Pakistan Army: పాకిస్తాన్ ఆర్మీకి వేల కోట్లలో వ్యాపారాలు.. వ్యవసాయం దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ దాకా..
- పాకిస్తాన్ ఆర్మీ యుద్ధం తప్పా అన్ని వ్యాపారాలు చేస్తోంది..
- వేల కోట్లలో వ్యాపార దందా..
- వ్యవసాయం దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ దాకా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Army: అన్ని దేశాలకు సైన్యం ఉంటుంది, కానీ పాకిస్తాన్ విషయంలో మాత్రం ఓ సైన్యానికి దేశం ఉందని చెప్పవచ్చు. భారత్ వంటి దేశాల్లో మిలిటరీ చీఫ్లుగా పని చేసిన వారు రిటైర్మెంట్ తర్వాత సాధాసీదా జీవితం గడుపుతారు. కానీ పాకిస్తాన్లో అలా కాదు మిలిటరీలో చేరితే జాక్పాట్ కొట్టినట్లు, ప్రభుత్వమే పదుల నుంచి వందల ఎకరాల భూమిని ఆర్మీలో పనిచేసిన వారికి ఇస్తుంది. ఇక అవినీతికి కొదువ లేదు. పాక్ ఆర్మీ చీఫ్లుగా పనిచేసినవారు తమ రిటైర్మెంట్ తర్వాత హాయిగా లండన్, దుబాయ్, ఖతార్ వంటి ప్రాంతాల్లో కుటుంబాలతో సెటిల్ అవుతారు. ఆ తర్వాత పాకిస్తాన్ వైపు కన్నెత్తి చూడరు.
పాకిస్తాన్ దేశ రక్షణ, యుద్ధం తప్పా అన్ని వ్యాపారాలు చేస్తోంది. పాకిస్తాన్ వ్యాప్తంగా మొత్తం వ్యాపార సామ్రాజ్యం పాక్ ఆర్మీ చేతిలోనే ఉంది. వ్యవసాయం దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ వరకు పాక్ ఆర్మీదే రాజ్యం. చివరకు నిత్యావసర వస్తువుల్లో కూడా ఆర్మీ హస్తం ఉంటుంది. సిమెంట్, ఎరువులు, బ్యాంకింగ్, పాడి పరిశ్రమ, రవాణా, గృహ నిర్మాణం అంతా ఆర్మీ చేతిలోనే. ప్రస్తుతం, వార్తల్లో హాట్ టాపిక్గా ఉన్న పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ బహిరంగ ఆస్తులే రూ. 6 కోట్ల (ఇండియన్ రూపాయలు) ఉన్నాయి. ఇక విదేశాల్లో, బినామీల పేర్లలో ఎన్ని ఆస్తులు ఉన్నాయో లెక్కే లేదు. సూటిగా చెప్పాలంటే పాక్ ఆర్మీ ఆ దేశంలో 100కి పైగా వ్యాపారాలను నిర్వహిస్తోంది. ప్రస్తుతం వ్యవసాయంలోకి దిగింది. చోలిస్థాన్ ఎడారి ప్రాంతంలో పెద్ద కెనాల్లను నిర్మించి, సింధు నది నీటిలో వ్యవసాయం చేయాలనుకుంటోంది.
Also Read
Read Also: GT vs SRH: మ్యాచ్ గెలిచి ప్లేఆఫ్ రేసులో ఎస్ఆర్ఎచ్ నిలుస్తుందా? మొదట బ్యాటింగ్ చేయనున్న జీటి
పాక్ ఆర్మీ వ్యాపార సామ్రాజ్యం:
పాకిస్తాన్ సైన్యం రక్షణతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థలో ఎక్కువ భాగాన్ని నియంత్రిస్తుంది. నిజానికి ఇది ప్రజా ప్రభుత్వాన్నే శాసిస్తుంది. ఆర్మీ చెప్పిందే అక్కడి ప్రభుత్వాలకు వేదం. పాక్ ఆర్మీ ఫౌజీ ఫౌండేషన్, ఆర్మీ వెల్ఫేర్ ట్రస్ట్, షాహీన్ ఫౌండేషన్, బహ్రియా ఫౌండేషన్ వంటి సంస్థలను నిర్వహిస్తుంది. ఇది పెద్ద కార్పొరేట్ నెట్వర్క్.
ప్రసిద్ధ రచయిత్రి ఆయేషా సిద్ధిఖా రాసిన ‘‘మిలిటరీ ఇంక్.: ఇన్సైడ్ పాకిస్తాన్స్ మిలిటరీ ఎకానమీ’’ పుస్తకంలో పాక్ వ్యాపార సామ్రాజ్యం గురించి అన్ని వివరాలు ఉన్నాయి. కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్ ప్రాంతాల్లో పాక్ ఆర్మీ పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్నే స్థాపించింది. డిఫెన్స్ హౌసింగ్ అథారిటీ (DHA) పేరుతో పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థను రన్ చేస్తోంది. దీని విలువ బిలియన్ డాలర్లలో ఉంది. అయేషా సిద్దిఖీ ప్రకారం, 2007లోనే పాకిస్తాన్ వ్యాపార దందా విలువ 20 బిలియన్ డాలర్లు. ఇప్పుడు దీని విలువ 40-100 బిలియన్ డాలర్లు( భారత కరెన్సీలో రూ. 80,000 కోట్లు)గా ఉండొచ్చు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!