Captain Anshuman Singh: అమరుడి భార్యపై నీచమైన కామెంట్లు చేసింది పాకిస్తాన్ వ్యక్తి: ఎన్సీడబ్ల్యూ చీఫ్..
- కెప్టెన్ అన్షుమాన్ సింగ్ భార్యపై నీచమైన కామెంట్స్ చేసింది పాక్ వ్యక్తి..
- ఎన్సీడబ్ల్యూ చీఫ్ రేఖా శర్మ వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Captain Anshuman Singh: గతేడాది సియాచిన్ గ్లేసియర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ధైర్యసాహసాలు ప్రదర్శించి, అమరుడైన కెప్టెన్ అన్షుమాన్ సింగ్కి మరణానంతరం రెండో అత్యున్నత శాంతికాల శౌర్య పురస్కారం కీర్తి చక్ర ప్రకటించింది. ఆయన భార్య స్మృతి సింగ్, తల్లి జూలై 5న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ఈ అవార్డును స్వీకరించారు. పెళ్లైన నెలల వ్యవధిలోనే అన్షుమాన్ మరణించడం, తమ ప్రేమ, పెళ్లి గురించి ఎంతో బాధతో ఆమె మాట్లాడిన మాటలు అందర్ని కంటతడి పెట్టించాయి.
Read Also: Himanta Biswa Sarma: ‘‘ రైట్-వింగ్ నాయకులే లక్ష్యం’’.. ట్రంప్ హత్యాయత్నంపై అస్సాం సీఎం..
Also Read
ఇదిలా ఉంటే స్మృతి సింగ్ అవార్డు తీసుకుంటున్న ఫోటోలు వైరల్ కావడంతో, ఓ యూజర్ ఆమెను అగౌరవపరుస్తూ నీజంగా వ్యాఖ్యలు చేశాడు. ఇది సోషల్ మీడియాలో ఆగ్రహానికి కారణమైంది. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని, కేసు నమోదు చేయాలని జాతీయ మహిళా కమిషన్ ఆదేశించింది. దీనిపై ఢిల్లీ పోలీసులు తమ ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్ (IFSO) యూనిట్తో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ వ్యాఖ్యను పోస్ట్ చేసిన సోషల్ మీడియా ఖాతాకు సంబంధించిన వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. త్వరితగతిన విచారణ జరిపి మూడు రోజుల్లో తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని ఎన్సీడబ్ల్యూ కోరింది.
అయితే, అన్షుమాన్ సింగ్ భార్య స్మృతి సింగ్పై అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన వ్యక్తి పాకిస్తాన్కి చెందినవాడని జాతీయ మహిళా కమిషన్ (NCW) చైర్పర్సన్ రేఖా శర్మ పేర్కొన్నారు. ఇది అత్యంత దిగజారుడు వ్యాఖ్యలు అని, ఈ వ్యాఖ్యల్ని మేము సోషల్ మీడియాలో చూశామని, వెంటనే సుమోటోగా తీసుకున్నామని, సదరు వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారని చెప్పారు. అయితే, ఆ వ్యక్తి పాకిస్తాన్కి చెందిన వ్యక్తి కావచ్చని అన్నారు.
తాజావార్తలు
-
Tollywood: ఆ రెండు బిగ్ మూవీస్ రిలీజ్ ఎప్పుడు?
-
Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
-
Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
-
YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
-
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!