జగనే చెప్పాలి..
Also Read
సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు పులిని పట్టుకున్నారు. ఈ ఘటన జరిగి 24 గంటలు గడవకముందే ఆదివారం మరో పులి మళ్లీ భీభత్సం సృష్టించింది. ధర్మబంధ పోలీస్ స్టేషన్ పరిధి లోని కోడోపాలి గ్రామంలో ఓ చిన్నారిపై పులి దాడి చేసింది. కాగా ఆ పులి భారీ నుండి గ్రామస్థులు చిన్నారిని రక్షించారు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉండడంతో నువాపా జిల్లా జనరల్ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ నేపథ్యంలో ధర్మబంధ పోలీస్ స్టేషన్ పరిధి లోని కోడోపాలి గ్రామ సమీపంలో పులి సంచరిస్తున్నట్లు గ్రామస్తులు గుర్తించారు. దీంతో వారు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖ అధికారులు కోడోపలికి చేరుకుని పులి సంచారాన్ని పర్యవేక్షిస్తున్నారు.
తాజావార్తలు
-
US Woman Shocked: అమెరికాలో రూ.85 వేలు, భారత్లో రూ.35 మాత్రమే.. మందుల ధరలపై మహిళ షాక్..
-
PM Modi: న్యూజిలాండ్ టూర్కు మోడీ.. 40 ఏళ్లలో తొలి భారత ప్రధానిగా రికార్డ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Falcon Scam : 14 కోట్ల విమానం 3 కోట్లకే.. దేశంలోనే తొలిసారిగా విమానాన్ని ఈ-వేలం.!
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
ట్రెండింగ్
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!
-
IND vs ENG 2nd T20: సంజును తొలగించకుండా, వైభవ్కు అవకాశం ఇవ్వాలంటే.. ఇదొక్కటే మార్గం!
-
IND vs ENG 2nd T20: సంజు అవుట్, వైభవ్ ఇన్.. రెండో టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!