Pakistan: ప్రధాని మోడీ అమెరికా పర్యటనపై పాకిస్తాన్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటనపై పాకిస్తాన్ లోలోపల భయపడుతోంది. ఇప్పటికే పీకల్లోతు అప్పులు, ఆర్థిక కష్టాల్లో ఉన్న పాకిస్తాన్, భారత ఎదుగుదల, ప్రధాని నరేంద్రమోడీకి దొరుకుతున్న గౌరవాన్ని చూసి తట్టుకోలేకపోతోంది. తాజాగా ప్రధాని అమెరికా పర్యటనపై పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిప్ స్పందించారు. భారత్తో అమెరికా తన సంబంధాలను మరింతగా పెంచుకోవడంతో ఇస్లామాబాద్కు ఎలాంటి సమస్య లేదని అన్నారు. అయితే పాకిస్తాన్ కు నష్టం కలిగించకపోతే, భారతదేశంతో భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేసుకుంటున్న అమెరికాతో మాకు ఎలాంటి సమస్య లేదని ఆయన అన్నారు.
Read Also: Mahindra’s Armado: ఆర్మీ కోసం మహీంద్రా “ఆర్మడో”.. బండి మామూలుగా లేదుగా..!
Also Read
- PM Modi: "నీట్ పేపర్ లీక్ 'ఘోర పాపం'.. కఠిన శిక్ష తప్పదు".. ప్రధాని మోడీ సీరియస్ వార్నింగ్
- Abhijeet Deepke: ఎవరీ అభిజీత్ దీప్కే? ఆందోళనలకు నిధులు ఎక్కడివి?.. ‘సీజేపీ’ నిరసనల వెనుక దాగి ఉన్న ప్రశ్నలు, అనుమానాలు!
- Ram Mandir Donation Theft Case: అయోధ్య రామ మందిర కేసులో కీలక మలుపు.. కొత్త సిట్ ఏర్పాటు..!
- CJP Protest: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..118 మంది పోలీసులకు గాయాలు.. పోలీసుల అదుపులో 70 మంది
కాశ్మీర్ సమస్యపై గురించి అడిగిన ప్రశ్నకు బదులుగా.. పాకిస్తాన్ తన పొరుగు దేశాలు, ప్రాంతీయ భాగస్వాములతో సత్సంబంధాలను కోరుకుంటోందని మంత్రి అన్నారు. మాకు చైనా, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, భారత్ తో ఉమ్మడి సరిహద్దులు ఉన్నాయి. మేము అందరితో సత్సంబంధాలు పెంచుకోవాలని అనుకుంటున్నామని, శాంతియుతంగా జీవించాలని అనుకుంటున్నామని అన్నారు. శాంతి లేకుంటే ఆర్థికంగా ఎదగడం ఎప్పటికీ జరగదని ఖవాజా ఆసిఫ్ అన్నారు.
ప్రధాని నరేంద్రమోడీ ఈ నెల 21 నుంచి 24 వరకు అమెరికాలో పర్యటించనున్నారు. మోడీ పర్యటన నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ పర్యటన ద్వారా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అయ్యేందుకు అవకాశం ఏర్పడుతుందని ఇరు దేశాలు భావిస్తున్నాయి. జూన్ 20న మోడీ న్యూయార్క్ చేరుకోనున్నారు.. జూన్ 21న యూఎన్ ప్రధాన కార్యాలయంలో 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు నాయకత్వం వహిస్తారు. భారత-అమెరిన్లను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. జూన్ 22న మోడీకి అధికారిక స్వాగత వేడుకను చూసేందుకు భారతీయ అమెరికన్లు పెద్ద సంఖ్యలో అమెరికా రాజధానికి వెళ్లనున్నారు.అదే రోజు అమెరికా కాంగ్రెస్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో ప్రసంగించనున్నారు. ప్రధాని మోడీకి ప్రెసిడెంట్ జోబైడెన్, ఫస్ట్ లేడీ జిల్ బైడెన్ వైట్ హౌజులో ఇవ్వనున్నారు.
తాజావార్తలు
-
Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో సంచలనం.. డీజీపీ, సీపీ పేర్లు చేర్చాలంటూ..!
-
PM Modi: “నీట్ పేపర్ లీక్ ‘ఘోర పాపం’.. కఠిన శిక్ష తప్పదు”.. ప్రధాని మోడీ సీరియస్ వార్నింగ్
-
Realme Power Days సేల్.. P4 Power 5G, P4 Pro 5Gపై భారీ తగ్గింపు.. ఆఫర్లు ఇవే.!
-
Maruthi Next : మారుతీ డైరెక్షన్ లో వరుణ్ తేజ్.. అవసరమా అధ్యక్ష్యా?
-
Tattoo Trends 2026: టాటూ ప్లేస్మెంట్ ఎందుకు ముఖ్యం..? 2026లో మారుతున్న కొత్త ట్రెండ్ ఇదే
ట్రెండింగ్
-
Rohit Sharma Retirement: రోహిత్ మనసులో రెండు గాయాలు.. అందుకే రిటైర్ కాలేదు.. మరి ఎప్పుడు?
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?