Mahua Moitra: ‘‘క్యాష్ ఫర్ క్వేరీ’’ కేసులో టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రాకు సమన్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahua Moitra: పార్లమెంట్ లో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు, ఖరీదైన గిఫ్టులను లంచంగా తీసుకున్న ఆరోపణలను ఎదుర్కొంటున్నారు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ మహువా మోయిత్రా. ఈ కేసులో ప్రముఖ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ, పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ ముందు అఫిడవిట్ దాఖలు చేయడంతో మోయిత్రా కేసులో చిక్కుకుంది. తాజాగా ‘‘క్యాఫ్ ఫర్ క్వేరీ’’ అని పిలువబడుతున్న ఈ కేసులో లోక్సభ ఎథిక్స్ కమిటీ మహువా మోయిత్రాకు సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 31న హాజరుకావాలని ఆదేశించింది. ఈమెపై వచ్చిన ఆరోపణల్ని కమిటీ తీవ్రంగా పరిగణిస్తోంది.
మహువా మోయిత్రాపై ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబేతో పాటు న్యాయవాది జై అనంత్ దేహద్రాయ్లను కమిటీ మూడు గంటల పాటు విచారించిన తర్వాత సమన్లు జారీ చేసింది. వీరు చేసిన ఆరోపణల్లో ప్రతీ అంశాన్ని కమిటీ చర్చించినట్లు తెలిసింది. లోతైన దర్యాప్తు కోసం కేసుకు సంబంధించిన కీలక అంశాలపై వివరాలు కోరుతూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, హోం మంత్రిత్వ శాఖకు లేఖలు పంపినట్లు ఎథిక్స్ కమిటీ చైర్మన్ వినోద్ సోంకర్ విలేకరులకు తెలిపారు.
Also Read
- Nurjahan Mango: బాబోయ్.. ఒక్క మామిడి పండు ధర రూ.3,000, దీని ’ స్పెషాలిటీ ఏంటో తెలుసా?
- Sasaram-Patna Passenger: 24 గంటలు గడవకముందే వణికించిన మరో రైలు ప్రమాదం.. ప్యాసింజర్ రైలులో చెలరేగిన మంటలు
- Bharat Gaurav: నేపాల్కు 'భారత్ గౌరవ్' పర్యాటక రైలు.. ప్రారంభించనున్న ఐఆర్సీటీసీ.. ఛార్జీలు, పూర్తి వివరాలు
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Read Also: China: చైనాలో ఏం జరుగుతోంది..? రక్షణ, విదేశాంగ మంత్రుల తొలగింపు..
ప్రధాన మంత్రి నరేంద్రమోడీతో పాటు పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీలపై విమర్శలు చేసేందుకు, అందుకు తగ్గట్లు పార్లమెంట్ లో ప్రశ్నలు అడిగింనందుకు మహువా మోయిత్రా, వ్యాపారవేత్త దర్శన్ హీరానందాని నుంచి లంచం తీసుకున్నట్లు నిషికాంత్ దూబే ఆరోపించారు. ఆ తరువాత హీరానందానీ కూడా ఈ ఆరోపణలు నిజమే చెబుతూ ఎథిక్స్ కమిటీకి లేఖ రాశారు. తాను చేయకూడని తప్పులు చేయించిందని మోయిత్రాపై ఆరోపణలు చేశారు.
ఈ విషయమై ఇప్పటికే నిషికాంత్ దూబే పార్లమెంట్ స్పీకర్ ఓంబిర్లాకు లేఖ రాశారు. ఇదిలా ఉంటే మోయిత్రా పార్లమెంట్ లాగిన్ వివరాలను వేరేవారితో పంచుకుందని, ఆమె ఇండియాలో ఉన్న సమయంలో కూడా దుబాయ్ కేంద్రంగా లాగిన్ అయినట్లు ఆరోపించారు. దీనిపై విచారించాల్సిందిగా కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ కి లేఖ రాశారు. అయితే ఈ వ్యవహారంలో టీఎంసీ పార్టీ కూడా ఆమెకు దూరంగా ఉంటోంది.
తాజావార్తలు
-
Nurjahan Mango: బాబోయ్.. ఒక్క మామిడి పండు ధర రూ.3,000, దీని ’ స్పెషాలిటీ ఏంటో తెలుసా?
-
Riyan Parag: తప్పంతా నాదే, మేం ప్లేఆఫ్స్కు అర్హులం కాదు.. రాజస్థాన్ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు!
-
Sasaram-Patna Passenger: 24 గంటలు గడవకముందే వణికించిన మరో రైలు ప్రమాదం.. ప్యాసింజర్ రైలులో చెలరేగిన మంటలు
-
Sorakaya Uttappam Recipe: సొరకాయతో సూపర్ టేస్ట్.. మెత్తటి ‘సొరకాయ ఉత్తప్పం’ రెసిపీ..
-
James Hopes: “గెలిచే మ్యాచ్లను చేతులారా పాడుచేసుకున్నాం”.. ఆఫ్ ది ఫీల్డ్ వివాదాలపై పంజాబ్ కోచ్ క్లారిటీ!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..