ఆఫ్ఘన్కు భారత్ సాయం పై పాక్ షరతులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆఫ్ఘనిస్థాన్కు భారత్ సాయం అందించేందుకు పాకిస్తాన్ తన షరతుల జాబితాను భారత్కు పంపించింది. ఆఫ్ఘనిస్తాన్కు మానవతా సహాయంగా వాఘా ద్వారా 50,000 మెట్రిక్ టన్నుల గోధుమలు,ప్రాణాలను రక్షించే మందులను రవాణా చేయడాన్ని అనుమతిస్తున్నట్లు పాకిస్థాన్ అధికారికంగా ప్రకటించిన తర్వాత ఈ నిబంధనలు విధించింది. ఇప్పుడు ఇస్లామాబాద్ పెట్టిన రెండు షరతులు భారత్కు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒకటి, సామాగ్రిని పాకిస్తానీ ట్రక్కుల ద్వారా రవాణా చేయాలని పాక్ పట్టుబడుతుంది. భారతీయులు కాకపోతే కనీసం ఆఫ్ఘన్ ట్రక్కులు మెటీరియల్ని ఆఫ్ఘనిస్తాన్కు తీసుకెళ్లవచ్చని భారతదేశం ప్రతిపాదించింది. గతంలో కూడా వస్తువుల రవాణా కోసం ఆఫ్ఘన్ ట్రక్కులు ఈ రోడ్లపై తిరిగాయని భారత్ చెబుతుంది కానీ పాక్ తమ ట్రక్కులకే అనుమతిస్తామని తెలిపింది.
రెండవది, ఆఫ్ఘనిస్తాన్కు పంపే సహాయంపై షిప్మెంట్ ఛార్జీలు విధించాలని పాకిస్తాన్ కోరుతుంది. మానవతా సహాయంగా పంపుతున్న సామాగ్రిపై ఎలాంటి అదనపు ఖర్చు ఉండకూడదని భారత్ పట్టుబడుతుంది. ఐక్యరాజ్యసమితి ఏజెన్సీల ద్వారా ఆఫ్ఘన్ ప్రజలకు వీలైనంత త్వరగా సాయం అందేలా ఒక అవగాహనకు రావడానికి చర్చలు జరుగుతున్నాయి. వాఘా సరిహద్దు వద్ద లోడ్ చేయడం మరియు అన్లోడ్ చేయడం వల్ల లాజిస్టికల్ అవాంతరాలు ఏర్పడవచ్చని ఇరు దేశాల అధికారులు చెబుతున్నారు.
Also Read
- India: చైనా, అమెరికాలకు పోటీగా భారత్.. ఫ్రాన్స్తో కలిసి 6th జనరేషన్ ఫైటర్ జెట్!
- UP: డేటింగ్ యాప్తో బ్లాక్మెయిల్.. రూ.6 కోట్లు నొక్కేసిన కిలాడీ!
- UPI Charges: UPI ఛార్జీలపై కీలక అప్డేట్.. కిరాణా దుకాణాలు, చిన్న వ్యాపారులకు గుడ్న్యూస్
- Jharkhand: జార్ఖండ్లో పేపర్ లీక్ నిరసనలు.. ప్రభుత్వంతో చర్చలు విఫలం
నవంబర్ 24న, పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది. సోదర ఆప్ఘన్ ప్రజల పట్ల సద్భావనగా, భారతదేశం నుండి వాఘా సరిహద్దు మీదుగా ఆఫ్ఘనిస్తాన్కు చేస్తున్న సాయాన్ని అనుమతించేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయించింది. మానవతా ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని పాక్ వెల్లడించింది.
దీనిపై స్పందించిన భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఆఫ్ఘనిస్తాన్కు చేరుకోవడానికి సహాయానికి గడువు లేదని, అయితే శీతాకాలాలు సమీపిస్తున్నందున, వీలైనంత త్వరగా సహాయం పంపాలని భారతదేశం చూస్తోందని చెప్పారు. బాగ్చి మాట్లాడుతూ.. వస్తువులు మరియు సహాయ కార్మికులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా మరియు అడ్డంకులు లేని యాక్సెస్ కోసం పాకిస్థాన్ పిలుపునివ్వాలని బాగ్చీ తెలిపారు. శీతాకాలాలు సమీపిస్తు న్నందున, భయంకరమైన పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఈ ప్రాంత భద్రతా అధిపతులు తెలిపిన వాస్తవ పరిస్థితుల నేపథ్యంలో సాయంపై పాక్ ఎలాంటి నిబంధనలు విధించొద్దని కోరుకుంటున్నామని బాగ్చీ తెలిపారు.
తాజావార్తలు
-
UPI ఛార్జీలపై PhonePe CEO కీలక ప్రకటన.. వినియోగదారులకు గుడ్ న్యూస్!
-
India: చైనా, అమెరికాలకు పోటీగా భారత్.. ఫ్రాన్స్తో కలిసి 6th జనరేషన్ ఫైటర్ జెట్!
-
UP: డేటింగ్ యాప్తో బ్లాక్మెయిల్.. రూ.6 కోట్లు నొక్కేసిన కిలాడీ!
-
India Real Estate: Gen Z ఇళ్లకు దూరమవుతుందా?.. రియల్ ఎస్టేట్పై ప్రభావం ఎంత?.. ఆర్థిక వ్యవస్థను ఎలా మార్చొచ్చు?
-
UPI Charges: UPI ఛార్జీలపై కీలక అప్డేట్.. కిరాణా దుకాణాలు, చిన్న వ్యాపారులకు గుడ్న్యూస్
ట్రెండింగ్
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!