ఆఫ్ఘన్కు భారత్ సాయం పై పాక్ షరతులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆఫ్ఘనిస్థాన్కు భారత్ సాయం అందించేందుకు పాకిస్తాన్ తన షరతుల జాబితాను భారత్కు పంపించింది. ఆఫ్ఘనిస్తాన్కు మానవతా సహాయంగా వాఘా ద్వారా 50,000 మెట్రిక్ టన్నుల గోధుమలు,ప్రాణాలను రక్షించే మందులను రవాణా చేయడాన్ని అనుమతిస్తున్నట్లు పాకిస్థాన్ అధికారికంగా ప్రకటించిన తర్వాత ఈ నిబంధనలు విధించింది. ఇప్పుడు ఇస్లామాబాద్ పెట్టిన రెండు షరతులు భారత్కు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒకటి, సామాగ్రిని పాకిస్తానీ ట్రక్కుల ద్వారా రవాణా చేయాలని పాక్ పట్టుబడుతుంది. భారతీయులు కాకపోతే కనీసం ఆఫ్ఘన్ ట్రక్కులు మెటీరియల్ని ఆఫ్ఘనిస్తాన్కు తీసుకెళ్లవచ్చని భారతదేశం ప్రతిపాదించింది. గతంలో కూడా వస్తువుల రవాణా కోసం ఆఫ్ఘన్ ట్రక్కులు ఈ రోడ్లపై తిరిగాయని భారత్ చెబుతుంది కానీ పాక్ తమ ట్రక్కులకే అనుమతిస్తామని తెలిపింది.
రెండవది, ఆఫ్ఘనిస్తాన్కు పంపే సహాయంపై షిప్మెంట్ ఛార్జీలు విధించాలని పాకిస్తాన్ కోరుతుంది. మానవతా సహాయంగా పంపుతున్న సామాగ్రిపై ఎలాంటి అదనపు ఖర్చు ఉండకూడదని భారత్ పట్టుబడుతుంది. ఐక్యరాజ్యసమితి ఏజెన్సీల ద్వారా ఆఫ్ఘన్ ప్రజలకు వీలైనంత త్వరగా సాయం అందేలా ఒక అవగాహనకు రావడానికి చర్చలు జరుగుతున్నాయి. వాఘా సరిహద్దు వద్ద లోడ్ చేయడం మరియు అన్లోడ్ చేయడం వల్ల లాజిస్టికల్ అవాంతరాలు ఏర్పడవచ్చని ఇరు దేశాల అధికారులు చెబుతున్నారు.
Also Read
- Delhi: దేశ వ్యాప్తంగా బాంబ్ బెదిరింపులు.. ఘజియాబాద్ వ్యక్తి అరెస్ట్
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్న్యూస్.. 74 ఏళ్లుగా ఉన్న కీలక సమస్యకు పరిష్కారం
- Supreme Court: సుప్రీం కోర్టుకు హనీమూన్ మర్డర్ కేసు.. ఏం జరిగిందంటే..!
- Murder Case: 'నీలాంటి భర్తలు వెయ్యి మంది దొరుకుతారు'.. ఆ ఒక్క మాటతో జరిగిన ఘోరం, హైకోర్టు కీలక తీర్పు
నవంబర్ 24న, పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది. సోదర ఆప్ఘన్ ప్రజల పట్ల సద్భావనగా, భారతదేశం నుండి వాఘా సరిహద్దు మీదుగా ఆఫ్ఘనిస్తాన్కు చేస్తున్న సాయాన్ని అనుమతించేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయించింది. మానవతా ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని పాక్ వెల్లడించింది.
దీనిపై స్పందించిన భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఆఫ్ఘనిస్తాన్కు చేరుకోవడానికి సహాయానికి గడువు లేదని, అయితే శీతాకాలాలు సమీపిస్తున్నందున, వీలైనంత త్వరగా సహాయం పంపాలని భారతదేశం చూస్తోందని చెప్పారు. బాగ్చి మాట్లాడుతూ.. వస్తువులు మరియు సహాయ కార్మికులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా మరియు అడ్డంకులు లేని యాక్సెస్ కోసం పాకిస్థాన్ పిలుపునివ్వాలని బాగ్చీ తెలిపారు. శీతాకాలాలు సమీపిస్తు న్నందున, భయంకరమైన పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఈ ప్రాంత భద్రతా అధిపతులు తెలిపిన వాస్తవ పరిస్థితుల నేపథ్యంలో సాయంపై పాక్ ఎలాంటి నిబంధనలు విధించొద్దని కోరుకుంటున్నామని బాగ్చీ తెలిపారు.
తాజావార్తలు
-
Delhi: దేశ వ్యాప్తంగా బాంబ్ బెదిరింపులు.. ఘజియాబాద్ వ్యక్తి అరెస్ట్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
Khammam Police : ఖమ్మంలో ఖాకీ కుంభకోణం.. పోలీసులే దోపిడీ ముఠాలో కీలక సభ్యులు
-
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్న్యూస్.. 74 ఏళ్లుగా ఉన్న కీలక సమస్యకు పరిష్కారం
-
Dhruv Vikram: మైత్రీ మూవీ మేకర్స్ 4వ తమిళ సినిమాలో హీరోగా ధృవ్ విక్రమ్
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!