ఆఫ్ఘన్కు భారత్ సాయం పై పాక్ షరతులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆఫ్ఘనిస్థాన్కు భారత్ సాయం అందించేందుకు పాకిస్తాన్ తన షరతుల జాబితాను భారత్కు పంపించింది. ఆఫ్ఘనిస్తాన్కు మానవతా సహాయంగా వాఘా ద్వారా 50,000 మెట్రిక్ టన్నుల గోధుమలు,ప్రాణాలను రక్షించే మందులను రవాణా చేయడాన్ని అనుమతిస్తున్నట్లు పాకిస్థాన్ అధికారికంగా ప్రకటించిన తర్వాత ఈ నిబంధనలు విధించింది. ఇప్పుడు ఇస్లామాబాద్ పెట్టిన రెండు షరతులు భారత్కు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒకటి, సామాగ్రిని పాకిస్తానీ ట్రక్కుల ద్వారా రవాణా చేయాలని పాక్ పట్టుబడుతుంది. భారతీయులు కాకపోతే కనీసం ఆఫ్ఘన్ ట్రక్కులు మెటీరియల్ని ఆఫ్ఘనిస్తాన్కు తీసుకెళ్లవచ్చని భారతదేశం ప్రతిపాదించింది. గతంలో కూడా వస్తువుల రవాణా కోసం ఆఫ్ఘన్ ట్రక్కులు ఈ రోడ్లపై తిరిగాయని భారత్ చెబుతుంది కానీ పాక్ తమ ట్రక్కులకే అనుమతిస్తామని తెలిపింది.
రెండవది, ఆఫ్ఘనిస్తాన్కు పంపే సహాయంపై షిప్మెంట్ ఛార్జీలు విధించాలని పాకిస్తాన్ కోరుతుంది. మానవతా సహాయంగా పంపుతున్న సామాగ్రిపై ఎలాంటి అదనపు ఖర్చు ఉండకూడదని భారత్ పట్టుబడుతుంది. ఐక్యరాజ్యసమితి ఏజెన్సీల ద్వారా ఆఫ్ఘన్ ప్రజలకు వీలైనంత త్వరగా సాయం అందేలా ఒక అవగాహనకు రావడానికి చర్చలు జరుగుతున్నాయి. వాఘా సరిహద్దు వద్ద లోడ్ చేయడం మరియు అన్లోడ్ చేయడం వల్ల లాజిస్టికల్ అవాంతరాలు ఏర్పడవచ్చని ఇరు దేశాల అధికారులు చెబుతున్నారు.
Also Read
- Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
నవంబర్ 24న, పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది. సోదర ఆప్ఘన్ ప్రజల పట్ల సద్భావనగా, భారతదేశం నుండి వాఘా సరిహద్దు మీదుగా ఆఫ్ఘనిస్తాన్కు చేస్తున్న సాయాన్ని అనుమతించేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయించింది. మానవతా ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని పాక్ వెల్లడించింది.
దీనిపై స్పందించిన భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఆఫ్ఘనిస్తాన్కు చేరుకోవడానికి సహాయానికి గడువు లేదని, అయితే శీతాకాలాలు సమీపిస్తున్నందున, వీలైనంత త్వరగా సహాయం పంపాలని భారతదేశం చూస్తోందని చెప్పారు. బాగ్చి మాట్లాడుతూ.. వస్తువులు మరియు సహాయ కార్మికులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా మరియు అడ్డంకులు లేని యాక్సెస్ కోసం పాకిస్థాన్ పిలుపునివ్వాలని బాగ్చీ తెలిపారు. శీతాకాలాలు సమీపిస్తు న్నందున, భయంకరమైన పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఈ ప్రాంత భద్రతా అధిపతులు తెలిపిన వాస్తవ పరిస్థితుల నేపథ్యంలో సాయంపై పాక్ ఎలాంటి నిబంధనలు విధించొద్దని కోరుకుంటున్నామని బాగ్చీ తెలిపారు.
తాజావార్తలు
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
-
అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!