Congress: “జ్ఞానేశ్ కుమార్ను అమెరికాకు తీసుకెళ్లండి”.. ట్రంప్ ప్రశంసలపై కాంగ్రెస్ కౌంటర్..
- భారత ఎన్నికల విధానాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు..
- భారత CEC జ్ఞానేశ్ కుమార్ వ్యాఖ్యలను ట్రంప్ పోస్ట్..
- అమెరికాలో SAVE Act ఆమోదానికి ఉదాహరణగా భారత ఎన్నికల విధానం..
- ట్రంప్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత పవన్ ఖేరా సెటైర్లు..
- “జ్ఞానేశ్ కుమార్ను అమెరికాకు తీసుకెళ్లండి” అని ఖేరా వ్యాఖ్య.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఎన్నికల విధానాన్ని, ఎన్నికల సంఘాన్ని ప్రశంసించారు. అమెరికాలో సేవ్ యాక్ట్ను ఆమోదించాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రశంసలపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. భారత ఎన్నికల సంఘం(ECI) చేపట్టిన్ SIR ప్రక్రియపై ఇప్పటికే కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ ప్రక్రియ ద్వారా ఓటర్లను తొలగిస్తున్నారని ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్పై ట్రంప్ ప్రశంసలు కాంగ్రెస్లో ఆగ్రహాన్ని పెంచాయి.
కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ పవన్ ఖేరా మంగళవారం ట్రంప్ను ఉద్దేశించి వ్యంగ్యంగా స్పందించారు. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ను అమెరికాకు తీసుకెళ్లాలని, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు (EVMలు) కూడా పంపిస్తామని వ్యాఖ్యానించారు. ‘‘ ప్రియమైన డొనాల్డ్ ట్రంప్, దయచేసి జ్ఞానేశ్ కుమార్ను అమెరికాకు తీసుకెళ్లండి. ఆయనను అక్కడే ఉంచుకోండి. మా EVMలను కూడా తదుపరి అందుబాటులో ఉన్న విమానంలో పంపిస్తాం’’ అని కామెంట్స్ చేశారు.
Also Read
- Allahabad High Court: దంతాలు, వెంట్రుకలతో బాలికగా తేల్చలేం.. అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
- Putin: జూడోలో బ్లాక్ బెల్ట్.. KGB గూఢచారి.. చివరికి రష్యా అధ్యక్షుడు.. పుతిన్ జీవితం ఆసక్తికరం!
- Modi-Putin: మోడీతో పుతిన్ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
- China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్ వేదికగా అమెరికాలో SAVE Actను ఆమోదించాలని మరోసారి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా భారత ఎన్నికల విధానం, ఓటర్ల గుర్తింపు అవసరాలను ప్రస్తావించారు.సీఈసీ జ్ఞానేశ్ కుమార్ అమెరికా ఎన్నికల వ్యవస్థపై మాట్లాడినట్లు ట్రంప్ ప్రస్తావించారు. ‘చెల్లుబాటు అయ్యే ఫోటో ఐడీ లేకుండా అమెరికాలో ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు’ అని జ్ఞానేశ్ కుమార్ తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్లు ట్రంప్ తెలిపారు. ట్రంప్ భారత్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్ని ప్రస్తావిస్తూ.. దాదాపుగా 64.4 కోట్ల మంది ఓటర్లు ఎన్నికల్లో పాల్గొన్నారని, ఒక శాతానికి కన్నా తక్కువ మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేశారని, ప్రతీ ఓటర్ కూడా చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు పత్రాన్ని కలిగి ఉన్నారని చెప్పారు.
మరోవైపు, అమెరికాలో సేవ్ యాక్ట్ను వెంటనే ఆమోదించాలని ట్రంప్ మరోసారి కాంగ్రెస్ను కోరారు. ఈ చట్టం ద్వారా ఫెడరల్ ఎన్నికల్లో కేవలం అమెరికా పౌరులు మాత్రమే ఓటే వేసేలా నిబంధనలు తీసుకువచ్చేందుకు సిద్ధమయ్యారు. ఓటు నమోదు చేసుకునే సమయంలో చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రంతో పాటు పౌరసత్వానికి సంబంధించిన ఆధారాలు సమర్పించాల్సి ఉంటుందని తెలుస్తోంది. “అమెరికా ఎన్నికలను అమెరికన్ పౌరులు మాత్రమే నిర్ణయించాలి” అని వైట్హౌస్ పేర్కొంది.
తాజావార్తలు
-
Allahabad High Court: దంతాలు, వెంట్రుకలతో బాలికగా తేల్చలేం.. అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
-
Bhatti Vikramarka : దేశానికే ఆదర్శం తెలంగాణ కులగణన మోడల్..
-
Lava Smart Phone: లావా నుంచి బడ్జెట్ ఫోన్.. 6,000mAh బ్యాటరీ, ఎల్సీడీ టచ్స్క్రీన్.. సెప్టెంబర్ 18న లాంచ్..
-
Putin: జూడోలో బ్లాక్ బెల్ట్.. KGB గూఢచారి.. చివరికి రష్యా అధ్యక్షుడు.. పుతిన్ జీవితం ఆసక్తికరం!
-
Modi-Putin: మోడీతో పుతిన్ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?